ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్​ పదవి కోసం మూడు రౌండ్ల ఓటింగ్​!

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఛైర్మన్ ఎన్నికపై ఓ క్లారిటీ వచ్చింది. న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ గ్రెగ్​ బాక్​లీ, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్​ ఇమ్రాన్​ ఖవాజాలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరికీ మూడు రౌండ్ల ఓటింగ్​ నిర్వహించనున్నారు. వీటిలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే తాత్కాలిక ఛైర్మన్​గా పనిచేస్తున్న ఇమ్రాన్​ కొన్నాళ్లు అదే స్థానంలో కొనసాగాల్సి ఉంటుంది.

author img

By

Published : Nov 17, 2020, 6:37 AM IST

ICC Chairman's election might feature 3 rounds of voting: Report
ఐసీసీ ఛైర్మన్​ పదవి కోసం మూడు రౌండ్ల ఓటింగ్​!

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఛైర్మన్​ ఎన్నిక ప్రక్రియపై ఓ స్పష్టత వచ్చింది. బరిలో నిలిచిన అభ్యర్థులు న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ గ్రెగ్​ బాక్​లీ, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్​ ఇమ్రాన్​ ఖవాజాలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే మళ్లీ ఓటింగ్​ నిర్వహిస్తారు. మొత్తం 16 ఓట్లలో మూడింట రెండొంతులు లేదా 11 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఒకవేళ తొలి రౌండ్లో ఎవరికీ మెజారిటీ రాకపోతే రెండో రౌండ్​ ఓటింగ్​ నిర్వహిస్తారు. అందులోనూ ఫలితం తేలకపోతే మూడో రౌండ్​ ఓటింగ్​ ఉంటుంది. అప్పటికీ ఎవరికీ మెజారిటీ రాకపోతే ఖవాజానే కొంతకాలం పాటు పూర్తిస్థాయి ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

రహాస్య బ్యాలెట్​ ఓటింగ్​ ద్వారా ఛైర్మన్ పదవిని కట్టబెట్టనున్నారు. ఆ ఓటింగ్​ జరిగిన వెంటనే ఐసీసీ వార్షిక త్రైమాసిక సమావేశం ఆరంభం కానుంది. ఈ తొలి రౌండ్లో ఫలితం తేలకపోతే.. రెండో రౌండ్​ ఓటింగ్​ను వారం తర్వాత నిర్వహించే వీలుంది. శశాంక్​ మనోహర్​ నిష్క్రమణతో దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఛైర్మన్​ స్థానంలో కొత్త వాళ్లను వచ్చే నెల 2 లోపు ఎన్నుకోవాల్సి ఉంది.

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఛైర్మన్​ ఎన్నిక ప్రక్రియపై ఓ స్పష్టత వచ్చింది. బరిలో నిలిచిన అభ్యర్థులు న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ గ్రెగ్​ బాక్​లీ, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్​ ఇమ్రాన్​ ఖవాజాలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే మళ్లీ ఓటింగ్​ నిర్వహిస్తారు. మొత్తం 16 ఓట్లలో మూడింట రెండొంతులు లేదా 11 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఒకవేళ తొలి రౌండ్లో ఎవరికీ మెజారిటీ రాకపోతే రెండో రౌండ్​ ఓటింగ్​ నిర్వహిస్తారు. అందులోనూ ఫలితం తేలకపోతే మూడో రౌండ్​ ఓటింగ్​ ఉంటుంది. అప్పటికీ ఎవరికీ మెజారిటీ రాకపోతే ఖవాజానే కొంతకాలం పాటు పూర్తిస్థాయి ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

రహాస్య బ్యాలెట్​ ఓటింగ్​ ద్వారా ఛైర్మన్ పదవిని కట్టబెట్టనున్నారు. ఆ ఓటింగ్​ జరిగిన వెంటనే ఐసీసీ వార్షిక త్రైమాసిక సమావేశం ఆరంభం కానుంది. ఈ తొలి రౌండ్లో ఫలితం తేలకపోతే.. రెండో రౌండ్​ ఓటింగ్​ను వారం తర్వాత నిర్వహించే వీలుంది. శశాంక్​ మనోహర్​ నిష్క్రమణతో దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఛైర్మన్​ స్థానంలో కొత్త వాళ్లను వచ్చే నెల 2 లోపు ఎన్నుకోవాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.