ETV Bharat / sports

సిరీస్​ డిసైడర్​: గెలుపు కోసం భారత్​-ఆసీస్​ తహతహ

author img

By

Published : Jan 19, 2020, 5:27 AM IST

నిర్ణయాత్మక చివరి వన్డేలో నెగ్గి సిరీస్​ను​ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి భారత్​, ఆస్ట్రేలియా జట్లు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

నిర్ణయాత్మక వన్డే.. సై అంటున్న భారత్-ఆస్ట్రేలియా
ట్రోఫీతో భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

కొత్త ఏడాదిలో కీలక సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా నేడు(ఆదివారం).. బెంగళూరులో నిర్ణయాత్మక మ్యాచ్​ ఆడనుంది. మరి ఇరుజట్లలో ఎవరు గెలుస్తారో చూడాలి?

india australia captains
భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచి భారత్-ఆస్ట్రేలియా ఊపుమీదున్నాయి. గతేడాది వన్డే సిరీస్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన చూస్తుండగా, సిరీస్​ పట్టేయాలని చూస్తోంది ఆసీస్. రెండు పటిష్ఠ జట్ల మధ్య ఈ మ్యాచ్​ ఉత్కంఠగా సాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు మరోసారి ప్రధాన బలంగా మారనుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందివ్వాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే వీరిద్దరూ రెండో వన్డేలో గాయపడటం వల్ల ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

rohit sharma-sikhar dhawan
రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

భారత టాపార్డర్ బలంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్ పాండే, జడేజా అంచనాల మేరకు రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఏ స్థానంలోనైనా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌.. మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గత వన్డేలోని బ్యాటింగ్‌ ఆర్డర్‌నే.. ఈ మ్యాచ్​లోనూ కొనసాగించే అవకాశముంది.

kohli in practice
ప్రాక్టీసులో విరాట్ కోహ్లీ

టీమిండియా బౌలర్లందరూ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. వారు ట్రాక్​లోకి వస్తే ఆసీస్‌ను కట్టడి చేయడం కష్టమేమీ కాదన్న భావనలో కోహ్లీసేన ఉంది. రెండు వన్డేల్లోలాగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగొచ్చు.

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్థాయికి తగ్గట్లు రాణిస్తోంది. తొలి వన్డేలో సాధికార విజయం సాధించింది. రెండో వన్డేలోనూ గెలుపు కోసం పోరాడింది. మూడో వన్డేలో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, గెలిచి సిరీస్‌ను పట్టేయాలని ఫించ్‌సేన పట్టుదలగా ఉంది. బౌలింగ్​లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణించాలని కంగారూలు భావిస్తున్నారు.

కొత్త ఏడాదిలో కీలక సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా నేడు(ఆదివారం).. బెంగళూరులో నిర్ణయాత్మక మ్యాచ్​ ఆడనుంది. మరి ఇరుజట్లలో ఎవరు గెలుస్తారో చూడాలి?

india australia captains
భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచి భారత్-ఆస్ట్రేలియా ఊపుమీదున్నాయి. గతేడాది వన్డే సిరీస్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన చూస్తుండగా, సిరీస్​ పట్టేయాలని చూస్తోంది ఆసీస్. రెండు పటిష్ఠ జట్ల మధ్య ఈ మ్యాచ్​ ఉత్కంఠగా సాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు మరోసారి ప్రధాన బలంగా మారనుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందివ్వాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే వీరిద్దరూ రెండో వన్డేలో గాయపడటం వల్ల ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

rohit sharma-sikhar dhawan
రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

భారత టాపార్డర్ బలంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్ పాండే, జడేజా అంచనాల మేరకు రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఏ స్థానంలోనైనా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌.. మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గత వన్డేలోని బ్యాటింగ్‌ ఆర్డర్‌నే.. ఈ మ్యాచ్​లోనూ కొనసాగించే అవకాశముంది.

kohli in practice
ప్రాక్టీసులో విరాట్ కోహ్లీ

టీమిండియా బౌలర్లందరూ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. వారు ట్రాక్​లోకి వస్తే ఆసీస్‌ను కట్టడి చేయడం కష్టమేమీ కాదన్న భావనలో కోహ్లీసేన ఉంది. రెండు వన్డేల్లోలాగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగొచ్చు.

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్థాయికి తగ్గట్లు రాణిస్తోంది. తొలి వన్డేలో సాధికార విజయం సాధించింది. రెండో వన్డేలోనూ గెలుపు కోసం పోరాడింది. మూడో వన్డేలో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, గెలిచి సిరీస్‌ను పట్టేయాలని ఫించ్‌సేన పట్టుదలగా ఉంది. బౌలింగ్​లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణించాలని కంగారూలు భావిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS: PROTESTER MAKES OBSCENE GESTURE IN FIRST SHOT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 18 January 2020
++DUSK SHOTS++
1. Protesters facing off with security forces on corner of road leading to parliament, smoke from crowd dispersal measures
2. Various of water cannon being used against protesters, protesters hurling projectiles, smoke from crowd dispersal measures
STORYLINE:
Security forces in the Lebanese capital of Beirut on Saturday used water cannons to disperse protesters rallying against widespread corruption and mismanagement in the country.
Around 100 protesters gathered, with some throwing stones and other objects at forces guarding the entrance to a road leading to the parliament building.
The protest followed Friday's comments by a senior Hezbollah official, who warned that Lebanon could fall into chaos and "complete collapse" unless a new government was formed.
Sheikh Ali Daamoush's comments came amid more bickering between politicians on the formation of a new cabinet during a crippling financial crisis and ongoing mass protests.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.