మహ్మద్ సిరాజ్.. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు బంతితో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో షమీ గాయపడగా.. రెండో మ్యాచ్లో చోటు దక్కించుకున్న సిరాజ్ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అలాగే మూడో టెస్టులోనూ రెండు వికెట్లు తీశాడు. తాజాగా జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఐదు వికెట్లతో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో ఒక వికెట్ దక్కించుకుని మొత్తం 13 వికెట్లతో ఈ టెస్టు సిరీస్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (13) దక్కించుకున్న బౌలర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ క్రికెట్ ప్రయాణంపై ప్రత్యేక కథనం.
-
A standing ovation as Mohammed Siraj picks up his maiden 5-wicket haul.#AUSvIND #TeamIndia pic.twitter.com/e0IaVJ3uA8
— BCCI (@BCCI) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A standing ovation as Mohammed Siraj picks up his maiden 5-wicket haul.#AUSvIND #TeamIndia pic.twitter.com/e0IaVJ3uA8
— BCCI (@BCCI) January 18, 2021A standing ovation as Mohammed Siraj picks up his maiden 5-wicket haul.#AUSvIND #TeamIndia pic.twitter.com/e0IaVJ3uA8
— BCCI (@BCCI) January 18, 2021
క్రికెటే లోకం..
హైదరాబాద్ బంజారాహిల్స్ ఖాజానగర్లో ఓ నిరుపేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి రోజూ వారి కూలీ. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్కు క్రికెటే లోకమైంది. సిరాజ్ ఉత్సాహానికి తండ్రి ప్రోత్సాహం అందడం వల్ల ముందుకెళ్లాడు. మెరుపు వేగంతో బంతులు వేస్తూ గల్లీ క్రికెట్లో.. స్థానిక టోర్నీల్లో హీరోగా మారిపోయాడు. 2015 వరకూ టెన్నిస్ బంతితోనే ఆడిన సిరాజ్ స్నేహితుడి సలహాతో క్రికెట్ బంతి అందుకున్నాడు. సిరాజ్ ప్రతిభ చూసిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ అతనికి హెచ్సీఏ లీగ్లో ఆడే అవకాశం కల్పించాడు. అలా క్లబ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఏడాది తిరక్కుండానే హైదరాబాద్ అండర్-23 జట్టులోకి, తర్వాత సీనియర్ టీమ్లోకి వచ్చేశాడు.
![Mohammed Siraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10283502_sir-2.jpg)
తండ్రి మరణించినా!
ఐపీఎల్లో మెరుపులతో సిరాజ్ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అక్కడికెళ్లాక అతడి తండ్రి మరణించాడన్న వార్త విన్నాడు. ఆ సమయంలో.. భారత్కు తిరిగి వచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామన్నా అతడు నిరాకరించాడు. భారత్కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అక్కడే ఆగిపోయాడు. తండ్రి కోరుకున్నట్టుగా దేశానికి సేవ చేయడమే ప్రధానమని నిశ్చయించుకున్నాడు.
తాను క్రికెట్లో ఎదిగి, అంతర్జాతీయ స్థాయికి చేరడానికి కారణమైన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంపై సిరాజ్ ఎంత బాధ పడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ దుఃఖాన్ని ఆటతోనే దిగమింగాడు. ''ఏదో ఒక రోజు అందరూ వెళ్లిపోవాల్సిందే. ఈ రోజు మీ నాన్న. రేపు నేనూ.. నాన్న కోరుకున్నది సాధించు" అని తల్లి చెప్పిన మాటలు.. సిరాజ్ను టెస్టులో స్థానం దిశగా నడిపించాయి.
-
✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021
అలా వెలుగులోకి..
హైదరాబాద్లోని పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్ భారత క్రికెటర్గా ఎదగడంలో తన తండ్రి మహ్మద్ గౌస్ (53) కీలకపాత్ర పోషించాడు. ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్ను ప్రోత్సహించాడు. 2015 వరకు సిరాజ్.. స్థానిక టోర్నీలకే పరిమితమై సత్తా చాటేవాడు. 2016-17 సీజన్లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అదరగొట్టి.. వెలుగులోకి వచ్చాడు. తొమ్మిది మ్యాచ్ల్లోనే 41 వికెట్లు తీశాడు.
ఐపీఎల్లో అదరహో
రంజీల్లో సిరాజ్ ప్రదర్శన మెచ్చి.. 2017 ఐపీఎల్కు అతడిని సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 2018 నుంచి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తరఫున 9 మ్యాచ్లు ఆడిన అతడు.. 11 వికెట్లు తీశాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో సంచలన గణాంకాలు (4-2-8-3) నమోదు చేశాడు.