ETV Bharat / sports

బయో బబుల్​లో ఉండటంపై ఆసీస్​ కెప్టెన్​ ఆందోళన

author img

By

Published : Jan 27, 2021, 5:58 PM IST

దీర్ఘకాలంగా బయో బబుల్​లో ఉండటంపై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్​ ఫించ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎక్కువ కాలం ఇలానే ఉంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చన్నారు. దీనిపై క్రికెట్​ ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.

Being locked up for months in bio-bubble is unsustainable: Finch
బయో బుడగలో ఉండటంపై ఆసీస్​ కెప్టెన్​ ఆందోళన

దీర్ఘ కాలంగా బయో బబుల్​లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఆరోన్​ ఫించ్. కుటుంబాలు ఉన్న క్రికెటర్లను నిర్భందంలో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని తెలిపాడు.

గత తొమ్మిది నెలల కాలంలో ఎక్కువ క్వారంటైన్​, బయో బబుల్​, ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​లోనే ఉండాల్సి వచ్చిందని ఫించ్​ ఆవేదనగా తెలిపాడు. విభిన్న ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్ల విషయంలో క్రికెట్​ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరాడు.

ఏప్రిల్​ నుంచి ఇప్పటి వరకు 20, 21 రోజులు మినహా మొత్తం లాక్​డౌన్​, బయో బబుల్​లో గడిపినట్లు నా భార్య చెప్పింది. ఇలానే దీర్ఘ కాలం కొనసాగితే ఏదైనా జరగొచ్చు. ఇందులో సందేహం లేదు. ఆటగాళ్ల సంక్షేమం కూడా అవసరమే. నెలల తరబడి నిర్భందంలో ఉంచితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

-ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​.

ప్రస్తుతం పాకిస్థాన్​లో టెస్టు సిరీస్​ ఆడుతున్న దక్షిణాఫ్రికా సీనియర్​ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్​ కూడా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: మరోసారి ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన గంగూలీ

"పరిస్థితులు వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా ఉంటాయని ఫించ్​ పేర్కొన్నాడు. వివాహమై పిల్లలు ఉన్న వారిని ఇలా నిర్భందంలో ఉంచితే కచ్చితంగా ఇబ్బందే. కుటుంబానికి సంబంధించి ప్రతి విషయం మేము చూసుకోవాల్సి ఉంటుంది. అదే పెళ్లి కాని వారికి ఆ సమస్య ఉండకపోవచ్చు" అని ఫించ్​ అభిప్రాయపడ్డాడు.

విశ్రాంతి కావాలి..

న్యూజిలాండ్​ వేదికగా ఫిబ్రవరి 22 నుంచి జరుగనున్న 5 మ్యాచ్​ల టీ-20 సిరీస్​కు ముందు కొన్ని రోజులు విశ్రాంతిని కోరుకుంటున్నట్లు ఆసీస్​ కెప్టెన్​ చెప్పుకొచ్చాడు. 'కొన్ని రోజులు రిలాక్స్​గా బీచ్​లో గడపాలనుకుంటున్నా. నా కిట్​ బ్యాగ్​ను కారులో వేసి తాళం వేస్తాను. దానిని నాతో పాటు తీసుకెళ్లను' అని వెల్లడించాడు.

ఇంగ్లాండ్​ను అనుసరించండి..

ప్రస్తుత కొవిడ్​ పరిస్థితుల్లో ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు అనుసరిస్తున్న విధానాలు.. క్రికెట్​ ఆస్ట్రేలియాకు బ్లూ ప్రింట్​ కావాలని ఆరోన్​ సూచించాడు. యాషెస్​కు ముందు శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించనున్న ఇంగ్లాండ్​ జట్టు 15 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. రొటేషన్​ పద్ధతిలో జోఫ్రా ఆర్చర్​, జోస్​ బట్లర్​, బెన్​ స్టోక్స్​లకు విశ్రాంతిని కల్పించింది.

బ్యాటింగ్​పై ప్రభావం..

