ETV Bharat / sports

తొలిరోజు 88 ఓవర్లు- ఒక్క ఎక్స్​ట్రా పరుగూ ఇవ్వలేదు

author img

By

Published : Feb 13, 2021, 7:23 PM IST

చెన్నై వేదికగా భారత్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ మ్యాచ్​లో ఇంగ్లండ్​ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్​ చేశారు. తొలి రోజు ఆటలో 88 ఓవర్లు వేయగా.. ఒక్క అదనపు పరుగూ ఇవ్వలేదు.

England Team didn't give Extra runs in 2nd Test First day at Chennai
ఇంగ్లండ్​ కట్టుదిట్టమైన బౌలింగ్​- తొలిరోజు నో ఎక్స్​ట్రాస్​

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేశారు. రోజంతా 88 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఇంగ్లీష్​ జట్టు.. ఒక్కటంటే ఒక్క అదనపు పరుగూ ఇవ్వకపోవడం విశేషం.

భారత్​ చేసిన 300 రన్స్​లో.. రోహిత్​(161), రహానె(67), పుజారా(21), అశ్విన్​(13), పంత్​(33*), అక్షర్(5*) పరుగుల చొప్పున చేశారు. ఈ తొలిరోజు ఇన్నింగ్స్​లో ఎక్స్​ట్రాలే లేవు. ​

భారత్​ బౌలర్లు విఫలమైన చోటే..

ఇదే చెపాక్​ పిచ్​పైనే తొలి టెస్ట్​ మ్యాచ్​లో భారీగా అదనపు పరుగులు సమర్పించుకున్నారు భారత బౌలర్లు. తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా 45 ఎక్స్​ట్రా రన్స్​ ఇవ్వగా.. అందులో నో బాల్స్​-20, లెగ్​ బైస్-17 ఉన్నాయి. ఆ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్​ దాడితో టీమ్​ఇండియా భరతం పట్టిన పర్యటక జట్టు.. కేవలం 6 అదనపు పరుగులే ఇచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఆతిథ్య టీమ్​ పర్వాలేదనిస్తూ.. 7 ఎక్స్​ట్రాలే ఇచ్చింది. ప్రత్యర్థి జట్టు మాత్రం 14 అదనపు పరుగులు సమర్పించుకుంది.

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేశారు. రోజంతా 88 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఇంగ్లీష్​ జట్టు.. ఒక్కటంటే ఒక్క అదనపు పరుగూ ఇవ్వకపోవడం విశేషం.

భారత్​ చేసిన 300 రన్స్​లో.. రోహిత్​(161), రహానె(67), పుజారా(21), అశ్విన్​(13), పంత్​(33*), అక్షర్(5*) పరుగుల చొప్పున చేశారు. ఈ తొలిరోజు ఇన్నింగ్స్​లో ఎక్స్​ట్రాలే లేవు. ​

భారత్​ బౌలర్లు విఫలమైన చోటే..

ఇదే చెపాక్​ పిచ్​పైనే తొలి టెస్ట్​ మ్యాచ్​లో భారీగా అదనపు పరుగులు సమర్పించుకున్నారు భారత బౌలర్లు. తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా 45 ఎక్స్​ట్రా రన్స్​ ఇవ్వగా.. అందులో నో బాల్స్​-20, లెగ్​ బైస్-17 ఉన్నాయి. ఆ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్​ దాడితో టీమ్​ఇండియా భరతం పట్టిన పర్యటక జట్టు.. కేవలం 6 అదనపు పరుగులే ఇచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఆతిథ్య టీమ్​ పర్వాలేదనిస్తూ.. 7 ఎక్స్​ట్రాలే ఇచ్చింది. ప్రత్యర్థి జట్టు మాత్రం 14 అదనపు పరుగులు సమర్పించుకుంది.

ఇవీ చదవండి:

చెన్నై టెస్టు: తొలి రోజు ఆట పూర్తి- టీమ్​ఇండియా 300/6

సవాళ్లు విసిరే పిచ్‌పై దుమ్మురేపిన హిట్​మ్యాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.