ETV Bharat / sports

'ధోనీ వల్ల అవకాశం లేకుండా పోయింది'

టీమ్​ఇండియాలోకి ధోనీ వచ్చిన తర్వాత మిగతా వికెట్ కీపర్లకు అవకాశం లేకుండా పోయిందని చెప్పాడు సీనియర్ క్రికెటర్ పార్థివ్ పటేల్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

author img

By

Published : Jun 6, 2020, 5:31 AM IST

'ధోనీ వల్ల అవకాశం లేకుండా పోయింది'
ధోనీ పార్థివ్ పటేల్

మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వకముందు టీమ్​ఇండియాకు పార్థివ్ పటేల్ వికెట్​కీపర్​గా ఉండేవాడు. అయితే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇతడు విఫలమయ్యాడు. 2005లో జట్టులోకి వచ్చిన మహీ.. కెరీర్​ ప్రారంభంలో సూపర్​హిట్టర్​గా పేరు తెచ్చుకోవడం సహా కీపర్​గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో పార్థివ్, దినేశ్ కార్తిక్ లాంటి వారు ఎంపికైనా సరే రెండో కీపర్​గా ఉండాల్సిన పరిస్థితి. అయితే అప్పటి పరిస్థితుల గురించి ఇటీవలే మాట్లాడిన పార్థివ్.. ధోనీ రాకతో తమకు అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు.

dhoni
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

"టీమ్​ఇండియాలో అప్పటి పరిస్థితుల్ని ఒప్పుకుని, అంగీకరించాల్సిన పరిస్థితి. ధోనీ కెప్టెన్​గా ఉండటం వల్ల మిగిలిన కీపర్లు, రెండో వికెట్​ కీపర్​ స్థానం కోసమే పోటీపడాల్సి వచ్చింది. దీంతో మాకు కీపింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది" -పార్థివ్ పటేల్, సీనియర్ క్రికెటర్

2002లో అరంగేట్రం చేసిన పార్థివ్.. ఇప్పటివరకు 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 2018లో చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో పాల్గొన్నాడు. ఇటీవలే కాలంలో పంత్, సాహా రాణిస్తుండటం వల్ల అతడికి ఛాన్స్ రావడం కష్టమైంది.

ఇది చదవండి: 'ధోనీ అందుకే సామాజిక మాధ్యమాల్లోకి రావట్లేదు'

మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వకముందు టీమ్​ఇండియాకు పార్థివ్ పటేల్ వికెట్​కీపర్​గా ఉండేవాడు. అయితే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇతడు విఫలమయ్యాడు. 2005లో జట్టులోకి వచ్చిన మహీ.. కెరీర్​ ప్రారంభంలో సూపర్​హిట్టర్​గా పేరు తెచ్చుకోవడం సహా కీపర్​గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో పార్థివ్, దినేశ్ కార్తిక్ లాంటి వారు ఎంపికైనా సరే రెండో కీపర్​గా ఉండాల్సిన పరిస్థితి. అయితే అప్పటి పరిస్థితుల గురించి ఇటీవలే మాట్లాడిన పార్థివ్.. ధోనీ రాకతో తమకు అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు.

dhoni
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

"టీమ్​ఇండియాలో అప్పటి పరిస్థితుల్ని ఒప్పుకుని, అంగీకరించాల్సిన పరిస్థితి. ధోనీ కెప్టెన్​గా ఉండటం వల్ల మిగిలిన కీపర్లు, రెండో వికెట్​ కీపర్​ స్థానం కోసమే పోటీపడాల్సి వచ్చింది. దీంతో మాకు కీపింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది" -పార్థివ్ పటేల్, సీనియర్ క్రికెటర్

2002లో అరంగేట్రం చేసిన పార్థివ్.. ఇప్పటివరకు 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 2018లో చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో పాల్గొన్నాడు. ఇటీవలే కాలంలో పంత్, సాహా రాణిస్తుండటం వల్ల అతడికి ఛాన్స్ రావడం కష్టమైంది.

ఇది చదవండి: 'ధోనీ అందుకే సామాజిక మాధ్యమాల్లోకి రావట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.