ఇలా ఒక బయో బబుల్​ నుంచి మరో దానికి మారడం వల్ల తన బ్యాటింగ్​పై ప్రభావం చూపిస్తుందని ఫించ్ తెలిపాడు. బిగ్​ బాష్​ లీగ్​ సందర్భంగా 13 మ్యాచ్​లలో 13.76 సగటుతో కేవలం 179 పరుగులు మాత్రమే చేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: డబ్ల్యూటీఎఫ్​ తొలి మ్యాచ్​లో సింధు ఓటమి

దీర్ఘ కాలంగా బయో బబుల్​లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఆరోన్​ ఫించ్. కుటుంబాలు ఉన్న క్రికెటర్లను నిర్భందంలో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని తెలిపాడు.

గత తొమ్మిది నెలల కాలంలో ఎక్కువ క్వారంటైన్​, బయో బబుల్​, ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​లోనే ఉండాల్సి వచ్చిందని ఫించ్​ ఆవేదనగా తెలిపాడు. విభిన్న ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్ల విషయంలో క్రికెట్​ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరాడు.

ఏప్రిల్​ నుంచి ఇప్పటి వరకు 20, 21 రోజులు మినహా మొత్తం లాక్​డౌన్​, బయో బబుల్​లో గడిపినట్లు నా భార్య చెప్పింది. ఇలానే దీర్ఘ కాలం కొనసాగితే ఏదైనా జరగొచ్చు. ఇందులో సందేహం లేదు. ఆటగాళ్ల సంక్షేమం కూడా అవసరమే. నెలల తరబడి నిర్భందంలో ఉంచితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

-ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​.

ప్రస్తుతం పాకిస్థాన్​లో టెస్టు సిరీస్​ ఆడుతున్న దక్షిణాఫ్రికా సీనియర్​ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్​ కూడా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: మరోసారి ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన గంగూలీ

"పరిస్థితులు వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా ఉంటాయని ఫించ్​ పేర్కొన్నాడు. వివాహమై పిల్లలు ఉన్న వారిని ఇలా నిర్భందంలో ఉంచితే కచ్చితంగా ఇబ్బందే. కుటుంబానికి సంబంధించి ప్రతి విషయం మేము చూసుకోవాల్సి ఉంటుంది. అదే పెళ్లి కాని వారికి ఆ సమస్య ఉండకపోవచ్చు" అని ఫించ్​ అభిప్రాయపడ్డాడు.

విశ్రాంతి కావాలి..

న్యూజిలాండ్​ వేదికగా ఫిబ్రవరి 22 నుంచి జరుగనున్న 5 మ్యాచ్​ల టీ-20 సిరీస్​కు ముందు కొన్ని రోజులు విశ్రాంతిని కోరుకుంటున్నట్లు ఆసీస్​ కెప్టెన్​ చెప్పుకొచ్చాడు. 'కొన్ని రోజులు రిలాక్స్​గా బీచ్​లో గడపాలనుకుంటున్నా. నా కిట్​ బ్యాగ్​ను కారులో వేసి తాళం వేస్తాను. దానిని నాతో పాటు తీసుకెళ్లను' అని వెల్లడించాడు.

ఇంగ్లాండ్​ను అనుసరించండి..

ప్రస్తుత కొవిడ్​ పరిస్థితుల్లో ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు అనుసరిస్తున్న విధానాలు.. క్రికెట్​ ఆస్ట్రేలియాకు బ్లూ ప్రింట్​ కావాలని ఆరోన్​ సూచించాడు. యాషెస్​కు ముందు శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించనున్న ఇంగ్లాండ్​ జట్టు 15 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. రొటేషన్​ పద్ధతిలో జోఫ్రా ఆర్చర్​, జోస్​ బట్లర్​, బెన్​ స్టోక్స్​లకు విశ్రాంతిని కల్పించింది.

బ్యాటింగ్​పై ప్రభావం..

ఇలా ఒక బయో బబుల్​ నుంచి మరో దానికి మారడం వల్ల తన బ్యాటింగ్​పై ప్రభావం చూపిస్తుందని ఫించ్ తెలిపాడు. బిగ్​ బాష్​ లీగ్​ సందర్భంగా 13 మ్యాచ్​లలో 13.76 సగటుతో కేవలం 179 పరుగులు మాత్రమే చేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: డబ్ల్యూటీఎఫ్​ తొలి మ్యాచ్​లో సింధు ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.