తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో హరియాణా ఆటగాడు రాహుల్ తెవాతియా హర్షం వ్యక్తం చేశాడు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచిచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
"ఐపీఎల్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడాను. కానీ, భారత జట్టులో ఇప్పుడు ఆయనతో కలిసి ఆడబోతున్నాను. భారత క్రికెట్ దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చూసుకునే క్షణాల కోసం వేచి చూస్తున్నా. వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం."
-రాహుల్ తెవాతియా, ఆల్రౌండర్
2020 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, చక్కటి ప్రదర్శనతో ఉత్తమ ఆల్రౌండర్గా అభిమానులను ఆకర్షించాడు తెవాతియా. జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో.... హరియాణా జట్టులో అడినప్పుడు ఆటలో చాలా మెళకువలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.
టెస్టు సిరీస్ అనంతరం ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, ఆల్రౌండర్ తెవాటియా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఊహించినట్లే సూర్యకుమార్ యాదవ్కు కూడా జట్టులో చోటు దక్కింది.
ఇదీ చదవండి:ఇంగ్లాండ్తో టీ20లకు సూర్యకుమార్, ఇషాన్- జట్టు ఇదే