ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ ఈ ఏడాది జరుగుతుందా?

కరోనా సంక్షోభం కారణంగా టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై తర్జనభర్జన పడుతోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఇప్పటికే రూపొందించిన టోర్నీ ముందస్తు ప్రణాళికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

author img

By

Published : Apr 18, 2020, 5:28 AM IST

Corona Effect: Will the ICC T20 World Cup be held this year?
టీ20 ప్రపంచకప్​ ఈ ఏడాది జరుగుతుందా?

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. క్రికెట్​ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్​-2020 సీజనూ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఆ దేశంలో రాకపోకలు నిలిపేసిన క్రమంలో టోర్నీని వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టోర్నీని నిర్వహించటానికి పూర్తి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

"ఐసీసీ టీ20 ప్రపంచకప్​ టోర్నీ నిర్వహణ కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికనే ఫాలో అవుతాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల ఆకస్మిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అయితే వాటి అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ నిర్వహణకు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సహా నిపుణుల సలహాలు తీసుకుంటాం."

-- ఐసీసీ అధికార ప్రతినిధి

టీ20 ప్రపంచకప్​ నిర్వహణకు ఇంకా ఆరు నెలల సమయం ఉండటం వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని ఐసీసీ ఇటీవలే వెల్లడించింది.

ఇదీ చూడండి.. 'శ్రీలంకలో ఐపీఎల్​ నిర్వహించాలనే చర్చ జరగలేదు'

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. క్రికెట్​ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్​-2020 సీజనూ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఆ దేశంలో రాకపోకలు నిలిపేసిన క్రమంలో టోర్నీని వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టోర్నీని నిర్వహించటానికి పూర్తి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

"ఐసీసీ టీ20 ప్రపంచకప్​ టోర్నీ నిర్వహణ కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికనే ఫాలో అవుతాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల ఆకస్మిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అయితే వాటి అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ నిర్వహణకు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సహా నిపుణుల సలహాలు తీసుకుంటాం."

-- ఐసీసీ అధికార ప్రతినిధి

టీ20 ప్రపంచకప్​ నిర్వహణకు ఇంకా ఆరు నెలల సమయం ఉండటం వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని ఐసీసీ ఇటీవలే వెల్లడించింది.

ఇదీ చూడండి.. 'శ్రీలంకలో ఐపీఎల్​ నిర్వహించాలనే చర్చ జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.