ETV Bharat / sports

'ధోనీ నా భుజంపై చేయి వేశాడు.. ఆశ్చర్యపోయా'

author img

By

Published : Jul 8, 2020, 7:30 PM IST

క్రికెటర్​గా తాను ఆడిన చివరి మ్యాచ్​లోని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్​ సౌరభ్​​ గంగూలీ. ఆ మ్యాచ్​లో ధోనీ సడన్​గా వచ్చి తన భుజంపై చేయి వేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు దాదా.

Dhoni is full of surprises: Ganguly on taking over captaincy for few overs in final Test
ధోనీ నా భుజంపై చేయి వేశాడు: గంగూలీ

తాను ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్​, కెప్టెన్ సౌరభ్​ గంగూలీ. 2008లో నాగ్​పుర్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గంగూలీ భుజంపై ధోనీ చేయి వేసిన సంఘటన క్రికెట్​ అభిమానులను ఆకట్టుకుంది. ఆ మ్యాచ్​లో కంగారూ జట్టుపై 172 పరుగులు తేడాతో నెగ్గింది భారత్​. ఈ మ్యాచ్​లో మూడు-నాలుగు ఓవర్ల తర్వాత జట్టు పగ్గాలను ధోనీకి అప్పగించాడు దాదా.

2000-2005 మధ్య 49 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన గంగూలీ.. చివరి మ్యాచ్​లో ధోనీ చేసిన పనికి ఆశ్చర్యపోయానని తాజాగా వెల్లడించాడు.

Dhoni is full of surprises: Ganguly on taking over captaincy for few overs in final Test
నాగపూర్​లో జరిగిన టెస్టులో గంగూలీతో ధోనీ

"క్రికెటర్​గా చివరి టెస్టు నాగ్​పుర్​లో ఆడాను. అదే నా అంతర్జాతీయ కెరీర్​లో చివరి రోజు. అదే చివరి సెషన్ కూడా​. విదర్భ స్డేడియంలోని డ్రెస్సింగ్​ రూమ్​ నుంచి మెట్లు దిగి నేను నడుచుకుంటూ వస్తున్నాను. నా తోటి ఆటగాళ్లంతా దారిలో పక్కన నిల్చొని నాకు సాదర స్వాగతం పలికారు. ఆ మ్యాచ్​లో నాయకత్వ బాధ్యతను వేరొకరి చేతికి అప్పగించా. ధోనీ అతని కెప్టెన్సీలాగే.. అతను నా భుజంపై చేయి వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు".

- సౌరభ్​​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

గంగూలీ.. తన కెరీర్​లో మొత్తం 113 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించి.. 7212 పరుగులు చేశాడు. 2008లో నాగ్​పుర్​ వేదికగా జరిగిన టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

తాను ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్​, కెప్టెన్ సౌరభ్​ గంగూలీ. 2008లో నాగ్​పుర్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గంగూలీ భుజంపై ధోనీ చేయి వేసిన సంఘటన క్రికెట్​ అభిమానులను ఆకట్టుకుంది. ఆ మ్యాచ్​లో కంగారూ జట్టుపై 172 పరుగులు తేడాతో నెగ్గింది భారత్​. ఈ మ్యాచ్​లో మూడు-నాలుగు ఓవర్ల తర్వాత జట్టు పగ్గాలను ధోనీకి అప్పగించాడు దాదా.

2000-2005 మధ్య 49 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన గంగూలీ.. చివరి మ్యాచ్​లో ధోనీ చేసిన పనికి ఆశ్చర్యపోయానని తాజాగా వెల్లడించాడు.

Dhoni is full of surprises: Ganguly on taking over captaincy for few overs in final Test
నాగపూర్​లో జరిగిన టెస్టులో గంగూలీతో ధోనీ

"క్రికెటర్​గా చివరి టెస్టు నాగ్​పుర్​లో ఆడాను. అదే నా అంతర్జాతీయ కెరీర్​లో చివరి రోజు. అదే చివరి సెషన్ కూడా​. విదర్భ స్డేడియంలోని డ్రెస్సింగ్​ రూమ్​ నుంచి మెట్లు దిగి నేను నడుచుకుంటూ వస్తున్నాను. నా తోటి ఆటగాళ్లంతా దారిలో పక్కన నిల్చొని నాకు సాదర స్వాగతం పలికారు. ఆ మ్యాచ్​లో నాయకత్వ బాధ్యతను వేరొకరి చేతికి అప్పగించా. ధోనీ అతని కెప్టెన్సీలాగే.. అతను నా భుజంపై చేయి వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు".

- సౌరభ్​​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

గంగూలీ.. తన కెరీర్​లో మొత్తం 113 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించి.. 7212 పరుగులు చేశాడు. 2008లో నాగ్​పుర్​ వేదికగా జరిగిన టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.