ETV Bharat / sports

బాక్సింగ్​ డే టెస్టులో తెలుగు ముచ్చట!

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్​ వద్ద ఫీల్డింగ్​లో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్​ హనుమ విహారి.. అభిమానులతో తెలుగులో సంభాషించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

author img

By

Published : Dec 29, 2020, 10:21 PM IST

Cricketer Hanuma Vihari speaks with fan in telugu during Boxing Day Test
బాక్సింగ్​ డే టెస్టులో తెలుగు ముచ్చట!

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూలపై రహానెసేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే మ్యాచ్‌ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హనుమవిహారి స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

విహారిని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. 'తొందరగా ఔట్‌ చేయండి' అని అన్నాడు. దీంతో విహారి అభిమానుల వైపు నడుస్తూ.. 'ఔట్‌ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని బదులిచ్చాడు. ఆసీస్‌ ఆలౌటైతే, ఆ తర్వాత భారత్‌ ఛేదనకు దిగి సులువుగా విజయం సాధిస్తుందని, దీంతో మ్యాచ్‌ తొందరగా ముగుస్తుందనే ఉద్దేశంతో విహారి ఇలా సరదాగా అభిమానితో చెప్పాడు. ఏ ప్రేక్షకుడైనా మ్యాచ్ తొందరగా ముగిసిపోవాలని ఆశించడు కదా! కాగా, కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా ఉన్నంతసేపు దీటుగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.

మరోవైపు, 133/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా‌ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేసింది. జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: దిగ్గజ మురళీధరన్​ రికార్డు బ్రేక్​ చేసిన అశ్విన్​

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూలపై రహానెసేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే మ్యాచ్‌ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హనుమవిహారి స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

విహారిని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. 'తొందరగా ఔట్‌ చేయండి' అని అన్నాడు. దీంతో విహారి అభిమానుల వైపు నడుస్తూ.. 'ఔట్‌ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని బదులిచ్చాడు. ఆసీస్‌ ఆలౌటైతే, ఆ తర్వాత భారత్‌ ఛేదనకు దిగి సులువుగా విజయం సాధిస్తుందని, దీంతో మ్యాచ్‌ తొందరగా ముగుస్తుందనే ఉద్దేశంతో విహారి ఇలా సరదాగా అభిమానితో చెప్పాడు. ఏ ప్రేక్షకుడైనా మ్యాచ్ తొందరగా ముగిసిపోవాలని ఆశించడు కదా! కాగా, కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా ఉన్నంతసేపు దీటుగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.

మరోవైపు, 133/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా‌ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేసింది. జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: దిగ్గజ మురళీధరన్​ రికార్డు బ్రేక్​ చేసిన అశ్విన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.