ETV Bharat / sports

'ధోనీ నాలుగో స్థానంలో ఆడితే మంచిది'

author img

By

Published : Aug 15, 2020, 5:38 PM IST

ఐపీఎల్​లో సీఎస్కే సారథి మహేంద్ర సింగ్​ ధోనీ నాలుగో స్థానంలో ఆడాలని అభిప్రాయపడ్డాడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్​ మైకెల్​ హస్సీ. మిడిల్​ ఆర్డర్ బ్యాట్స్​మెన్ పరిస్థితులకు అనుగుణంగా ఆడితే మంచి ఫలితాలొస్తాయని తెలిపాడు.

Batting at No. 4
ధోనీ

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్​ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమ జట్టు బలబలాలు గురించి మాట్లాడాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్​ మైకెల్​ హస్సీ. బ్యాటింగ్​ జట్టుకు బలం అని చెప్పాడు. మిడిల్​ఆర్డర్​లో ఆడేవారు పరిస్థితుల ఆధారంగా సమతుల్యం చేసుకుంటూ ఆడాలని సూచించాడు. దీని ద్వారా జట్టు విజయం సాధించే అవకాశం ఉందని అన్నాడు. దీంతో పాటు ధోనీ 4వ స్థానంలో ఆడడం మంచిదని అభిప్రాయపడ్డాడు.

Batting at No. 4
ధోనీ

జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, వారికి పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో తెలుసని అన్నాడు హస్సీ​. వీరంతా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపాడు.

"ఖాళీ స్టేడియాల్లో, బయోసెక్యూర్​ వాతవరణంలో జరగబోతున్న ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఉత్సహాంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరి ఆరోగ్య క్షేమం కోసం నిబంధనలు పాటించాలి. ప్రేక్షకులు స్టేడియంలో లేనప్పటికీ.. ఆటగాళ్లు మునపటి ఉత్సాహంతోనే ఆడతారని భావిస్తున్నా."

-మైకెల్​ హస్సీ, సీఎస్కే కోచ్​

ఐపీఎల్​లో పాల్గొనేందుకు ఆగస్టు 15 నుంచి 20 వరకు సీఎస్కే శిక్షణా ప్రారంభించింది. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్​ రైనా, కరణ్​ శర్మ, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా తదితర ఆటగాళ్లు చెన్నైకి చేరుకుని ఖాళీ స్డేడియంలోనే శిక్షణ చేస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​ వచ్చింది. ఆగస్టు 21న సీఎస్కే బృందం దుబాయ్​కు వెళ్లే అవకాశముంది. హెడ్​ కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​, బ్యాటింగ్​ కోచ్​ మైకెల్​ హస్సీ ఆగస్టు 22న జట్టుతో దుబాయ్​లో కలుస్తారు.

ఇది చూడండి ఐపీఎల్​ ముంగిట సీఎస్కే బృందంతో ధోనీ

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్​ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమ జట్టు బలబలాలు గురించి మాట్లాడాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్​ మైకెల్​ హస్సీ. బ్యాటింగ్​ జట్టుకు బలం అని చెప్పాడు. మిడిల్​ఆర్డర్​లో ఆడేవారు పరిస్థితుల ఆధారంగా సమతుల్యం చేసుకుంటూ ఆడాలని సూచించాడు. దీని ద్వారా జట్టు విజయం సాధించే అవకాశం ఉందని అన్నాడు. దీంతో పాటు ధోనీ 4వ స్థానంలో ఆడడం మంచిదని అభిప్రాయపడ్డాడు.

Batting at No. 4
ధోనీ

జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, వారికి పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో తెలుసని అన్నాడు హస్సీ​. వీరంతా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపాడు.

"ఖాళీ స్టేడియాల్లో, బయోసెక్యూర్​ వాతవరణంలో జరగబోతున్న ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఉత్సహాంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరి ఆరోగ్య క్షేమం కోసం నిబంధనలు పాటించాలి. ప్రేక్షకులు స్టేడియంలో లేనప్పటికీ.. ఆటగాళ్లు మునపటి ఉత్సాహంతోనే ఆడతారని భావిస్తున్నా."

-మైకెల్​ హస్సీ, సీఎస్కే కోచ్​

ఐపీఎల్​లో పాల్గొనేందుకు ఆగస్టు 15 నుంచి 20 వరకు సీఎస్కే శిక్షణా ప్రారంభించింది. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్​ రైనా, కరణ్​ శర్మ, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా తదితర ఆటగాళ్లు చెన్నైకి చేరుకుని ఖాళీ స్డేడియంలోనే శిక్షణ చేస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​ వచ్చింది. ఆగస్టు 21న సీఎస్కే బృందం దుబాయ్​కు వెళ్లే అవకాశముంది. హెడ్​ కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​, బ్యాటింగ్​ కోచ్​ మైకెల్​ హస్సీ ఆగస్టు 22న జట్టుతో దుబాయ్​లో కలుస్తారు.

ఇది చూడండి ఐపీఎల్​ ముంగిట సీఎస్కే బృందంతో ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.