ఓ టీ20 మ్యాచ్ను నాలుగు ఇన్నింగ్స్లుగా విభజించాలనే ఆలోచన సరికాదని అభిప్రాయపడ్డారు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, బ్రెట్లీ. ఈ పద్ధతికి తాము వ్యతిరేకమని చెప్పారు.
"టీ20 ఇన్నింగ్స్ను రెండుగా విభజించడం సరైన నిర్ణయం కాదు. సచిన్ చెప్పినట్లు వన్డేలో ఈ ఆలోచన విజయం కావొచ్చేమో కానీ పొట్టి ఫార్మాట్కు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇందులో ఉండేదే అతి తక్కువ సమయం. అందులోనూ రెండు ఇన్నింగ్స్లు ఉంటే, ఆటకు అది ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు" -గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ఇదే విషయంపై మాట్లాడిన మాజీ బౌలర్ బ్రెట్లీ.. నాలుగు ఇన్నింగ్స్లు ఆలోచన సరికాదని అన్నాడు. క్రికెట్లో కొన్ని సంప్రదాయ పద్ధతుల్ని అలానే ఉంచాలని చెప్పాడు.