ETV Bharat / sports

విరాట్​ మెరుపులు- రెండో టీ-20లో భారత్​ విజయం

మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్​ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించేసింది టీమిండియా. ఫలితంగా సిరీస్​లో తొలి గెలుపుతో​ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

author img

By

Published : Sep 18, 2019, 10:29 PM IST

Updated : Oct 1, 2019, 3:19 AM IST

సఫారీలపై విరాట్​ సింహగర్జన

మొహాలీ వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. విరాట్​ అర్ధశతకంతో రాణించగా.. ధావన్​ మంచి ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన కోహ్లీకి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ ఆవార్డు దక్కింది.

ధావన్​ శుభారంభం...

క్రీజులో నిలదొక్కుకొనేందుకు ఆరంభం నుంచే నెమ్మదిగా ఆడిన రోహిత్​.. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే జోష్​ను ప్రదర్శించే క్రమంలో ఫెలుక్వాయో బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ ​12 పరుగుల(12 బంతుల్లో)వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం వల్ల 33 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది టీమిండియా.

మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 40 పరుగులు (31 బంతుల్లో; 4ఫోర్లు, 1 సిక్సర్​)చేశాడు. చాలా రోజుల తర్వాత ధావన్​ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం చేసే ఊపులో మిల్లర్​ పట్టిన అద్భుతమైన క్యాచ్​కు పెవిలియన్​ చేరాడు. రోహిత్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్​ కోహ్లీతో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ధావన్​.

సారథి సత్తా...

ప్రపంచకప్​, వెస్టిండీస్​ పర్యటనలో తిరుగులేని ఫామ్​ కనబరిచిన విరాట్​ కోహ్లీ.. మరోసారి తన జోరు చూపించాడు. 72 పరుగులు (52 బంతుల్లో; 4 ఫోర్లు, 3సిక్సర్లు)చేసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు రిషబ్​ పంత్(4)​ మరోసారి విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ 16 పరుగులు(14 బంతుల్లో; 2ఫోర్లు)రాణించాడు. ఫలితంగా సిరీస్​లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, తబ్రేజ్​, ఫార్చూన్​ తలో వికెట్​ తీసుకున్నారు.

డికాక్​ వల్లే...

టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలోకి దిన రీజా హెండ్రిక్స్​(6) తక్కువ పరుగులకే ఔటయ్య్డాడు. మరో ఓపెనర్​ డికాక్ ​అర్ధశతకంతో రాణించి జట్టును నడిపించాడు. 37 బంతుల్లో 52 పరుగులు(8 ఫోర్లు) సాధించాడు. ఫలితంగా టీ-20ల్లో టీమిండియాపై భారత్​లో అత్యధిక రన్స్​ చేసిన కెప్టెన్​గా రికార్డూ సృష్టించాడు.

సారథికి తోడుగా భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్​) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. డసెన్​(1), మిల్లర్​(18), ప్రిటోరియస్​(1) తక్కువ పరుగులు చేశారు.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ పొదుపుగా బౌలింగ్​ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్​ పాండ్య తలో వికెట్​ తీసుకున్నారు.

ఇప్పటికే ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మూడో మ్యాచ్​ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 22న జరగనుంది. ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్​ సమం అవుతుంది.

మొహాలీ వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. విరాట్​ అర్ధశతకంతో రాణించగా.. ధావన్​ మంచి ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన కోహ్లీకి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ ఆవార్డు దక్కింది.

ధావన్​ శుభారంభం...

క్రీజులో నిలదొక్కుకొనేందుకు ఆరంభం నుంచే నెమ్మదిగా ఆడిన రోహిత్​.. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే జోష్​ను ప్రదర్శించే క్రమంలో ఫెలుక్వాయో బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ ​12 పరుగుల(12 బంతుల్లో)వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం వల్ల 33 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది టీమిండియా.

మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 40 పరుగులు (31 బంతుల్లో; 4ఫోర్లు, 1 సిక్సర్​)చేశాడు. చాలా రోజుల తర్వాత ధావన్​ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం చేసే ఊపులో మిల్లర్​ పట్టిన అద్భుతమైన క్యాచ్​కు పెవిలియన్​ చేరాడు. రోహిత్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్​ కోహ్లీతో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ధావన్​.

సారథి సత్తా...

ప్రపంచకప్​, వెస్టిండీస్​ పర్యటనలో తిరుగులేని ఫామ్​ కనబరిచిన విరాట్​ కోహ్లీ.. మరోసారి తన జోరు చూపించాడు. 72 పరుగులు (52 బంతుల్లో; 4 ఫోర్లు, 3సిక్సర్లు)చేసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు రిషబ్​ పంత్(4)​ మరోసారి విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ 16 పరుగులు(14 బంతుల్లో; 2ఫోర్లు)రాణించాడు. ఫలితంగా సిరీస్​లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, తబ్రేజ్​, ఫార్చూన్​ తలో వికెట్​ తీసుకున్నారు.

డికాక్​ వల్లే...

టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలోకి దిన రీజా హెండ్రిక్స్​(6) తక్కువ పరుగులకే ఔటయ్య్డాడు. మరో ఓపెనర్​ డికాక్ ​అర్ధశతకంతో రాణించి జట్టును నడిపించాడు. 37 బంతుల్లో 52 పరుగులు(8 ఫోర్లు) సాధించాడు. ఫలితంగా టీ-20ల్లో టీమిండియాపై భారత్​లో అత్యధిక రన్స్​ చేసిన కెప్టెన్​గా రికార్డూ సృష్టించాడు.

సారథికి తోడుగా భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్​) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. డసెన్​(1), మిల్లర్​(18), ప్రిటోరియస్​(1) తక్కువ పరుగులు చేశారు.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ పొదుపుగా బౌలింగ్​ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్​ పాండ్య తలో వికెట్​ తీసుకున్నారు.

ఇప్పటికే ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మూడో మ్యాచ్​ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 22న జరగనుంది. ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్​ సమం అవుతుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
DARIO GAMBARIN HANDOUT
Verona - 18 September 2019
++MUTE AT SOURCE++
1. Aerial zoom out from writing carved in a field that reads, 'Hope in the Land Greta'
2. Various aerials of a giant portrait of climate activist, Greta Thunberg, carved in a field with a tractor
3. Various of artist Dario Gambarin sketching Greta's portrait on a piece of paper
4. Dario Gambarin's sketch of Greta Thunberg
5. Various of Dario Gambarin driving tractor
6. Aerial zoom out from Dario Gambarin carving Greta's portrait using a tractor
7. Arieal zoom in to Dario Gambarin while drawing Greta using a tractor
8. Dario Gambarin driving tractor
9 . Zoom out from Gabarin to giant portrait of Greta Thunberg
STORYLINE:
An Italian artist has created a giant portrait of Greta Thunberg, the 16-year-old Swedish climate activist and Nobel Peace Prize nominee.
Italian land-artist Dario Gambarin created the picture in a field near the northern Italian city of Verona to mark Thunberg's upcoming appearance at the United Nations Climate Action summit next week.
Gambarin used a tractor and plough to produce the 27,000 square metre picture of the teen climate activist, titled 'From the Land to our Planet'.
The artist specialises in gigantic portraits that can only be fully appreciated from the air.
Previous works by Gambarin have included U.S. President Donald Trump, former U.S. President Barack Obama and Pope Francis.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 3:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.