ఈ ఏడాదితో పాటు రానున్న రెండేళ్ల పాటు చెన్నైకి ధోనీ కెప్టెన్గా ఉంటాడని సీఎస్క్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"అవును. ఐపీఎల్ 2020, 2021లో ధోనీ ఆడతాడు. 2022లోనూ జట్టులోనే ఉంటాడు. ధోనీ ప్రాక్టీసు చేస్తున్నాడని నాకు మీడియా ద్వారానే తెలిసింది. కెప్టెన్ ఫామ్ గురించి మాకు కంగారేమి లేదు. తన బాధ్యతలేంటో మహీకి తెలుసు" -కాశీ విశ్వనాథన్, చెన్నై జట్టు సీఈఓ
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. గతవారం స్వస్థలం రాంచీలోని ఇండోర్ అకాడమీ ప్రాక్టీసు చేశాడు. ఆగస్టు 16-20 మధ్య జరగబోయే శిక్షణా శిబిరంలో పాల్గొనున్నాడని సమాచారం.
గతేడాది ప్రపంచకప్లో చివరగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. మార్చిలో కరోనా రావడం, లీగ్ నిరవధిక పడటం, టీ20 ప్రపంచకప్ వాయిదా.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది.