ETV Bharat / sports

టీమ్​ఇండియా ఆలౌట్.. ఇంగ్లాండ్​ లక్ష్యం 330

author img

By

Published : Mar 28, 2021, 5:18 PM IST

పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్​కు 330 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు వన్డే సిరీస్​ విజేతగా నిలుస్తుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో?

india vs england third ODI live first innings
హార్దిక్ పాండ్య

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్​ ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్(67), పంత్(78), హార్దిక్ పాండ్య(64) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనర్లు రోహిత్-ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్​కు 103 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో 5000 పరుగుల మార్క్​ను అందుకున్న రెండో భారత జోడీగా నిలిచాడు. అనంతరం 37 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే 67 పరుగుల వద్ద ధావన్​ కూడా పెవిలియన్ చేరాడు.

pant ind vs eng
పంత్ బ్యాటింగ్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్-హార్దిక్ పాండ్య.. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో వికెట్​కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వరుసగా హాఫ్ సెంచరీలు చేసి ఔటయ్యారు. మిగతా వారిలో కోహ్లీ(7), కేఎల్ రాహుల్(7), కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకుర్(30) తమ వంతు పాత్ర పోషించారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్ వుడ్3, రషీద్ 2 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, స్టోక్స్, రీసి, లివింగ్​స్టోన్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు.

india vs england third ODI
ఇండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ట్రోఫీ

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్​ ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్(67), పంత్(78), హార్దిక్ పాండ్య(64) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనర్లు రోహిత్-ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్​కు 103 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో 5000 పరుగుల మార్క్​ను అందుకున్న రెండో భారత జోడీగా నిలిచాడు. అనంతరం 37 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే 67 పరుగుల వద్ద ధావన్​ కూడా పెవిలియన్ చేరాడు.

pant ind vs eng
పంత్ బ్యాటింగ్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్-హార్దిక్ పాండ్య.. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో వికెట్​కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వరుసగా హాఫ్ సెంచరీలు చేసి ఔటయ్యారు. మిగతా వారిలో కోహ్లీ(7), కేఎల్ రాహుల్(7), కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకుర్(30) తమ వంతు పాత్ర పోషించారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్ వుడ్3, రషీద్ 2 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, స్టోక్స్, రీసి, లివింగ్​స్టోన్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు.

india vs england third ODI
ఇండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ట్రోఫీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.