హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఓడిపోయింది టీమిండియా. ఈ మ్యాచ్ తర్వాత భారత్కు మరోసారి షాక్ తగిలింది. ఇందులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్కు భారీ జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆటగాళ్ల ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంతోనే నాలుగో టీ20లోనూ 40 శాతం, ఐదో టీ20లో 20 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.
"భారత జట్టు నిర్దేశిత సమయంలో 50 ఓవర్లు వేయాల్సి ఉండగా నాలుగు ఓవర్లు ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్కు సారథిగా ఉన్న విరాట్ కోహ్లీ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 5-0 తేడాతో వైట్వాష్ చేసిన భారత్.. తొలి వన్డేలో ఓటమి చవిచూసింది. మొదట టీమిండియా 347 పరుగులు చేయగా 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది కివీస్.