ETV Bharat / sports

చెలరేగిన కివీస్​ పేసర్లు.. 124 పరుగులకు భారత్​ ఆలౌట్​ - India 242, 124-all out

న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్​లో 124 పరుగులకే ఆలౌటైంది కోహ్లీసేన. 7 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం కలుపుకొని కివీస్​ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలిపింది.

India vs New Zealand 2nd test, day 3: India 242, 124-all out, lead New Zealand by 131 runs.
చెలరేగిన కివీస్​ పేసర్లు.. 124 పరుగులకు భారత్​ ఆలౌట్​
author img

By

Published : Mar 2, 2020, 4:57 AM IST

Updated : Mar 3, 2020, 2:58 AM IST

భారత బ్యాట్స్​మెన్ల ఘోరవైఫల్యంతో న్యూజిలాండ్​తో రెండో టెస్టులో విజయావకాశాలు దాదాపు దూరమయ్యాయి. 90/6తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 34 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. కివీస్​ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఆట మూడో ఓవర్లోనే సౌథీ బౌలింగ్​లో వెనుదిరిగాడు హనుమ విహారి(9). మరుసటి ఓవర్లోనే పంత్​(4)ను పెవిలియన్​ బాట పట్టించాడు బౌల్ట్​. జడేజా 16 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బుమ్రా(4) ఆఖరి వికెట్​గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్​ 4, సౌథీ 3 వికెట్లు దక్కించుకున్నారు.

మరో రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో భారత్​ గెలవాలంటే మన​ బౌలర్లు తీవ్రంగా శ్రమించాలి.

భారత బ్యాట్స్​మెన్ల ఘోరవైఫల్యంతో న్యూజిలాండ్​తో రెండో టెస్టులో విజయావకాశాలు దాదాపు దూరమయ్యాయి. 90/6తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 34 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. కివీస్​ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఆట మూడో ఓవర్లోనే సౌథీ బౌలింగ్​లో వెనుదిరిగాడు హనుమ విహారి(9). మరుసటి ఓవర్లోనే పంత్​(4)ను పెవిలియన్​ బాట పట్టించాడు బౌల్ట్​. జడేజా 16 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బుమ్రా(4) ఆఖరి వికెట్​గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్​ 4, సౌథీ 3 వికెట్లు దక్కించుకున్నారు.

మరో రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో భారత్​ గెలవాలంటే మన​ బౌలర్లు తీవ్రంగా శ్రమించాలి.

Last Updated : Mar 3, 2020, 2:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.