ETV Bharat / sports

భారత్.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడాలంటే?

author img

By

Published : Jan 2, 2021, 7:30 AM IST

టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​లో చోటు కోసం అగ్రజట్లు పోటీపడుతున్నాయి. మన జట్టు టాప్-2లో ఉన్నప్పటికీ దానిని నిలబెట్టుకోవాలంటే రాబోయే మ్యాచ్​ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాల్సి ఉంది. మరి కోహ్లీసేన ఏం చేస్తుందో?

How can India qualify for World Test Championship final?
భారత్.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడాలంటే?

గతేడాది ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన టెస్టు ఛాంపియన్​షిపర్ ప్రక్రియ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్​కు ముందు అన్ని జట్లూ ఒకటి లేదా రెండు సిరీస్​లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటే.. ఈ ఏడాది జులైలో జరిగే ఛాంపియన్​షిప్ తుదిపోరులో తలపడతాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న, రాబోయే సిరీస్​ల ఫలితాల ఆధారంగా స్థానాలు అటుఇటు కావొచ్చు. ఈ రెండు జట్లే టాప్-2లో ఉంటాయన్న గ్యారంటీ లేదు.

How can India qualify for World Test Championship final?
టీమ్​ఇండియా బృందం

భారత్ విషయానికొస్తే.. ఛాంపియన్​షిప్​లో అత్యధికంగా 390 పాయింట్లు సాధించిన ఘనత మన జట్టుదే. కానీ పాయింట్లు మన కంటే 68 తక్కువ ఉన్నప్పటికీ.. విజయాల శాతంలో ఆసీస్​(76.6) మెరుగ్గా ఉండటం వల్ల భారత్​(72.2) రెండో స్థానానికే పరిమితమైంది. న్యూజిలాండ్(360 పాయింట్లు, 66.7 శాతం విజయాలు), ఇంగ్లాండ్(292, 60.8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్-2 స్థానం విషయంలో భారత్​కు ప్రధానంగా న్యూజిలాండ్​ నుంచి ముప్పు పొంచి ఉంది. మంచి ఫామ్​లో ఉన్న ఆ జట్టు వరుస విజయాలతో భారత్​కు చేరువవుతోంది. ఆస్ట్రేలియా రెండో టెస్టులో గెలవబట్టి సరిపోయింది కానీ.. పాక్​ను తొలి టెస్టులో ఓడించాక కివీస్ మన జట్టుకు మరింత దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇకపై భారత్​కు ప్రతి మ్యాచ్​ కీలకమే. ఫైనల్​కు ముందు ఆడబోయే ఆరు టెస్టుల్లో(ఆస్ట్రేలియాతో 2, ఇంగ్లాండ్​తో 4) నాలుగు గెలిస్తేనే టాప్​-2లో ఉంటాం. రెండు, మూడు గెలిచినా అవకాశం ఉండొచ్చు కానీ.. అప్పుడు వేరే జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి.

ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టుల్లో టీమ్​ఇండియా ఒక్కటైనా గెలివాల్సిందే. తర్వాత ఇంగ్లాండ్​తో సొంతగడ్డపై భారత్​ నాలుగు టెస్టులాడనుంది. స్వదేశంలో భారత్​ ఫేవరెట్​ అయినప్పటికీ.. ఇంగ్లాండ్​తో అంత తేలిక కాదు. ఆ సిరీస్​ను సొంతం చేసుకుంటే భారత్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ ఆడబోతున్నట్లే.

గతేడాది ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన టెస్టు ఛాంపియన్​షిపర్ ప్రక్రియ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్​కు ముందు అన్ని జట్లూ ఒకటి లేదా రెండు సిరీస్​లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటే.. ఈ ఏడాది జులైలో జరిగే ఛాంపియన్​షిప్ తుదిపోరులో తలపడతాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న, రాబోయే సిరీస్​ల ఫలితాల ఆధారంగా స్థానాలు అటుఇటు కావొచ్చు. ఈ రెండు జట్లే టాప్-2లో ఉంటాయన్న గ్యారంటీ లేదు.

How can India qualify for World Test Championship final?
టీమ్​ఇండియా బృందం

భారత్ విషయానికొస్తే.. ఛాంపియన్​షిప్​లో అత్యధికంగా 390 పాయింట్లు సాధించిన ఘనత మన జట్టుదే. కానీ పాయింట్లు మన కంటే 68 తక్కువ ఉన్నప్పటికీ.. విజయాల శాతంలో ఆసీస్​(76.6) మెరుగ్గా ఉండటం వల్ల భారత్​(72.2) రెండో స్థానానికే పరిమితమైంది. న్యూజిలాండ్(360 పాయింట్లు, 66.7 శాతం విజయాలు), ఇంగ్లాండ్(292, 60.8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్-2 స్థానం విషయంలో భారత్​కు ప్రధానంగా న్యూజిలాండ్​ నుంచి ముప్పు పొంచి ఉంది. మంచి ఫామ్​లో ఉన్న ఆ జట్టు వరుస విజయాలతో భారత్​కు చేరువవుతోంది. ఆస్ట్రేలియా రెండో టెస్టులో గెలవబట్టి సరిపోయింది కానీ.. పాక్​ను తొలి టెస్టులో ఓడించాక కివీస్ మన జట్టుకు మరింత దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇకపై భారత్​కు ప్రతి మ్యాచ్​ కీలకమే. ఫైనల్​కు ముందు ఆడబోయే ఆరు టెస్టుల్లో(ఆస్ట్రేలియాతో 2, ఇంగ్లాండ్​తో 4) నాలుగు గెలిస్తేనే టాప్​-2లో ఉంటాం. రెండు, మూడు గెలిచినా అవకాశం ఉండొచ్చు కానీ.. అప్పుడు వేరే జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి.

ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టుల్లో టీమ్​ఇండియా ఒక్కటైనా గెలివాల్సిందే. తర్వాత ఇంగ్లాండ్​తో సొంతగడ్డపై భారత్​ నాలుగు టెస్టులాడనుంది. స్వదేశంలో భారత్​ ఫేవరెట్​ అయినప్పటికీ.. ఇంగ్లాండ్​తో అంత తేలిక కాదు. ఆ సిరీస్​ను సొంతం చేసుకుంటే భారత్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ ఆడబోతున్నట్లే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.