ETV Bharat / sports

143 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి అలా

author img

By

Published : Jul 8, 2020, 2:13 PM IST

అభిమానులు లేకుండా జరిగే ఇంగ్లాండ్​-వెస్డిండీస్​ తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. ఇలా ఓ మ్యాచ్ జరగడం 143 ఏళ్ల చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.

ENG WI TEST WITHOUT AUDIENCE For the first time in the history of 143 years
ఇంగ్లాండ్​Xవెస్టిండీస్​

కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలల పాటు నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ మొదలవుతోంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా ముప్పు పొంచివుండటం వల్ల, ఈ సిరీస్‌ను బయోబబుల్‌ సృష్టించి నిర్వహిస్తున్నారు. స్టేడియాల్లోకి వీక్షకులకు ప్రవేశం లేదు. అభిమానుల్లేకుండా మ్యాచ్‌ జరగడం 143 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

ENG WI TEST WITHOUT AUDIENCE For the first time in the history of 143 years
ఇంగ్లాండ్​Xవెస్టిండీస్​

కొన్నాళ్ల క్రితమే బయట ప్రపంచంతో ఆటగాళ్లకు సంబంధాలు తెగిపోయాయి. వైరస్‌ బారిన పడకుండా వారంతా సురక్షిత వాతావరణంలోనే ఉన్నారు. ముందుస్తు జాగ్రత్తగా బంతిపై ఉమ్ము రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా రుద్దితే తొలిసారికి అంపైర్లు వదిలేస్తారు. రెండుకన్నా ఎక్కువసార్లు చేస్తే జరిమానాగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు.

ENG WI TEST WITHOUT AUDIENCE For the first time in the history of 143 years
ఇంగ్లాండ్​Xవెస్టిండీస్​

శీతల పానీయాలు, తేనీరు సేవించేందుకు, భోజనం చేసేందుకు విరామాలు యథాతథంగా ఉంటాయి. అయితే కొత్తగా శానిటేషన్‌‌ విరామాలూ రానున్నాయి. ఆట మధ్యలో క్రికెటర్లంతా హ్యాండ్‌ శానిటైజర్లు రుద్దుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే వస్తువులను కెమికల్స్​తో శుభ్రపరుస్తారని సమాచారం. ఇక రిజర్వు ఆటగాళ్లే బాల్‌బాయ్స్‌గా ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాలు అందించేవారు పీపీఈ కిట్లు ధరించే ఉంటారు. అంపైర్లుగా స్థానికులనే తీసుకుంటారు.

ఇదీ చూడండి:'దాదా' సారథ్యంలో టీమ్​ఇండియా ఘనతలెన్నో

కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలల పాటు నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ మొదలవుతోంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా ముప్పు పొంచివుండటం వల్ల, ఈ సిరీస్‌ను బయోబబుల్‌ సృష్టించి నిర్వహిస్తున్నారు. స్టేడియాల్లోకి వీక్షకులకు ప్రవేశం లేదు. అభిమానుల్లేకుండా మ్యాచ్‌ జరగడం 143 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

ENG WI TEST WITHOUT AUDIENCE For the first time in the history of 143 years
ఇంగ్లాండ్​Xవెస్టిండీస్​

కొన్నాళ్ల క్రితమే బయట ప్రపంచంతో ఆటగాళ్లకు సంబంధాలు తెగిపోయాయి. వైరస్‌ బారిన పడకుండా వారంతా సురక్షిత వాతావరణంలోనే ఉన్నారు. ముందుస్తు జాగ్రత్తగా బంతిపై ఉమ్ము రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా రుద్దితే తొలిసారికి అంపైర్లు వదిలేస్తారు. రెండుకన్నా ఎక్కువసార్లు చేస్తే జరిమానాగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు.

ENG WI TEST WITHOUT AUDIENCE For the first time in the history of 143 years
ఇంగ్లాండ్​Xవెస్టిండీస్​

శీతల పానీయాలు, తేనీరు సేవించేందుకు, భోజనం చేసేందుకు విరామాలు యథాతథంగా ఉంటాయి. అయితే కొత్తగా శానిటేషన్‌‌ విరామాలూ రానున్నాయి. ఆట మధ్యలో క్రికెటర్లంతా హ్యాండ్‌ శానిటైజర్లు రుద్దుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే వస్తువులను కెమికల్స్​తో శుభ్రపరుస్తారని సమాచారం. ఇక రిజర్వు ఆటగాళ్లే బాల్‌బాయ్స్‌గా ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాలు అందించేవారు పీపీఈ కిట్లు ధరించే ఉంటారు. అంపైర్లుగా స్థానికులనే తీసుకుంటారు.

ఇదీ చూడండి:'దాదా' సారథ్యంలో టీమ్​ఇండియా ఘనతలెన్నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.