ETV Bharat / sports

'కోహ్లీ లేకపోతే ఆస్ట్రేలియా గెలుపు సులభమే'

author img

By

Published : Nov 12, 2020, 2:23 PM IST

కెప్టెన్ కోహ్లీ లేకపోతే.. భారత్​తో జరిగే టెస్టు సిరీస్​లో ఆసీస్ సులభంగా గెలుస్తుందని మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది.

In Kohli's absence, Aus will easily win Test series against India
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ

త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు దూరం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దీని వల్ల ఆసీస్ జట్టు సులభంగా గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.

Vaughan
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్

కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో విరాట్ పితృత్వ సెలవుపై స్వదేశానికి రానున్నాడు. ఆ టెస్టుల్లో అతడిని భర్తీ చేసేందుకు రోహిత్ శర్మను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత బృందం.. సిడ్నీలో 14రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు దూరం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దీని వల్ల ఆసీస్ జట్టు సులభంగా గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.

Vaughan
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్

కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో విరాట్ పితృత్వ సెలవుపై స్వదేశానికి రానున్నాడు. ఆ టెస్టుల్లో అతడిని భర్తీ చేసేందుకు రోహిత్ శర్మను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత బృందం.. సిడ్నీలో 14రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.