ETV Bharat / sports

'కరోనా కారణంగా పుజారా కౌంటీ ఒప్పందం రద్దు' - కరోనా

కరోనా లాక్​డౌన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​లో జరగాల్సిన కౌంటీ ఛాంపియన్​షిప్​ రద్దయింది. ఈ సందర్భంగా టీమ్​ఇండియా స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా ప్రదర్శనను మిస్​ అవుతామని ఆ క్లబ్​ ఓ ప్రకటనలో తెలిపింది.

Covid-19 Effect: Cheteshwar Pujara's county championship deal with Gloucestershire cancelled
'పుజారా ప్రదర్శనను మేము చూడలేకపోతున్నాం'
author img

By

Published : Apr 9, 2020, 7:37 PM IST

ఏప్రిల్​ 12 నుంచి జరగాల్సిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు గ్లోస్టర్​షైర్​తో టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా కారణంగా ఈ టోర్నీని రద్దు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంక్షోభం కారణంగా ఈ ఒప్పందం ముగిసిందని గ్లోస్టర్​షైర్ గురువారం తెలిపింది. మే 28 వరకు జరగాల్సిన అన్ని క్రికెట్​ టోర్నీలను రద్దు చేస్తున్నట్టు తాజాగా ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు ప్రకటించటమే అందుకు కారణం.

"ఈ ఏడాది చెతేశ్వర్​ పుజారా ఆటను చూసే అవకాశాన్ని మేము కోల్పోయాం. కరోనా కారణంగా మే నెల చివరి వరకు ఎలాంటి టోర్నీలు నిర్వహించడం లేదు. ఈ పరిణామాలతో ప్రతి ఒక్కరు తీవ్రంగా నిరాశ చెందుతారని తెలుసు."

- కౌంటీ ఛాంపియన్​షిప్​ క్లబ్​

పుజారా ఇంతకుముందు ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడాడు. భారత జట్టు తరపున 77 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 48.66 సగటుతో 5,840 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి.. 'ఆ ఎనిమిది నెలలు నరకం అనుభవించా!'

ఏప్రిల్​ 12 నుంచి జరగాల్సిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు గ్లోస్టర్​షైర్​తో టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా కారణంగా ఈ టోర్నీని రద్దు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంక్షోభం కారణంగా ఈ ఒప్పందం ముగిసిందని గ్లోస్టర్​షైర్ గురువారం తెలిపింది. మే 28 వరకు జరగాల్సిన అన్ని క్రికెట్​ టోర్నీలను రద్దు చేస్తున్నట్టు తాజాగా ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు ప్రకటించటమే అందుకు కారణం.

"ఈ ఏడాది చెతేశ్వర్​ పుజారా ఆటను చూసే అవకాశాన్ని మేము కోల్పోయాం. కరోనా కారణంగా మే నెల చివరి వరకు ఎలాంటి టోర్నీలు నిర్వహించడం లేదు. ఈ పరిణామాలతో ప్రతి ఒక్కరు తీవ్రంగా నిరాశ చెందుతారని తెలుసు."

- కౌంటీ ఛాంపియన్​షిప్​ క్లబ్​

పుజారా ఇంతకుముందు ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడాడు. భారత జట్టు తరపున 77 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 48.66 సగటుతో 5,840 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి.. 'ఆ ఎనిమిది నెలలు నరకం అనుభవించా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.