ETV Bharat / sports

ఈ ఏడాది భారత్-పాక్ మధ్య టీ20 సిరీస్​!

author img

By

Published : Mar 25, 2021, 5:35 AM IST

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోందంటే రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచం దృష్టి దానిపైనే ఉంటుంది. అదే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగితే.. ఆ సిరీస్‌లో దాయాది దేశంపై టీమ్‌ఇండియా విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. కానీ ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో ఓ సిరీస్‌లో తలపడబోతున్నాయనే వార్త ఒకటి ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

India-Pakistan T20I series could happen this year - Reports
త్వరలో భారత్-పాక్ సిరీస్​!.. వెల్లడించిన నివేదిక

భారత్​-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్​లు ఆడక దాదాపు 8 ఏళ్లు కావొస్తుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా.. ఆ ప్రభావం క్రికెట్​పైనా పడింది. కానీ, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కాబోతుందంటుంది ఓ నివేదిక. ఈ ఏడాదే రెండు దేశాల మధ్య 3 మ్యాచ్​ల టీ20 సిరీస్ జరగనుందని వెల్లడించింది.

పాకిస్థాన్ వార్తా పత్రిక 'జాంగ్​' ప్రకారం.. దాయాదితో టీమ్​ఇండియా త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమైన వెంటనే సిరీస్​ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్​ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది బిజీ షెడ్యూల్​ కారణంగా ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహణ కష్టమని మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'పాక్​లో టీమ్ ​ఇండియా ఆడుతుందని ఆశ'

ఈ ఏడాది భారత్​కు పాక్​..

భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ విషయాన్ని గతంలో ఖండించిన పాక్​ బోర్డు.. ప్రస్తుతం అందుకు భిన్నంగా స్పందించింది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఈ విషయంపై స్పందించారు. ఈ విషయమై తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే ఈ సారి పాకిస్థాన్ టూర్​కు భారత్​ వెళ్లాల్సి ఉంటుంది. గతంలో దాయాది ఆటగాళ్లు ఇండియాలో పర్యటించారు.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది. ఇది ఐసీసీ టోర్నమెంట్​. దీంతో ఇందులో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది. అందులో భాగంగానే పాక్​ క్రికెటర్లు.. ఇండియాకు రానున్నారు.

చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమ్‌ఇండియా.. పాక్‌కు వెళ్లింది. చివరగా ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి.

ఇదీ చదవండి: జకోవిచ్‌ను లొంగదీసుకుంటే డబ్బులిస్తామన్నారు!‌

భారత్​-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్​లు ఆడక దాదాపు 8 ఏళ్లు కావొస్తుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా.. ఆ ప్రభావం క్రికెట్​పైనా పడింది. కానీ, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కాబోతుందంటుంది ఓ నివేదిక. ఈ ఏడాదే రెండు దేశాల మధ్య 3 మ్యాచ్​ల టీ20 సిరీస్ జరగనుందని వెల్లడించింది.

పాకిస్థాన్ వార్తా పత్రిక 'జాంగ్​' ప్రకారం.. దాయాదితో టీమ్​ఇండియా త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమైన వెంటనే సిరీస్​ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్​ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది బిజీ షెడ్యూల్​ కారణంగా ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహణ కష్టమని మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'పాక్​లో టీమ్ ​ఇండియా ఆడుతుందని ఆశ'

ఈ ఏడాది భారత్​కు పాక్​..

భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ విషయాన్ని గతంలో ఖండించిన పాక్​ బోర్డు.. ప్రస్తుతం అందుకు భిన్నంగా స్పందించింది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఈ విషయంపై స్పందించారు. ఈ విషయమై తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే ఈ సారి పాకిస్థాన్ టూర్​కు భారత్​ వెళ్లాల్సి ఉంటుంది. గతంలో దాయాది ఆటగాళ్లు ఇండియాలో పర్యటించారు.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది. ఇది ఐసీసీ టోర్నమెంట్​. దీంతో ఇందులో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది. అందులో భాగంగానే పాక్​ క్రికెటర్లు.. ఇండియాకు రానున్నారు.

చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమ్‌ఇండియా.. పాక్‌కు వెళ్లింది. చివరగా ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి.

ఇదీ చదవండి: జకోవిచ్‌ను లొంగదీసుకుంటే డబ్బులిస్తామన్నారు!‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.