ETV Bharat / sports

భారత్​ చేతిలో ఓటమి.. సోషల్ మీడియాకు స్టార్క్ దూరం!

author img

By

Published : Dec 16, 2020, 11:00 AM IST

గత పర్యటనలో భారత జట్టు తమను ఓడించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యల్ని పట్టించుకోవట్లేదని స్టార్క్ అన్నాడు. టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టెస్టు.. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మొదలు కానుంది.

I got off Twitter after home Test series against India: Mitchell Starc
భారత్​ చేతిలో ఓటమి.. సోషల్ మీడియాకు స్టార్క్ దూరం!

గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ మైదానం వేదిక. అయితే బయట నుంచి వచ్చే ఒత్తిడిని దూరంగా ఉంచేందుకు తన సోషల్ మీడియా ఖాతాల్ని ఇప్పటికే డిలీట్​ చేసినట్లు ఆసీస్ ప్రముఖ పేసర్ స్టార్క్ చెప్పాడు.

Mitchell Starc
మిచెల్ స్టార్క్, ఆసీస్ స్టార్ పేసర్

"టీమ్​ఇండియాతో సిరీస్​(2018-19) తర్వాత ట్విట్టర్​ నుంచి బయటకొచ్చేశాను. సోషల్ మీడియాలోని విషయాల్ని పెద్దగా చదవడం మానేశాను. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం తగ్గించాను. చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం, అనుకున్న విధంగా బౌలింగ్ చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. భారత్​తో గత సిరీస్​లో ఓటమి తర్వాత నన్ను నమ్మే వాళ్లతో మాత్రమే మాట్లాడుతున్నాను. మీడియాలో, బయట చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. వాటి గురించి ఆలోచించడం వృథా! అందుకే కేవలం నా ఆటపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నాను"

-మిచెల్ స్టార్క్, ఆసీస్ స్టార్ పేసర్

గత సిరీస్​లో 2-1 తేడాతో కోహ్లీసేన చేతిలో ఆసీస్ టెస్టు సిరీస్​ ఓడింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని స్టార్ అన్నాడు. 2019-20 సీజన్​లో 45 వికెట్లు తీసిన ఈ బౌలర్.. ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. కంగారూ బౌలింగ్ బృందాన్ని ముందుండి నడిపించనున్నాడు.

Test series against India
2018-19 టెస్టు సిరీస్​ ట్రోఫీతో టీమ్​ఇండియా

గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ మైదానం వేదిక. అయితే బయట నుంచి వచ్చే ఒత్తిడిని దూరంగా ఉంచేందుకు తన సోషల్ మీడియా ఖాతాల్ని ఇప్పటికే డిలీట్​ చేసినట్లు ఆసీస్ ప్రముఖ పేసర్ స్టార్క్ చెప్పాడు.

Mitchell Starc
మిచెల్ స్టార్క్, ఆసీస్ స్టార్ పేసర్

"టీమ్​ఇండియాతో సిరీస్​(2018-19) తర్వాత ట్విట్టర్​ నుంచి బయటకొచ్చేశాను. సోషల్ మీడియాలోని విషయాల్ని పెద్దగా చదవడం మానేశాను. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం తగ్గించాను. చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం, అనుకున్న విధంగా బౌలింగ్ చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. భారత్​తో గత సిరీస్​లో ఓటమి తర్వాత నన్ను నమ్మే వాళ్లతో మాత్రమే మాట్లాడుతున్నాను. మీడియాలో, బయట చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. వాటి గురించి ఆలోచించడం వృథా! అందుకే కేవలం నా ఆటపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నాను"

-మిచెల్ స్టార్క్, ఆసీస్ స్టార్ పేసర్

గత సిరీస్​లో 2-1 తేడాతో కోహ్లీసేన చేతిలో ఆసీస్ టెస్టు సిరీస్​ ఓడింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని స్టార్ అన్నాడు. 2019-20 సీజన్​లో 45 వికెట్లు తీసిన ఈ బౌలర్.. ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. కంగారూ బౌలింగ్ బృందాన్ని ముందుండి నడిపించనున్నాడు.

Test series against India
2018-19 టెస్టు సిరీస్​ ట్రోఫీతో టీమ్​ఇండియా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.