ETV Bharat / sports

ఆ నిర్ణయం విషయంలో సచిన్​కు భజ్జీ మద్దతు​

author img

By

Published : Jul 12, 2020, 4:04 PM IST

లెగ్ బిఫోర్​ వికెట్​(ఎల్​బీడబ్ల్యూ) సమీక్షలో 'అంపైర్​ కాల్​'ను తొలగించాలని అభిప్రాయపడ్డారు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్​, హర్భజన్​. బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకినా.. దాన్ని ఔట్​ కింద పరిగణించాలని సచిన్​ ఐసీసీకి సూచించగా.. మాస్టర్​ వ్యాఖ్యలకు మద్దతిస్తూ భజ్జీ ట్వీట్​ చేశాడు.

'Few rules should be changed': Harbhajan wants umpire's call done away with
స్టంప్స్​ను తాకినా ఔట్​గా పరిగణించాలి: హర్భజన్​

క్రికెట్​లో లెగ్​ బిఫోర్​ వికెట్​ (ఎల్​బీడబ్ల్యూ) నిర్ణయానికి సంబంధించి సమీక్ష కోసం 'అంపైర్​ కాల్​'ను తొలగించాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​సింగ్​. ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్​ సచిన్​ అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేయగా.. మాస్టర్​కు మద్దతిస్తూ ట్వీట్​ చేశాడు భజ్జీ. క్రికెట్​ మరింత సులభతరం కావడానికి దీనితో పాటు మరికొన్ని నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు​.

  • Agree with you Paji 1000 percent correct.. If the ball is touching the stump or kissing the Stumps it should be given out..It does not matter how much part of the ball hit the wicket..few rules should b changed in the game for betterment of the game..this is certainly 1 of those https://t.co/m1PfaIpR8y

    — Harbhajan Turbanator (@harbhajan_singh) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సచిన్​ చెప్పినదానిని నేను వేయి శాతం అంగీకరిస్తున్నా. బంతి స్టంప్స్​ను తాకి వెళ్లినా.. దాన్ని ఔట్​గా పరిగణించాలి. స్టంప్స్​ను 50 శాతానికి పైగా టచ్​ అవ్వకపోయినా.. తాకుతూ వెళ్లినా ఔట్​గా ప్రకటించాలి. క్రికెట్​ నియమాలలో మార్చాల్సిన రూల్స్​లో ఇదే మొదటిది".

- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

బంతి వికెట్​కు​ తాకడంపై నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని సచిన్​ ఇటీవలే తన ట్విట్టర్​లో అభిప్రాయాన్ని తెలియజేశాడు. "బంతి ఎంత శాతం స్టంప్స్​ను తాకుతుందన్నది అనవసరం. డీఆర్​ఎస్​లో బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటించాల్సిందే. ఆన్​ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్​మన్​ను నాటౌట్​గా ప్రకటించినా అతడి నిర్ణయాన్ని సవరించి ఔటివ్వాలి. ప్రస్తుతం డీఆర్​ఎస్​లో భాగంగా బంతి 50 శాతానికి పైగా స్టంప్స్​ను తాకినప్పుడే ఆన్​ఫీల్డ్​ అంపైర్ నిర్ణయాన్ని సవరిస్తున్నారు. అది సరికాదు". అని సచిన్​ వెల్లడించాడు.

'Few rules should be changed': Harbhajan wants umpire's call done away with
ఎల్​బీడబ్ల్యూ డీఆర్​ఎస్​ సిస్టమ్​

ఎల్​బీడబ్ల్యూకు అంపైర్​ కాల్​ను తొలగించాలని చాలా మంది మాజీ ఆటగాళ్లు సిఫార్సు చేశారు. క్రికెట్​లో కొన్ని నిబంధనలను మార్చాలని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) నిశ్చయించింది. కరోనా వైరస్​ కారణంగా టెస్టు మ్యాచ్​ల్లో న్యూట్రల్​ అంపైర్లు నియమించడం వల్ల జట్లకు అదనపు సమీక్ష తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధన వల్ల ప్రతి ఇన్నింగ్స్​లో జట్లు గరిష్ఠంగా మూడుసార్లు సమీక్షకు వెళ్లొచ్చు.

క్రికెట్​లో లెగ్​ బిఫోర్​ వికెట్​ (ఎల్​బీడబ్ల్యూ) నిర్ణయానికి సంబంధించి సమీక్ష కోసం 'అంపైర్​ కాల్​'ను తొలగించాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​సింగ్​. ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్​ సచిన్​ అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేయగా.. మాస్టర్​కు మద్దతిస్తూ ట్వీట్​ చేశాడు భజ్జీ. క్రికెట్​ మరింత సులభతరం కావడానికి దీనితో పాటు మరికొన్ని నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు​.

  • Agree with you Paji 1000 percent correct.. If the ball is touching the stump or kissing the Stumps it should be given out..It does not matter how much part of the ball hit the wicket..few rules should b changed in the game for betterment of the game..this is certainly 1 of those https://t.co/m1PfaIpR8y

    — Harbhajan Turbanator (@harbhajan_singh) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సచిన్​ చెప్పినదానిని నేను వేయి శాతం అంగీకరిస్తున్నా. బంతి స్టంప్స్​ను తాకి వెళ్లినా.. దాన్ని ఔట్​గా పరిగణించాలి. స్టంప్స్​ను 50 శాతానికి పైగా టచ్​ అవ్వకపోయినా.. తాకుతూ వెళ్లినా ఔట్​గా ప్రకటించాలి. క్రికెట్​ నియమాలలో మార్చాల్సిన రూల్స్​లో ఇదే మొదటిది".

- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

బంతి వికెట్​కు​ తాకడంపై నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని సచిన్​ ఇటీవలే తన ట్విట్టర్​లో అభిప్రాయాన్ని తెలియజేశాడు. "బంతి ఎంత శాతం స్టంప్స్​ను తాకుతుందన్నది అనవసరం. డీఆర్​ఎస్​లో బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటించాల్సిందే. ఆన్​ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్​మన్​ను నాటౌట్​గా ప్రకటించినా అతడి నిర్ణయాన్ని సవరించి ఔటివ్వాలి. ప్రస్తుతం డీఆర్​ఎస్​లో భాగంగా బంతి 50 శాతానికి పైగా స్టంప్స్​ను తాకినప్పుడే ఆన్​ఫీల్డ్​ అంపైర్ నిర్ణయాన్ని సవరిస్తున్నారు. అది సరికాదు". అని సచిన్​ వెల్లడించాడు.

'Few rules should be changed': Harbhajan wants umpire's call done away with
ఎల్​బీడబ్ల్యూ డీఆర్​ఎస్​ సిస్టమ్​

ఎల్​బీడబ్ల్యూకు అంపైర్​ కాల్​ను తొలగించాలని చాలా మంది మాజీ ఆటగాళ్లు సిఫార్సు చేశారు. క్రికెట్​లో కొన్ని నిబంధనలను మార్చాలని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) నిశ్చయించింది. కరోనా వైరస్​ కారణంగా టెస్టు మ్యాచ్​ల్లో న్యూట్రల్​ అంపైర్లు నియమించడం వల్ల జట్లకు అదనపు సమీక్ష తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధన వల్ల ప్రతి ఇన్నింగ్స్​లో జట్లు గరిష్ఠంగా మూడుసార్లు సమీక్షకు వెళ్లొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.