అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) స్వతంత్ర ఛైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం... వచ్చే ఏడాది మే నెలతో పూర్తవుతుంది. ఇప్పటికే రెండుసార్లు ఆ బాధ్యతలు చేపట్టిన శశాంక్... మూడోసారి ఈ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
" ఇంకో రెండేళ్లు ఐసీసీ ఛైర్మన్గా కొనసాగడానికి సిద్ధంగా లేను. మెజారిటీ డైరెక్టర్లు నన్నే పదవిలో కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నాను. ఐసీసీ ఛైర్మన్గా నా ప్రయాణం వచ్చే ఏడాది మే నెలతో ముగుస్తుంది. జూన్లో కొత్త వ్యక్తి ఛైర్మన్గా వస్తారు"
-- శశాంక్ మనోహర్, ఐసీసీ ఛైర్మన్
2016 మేలో తొలిసారి ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్ పదవిని ఏర్పాటు చేయగా.. శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీసీసీఐపై ప్రభావం...
ఐసీసీలో ఉండి శశాంక్ తీసుకున్న పలు నిర్ణయాలు బీసీసీఐ మీద ప్రభావం చూపాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల అపరిమిత అధికారాలను రద్దుచేశారు. ఐసీసీ ఇవ్వాల్సిన ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను భారీగా తగ్గించారు. ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో పెద్దన్నగా ఉండే భారత్ ప్రాతినిధ్యం లేకపోయినా కార్యక్రమం నిర్వహించారు. ఇతడి రాజీనామాతో భారత్కు లాభమా, నష్టమా అనేది కొత్త అధ్యక్షుడి నియామకం మీద ఆధారపడి ఉంటుంది.
ఇదీ చూడండి.