ETV Bharat / sports

ఆ విషయంలో సచిన్ ఎంత అదృష్టవంతుడో!

author img

By

Published : Aug 11, 2020, 4:31 PM IST

వన్డే ప్రపంచకప్​-2011 సెమీఫైనల్లో పాకిస్థాన్​పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది టీమ్​ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో సచిన్ తెందూల్కర్ నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు బౌలర్ ఆశిష్ నెహ్రా.

ఆ విషయంలో సచిన్ ఎంత అదృష్టవంతుడో!
ఆ విషయంలో సచిన్ ఎంత అదృష్టవంతుడో!

వన్డే ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్ ‌(85; 115బంతుల్లో 11x4) బాధ్యతాయుతంగా ఆడి టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అయితే ఈ క్రమంలో సచిన్ నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా నాటి విశేషాల్ని అప్పటి భారత పేసర్ ఆశిష్ నెహ్రా గుర్తు చేసుకున్నాడు. సచిన్ చెలరేగిన ఆ ఇన్నింగ్స్​ను కొనియాడాడు.

సచిన్
సచిన్

"సచిన్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అది ఒకటి. ‘ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు మాస్టర్. ఆ రోజు సచిన్‌ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఉంటుంది. ఏ జట్టు సెమీస్‌కు చేరినా అది గొప్ప జట్టే’.అయితే, ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యం."

-నెహ్రా, టీమ్​ఇండియా పేసర్

అయితే ఈ మ్యాచ్​లో సచిన్ 27, 45, 70, 81 పరుగుల వద్ద పాక్‌ ఆటగాళ్ల తప్పులకు బతికిపోయాడు. అయినా చివరికి శతకానికి చేరవైన సమయంలో అజ్మల్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిది క్యాచ్‌ అందుకోవడంతో వెనుతిరిగాడు. తర్వాత టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరికి జట్టు స్కోర్‌ 260/9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తర్వాత ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆ జట్టుకు మంచి ఆరంభమే లభించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. మధ్యలో మిస్బా ఉల్‌ హక్‌(56) ఒంటరి పోరాటం చేసిన అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక ఆ జట్టు ఓటమిపాలైంది.

వన్డే ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్ ‌(85; 115బంతుల్లో 11x4) బాధ్యతాయుతంగా ఆడి టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అయితే ఈ క్రమంలో సచిన్ నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా నాటి విశేషాల్ని అప్పటి భారత పేసర్ ఆశిష్ నెహ్రా గుర్తు చేసుకున్నాడు. సచిన్ చెలరేగిన ఆ ఇన్నింగ్స్​ను కొనియాడాడు.

సచిన్
సచిన్

"సచిన్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అది ఒకటి. ‘ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు మాస్టర్. ఆ రోజు సచిన్‌ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఉంటుంది. ఏ జట్టు సెమీస్‌కు చేరినా అది గొప్ప జట్టే’.అయితే, ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యం."

-నెహ్రా, టీమ్​ఇండియా పేసర్

అయితే ఈ మ్యాచ్​లో సచిన్ 27, 45, 70, 81 పరుగుల వద్ద పాక్‌ ఆటగాళ్ల తప్పులకు బతికిపోయాడు. అయినా చివరికి శతకానికి చేరవైన సమయంలో అజ్మల్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిది క్యాచ్‌ అందుకోవడంతో వెనుతిరిగాడు. తర్వాత టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరికి జట్టు స్కోర్‌ 260/9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తర్వాత ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆ జట్టుకు మంచి ఆరంభమే లభించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. మధ్యలో మిస్బా ఉల్‌ హక్‌(56) ఒంటరి పోరాటం చేసిన అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక ఆ జట్టు ఓటమిపాలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.