ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో భారత్ 7వ స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2-1 తేడాతో ఇంగ్లాండ్పై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా తాజా ర్యాకింగ్స్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లాడిన కోహ్లీసేన.. 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించింది.
ఇప్పటివరకు 9 మ్యాచ్లాడిన ఇంగ్లాండ్.. 4 మ్యాచ్ల్లో నెగ్గగా, మిగిలిన వాటిలో పరాజయం పాలైంది. మొత్తంగా 40 పాయింట్లు సాధించి ఈ లిస్టులో తొలి స్థానంలో ఉంది. 6 మ్యాచ్ల్లో నాలుగింటిని గెలిచిన ఆసీస్ 40 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 30 పాయింట్లతో కివీస్, అఫ్గానిస్తాన్.. 3, 4 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా, లంక జట్లు ఇంకా బోణీ కొట్టలేదు.
వరల్డ్కప్ సూపర్ లీగ్ అంటే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టింది. 2023లో జరగబోయే ప్రపంచకప్ దృష్ట్యా ఈ జాబితాను తయారు చేశారు. ఈ లిస్టులో తొలి 8 స్థానాలలో నిలిచిన జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. 2020 జులై నుంచి 2023 మార్చి వరకు కాలపరిధిగా నిర్ణయించారు.
ఇందులో ప్రతి జట్టు 24 వన్డేలు ఆడుతుంది. మ్యాచ్ గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, టై/ఫలితం తేలనివి/రద్దైన మ్యాచ్లకు ప్రతి జట్టుకు 5 పాయింట్లు కేటాయిస్తారు. ఓడిపోయిన టీమ్కు పాయింట్లేమీ ఉండవు.
ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'