ETV Bharat / sports

ఈ నెలలోనే టీమిండియా సెలక్టర్ల ఎంపిక: గంగూలీ

టీమిండియా నూతన సెలక్టర్లు ఎవరనేది ఈ నెలాఖరులో తెలియనుంది. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. త్వరలో నూతన సలహా కమిటీ.. అభ్యర్థులకు ముఖాముఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు.

author img

By

Published : Feb 4, 2020, 10:49 AM IST

Updated : Feb 29, 2020, 3:01 AM IST

BCCI President Sourav Ganguly
ఈ నెలలోనే టీమిండియా సెలక్టర్ల ఎంపిక: గంగూలీ

బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో ఏర్పాటైన క్రికెట్‌ సలహా కమిటీ.. అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ముఖాముఖీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి.. ఇద్దరు సభ్యులను ప్రకటించనున్నట్లు తాజాగా వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

BCCI President Sourav Ganguly
క్రికెట్​ సలహా కమిటీలో మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌, ఆర్పీ సింగ్‌

ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, అతడి సహచరుడు గగన్‌ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, నయన్‌ మోంగియా, చేతన్‌ చౌహాన్‌, నిఖిల్‌ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు.

టెస్టుల అనుభవమే ముఖ్యమా..!

అభ్యర్థుల్లో అత్యంత సీనియర్‌ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలక్టర్‌ పదవి రావొచ్చని సమాచారం. అంతేకాకుండా బీసీసీఐ రాజ్యాంగంలోని 'కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి ఛైర్మన్‌గా నియామకం అవుతారు' అన్న నిబంధన ఇందుకు బలం చేకూరుస్తోంది.

త్రిముఖ పోరు...

ప్రస్తుత అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ అత్యంత అనుభవశాలి. 1983లో అతను క్రికెట్లోకి అరంగేట్రం చేసినా... తక్కువ టెస్టులే ఆడాడు. వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు), అగార్కర్‌ (26 టెస్టులు) ఎక్కువ మ్యాచ్​లు ఆడారు. వీరిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్‌ పరాంజపె వెస్ట్‌జోన్‌ నుంచి ఉన్నాడు. ముంబయికి చెందిన అగార్కర్‌ ఎంపికైతే వెస్ట్‌జోన్‌ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా అతడికి అవకాశం లేనట్టేనా అన్న సందేహం తలెత్తుతోంది.

బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో ఏర్పాటైన క్రికెట్‌ సలహా కమిటీ.. అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ముఖాముఖీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి.. ఇద్దరు సభ్యులను ప్రకటించనున్నట్లు తాజాగా వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

BCCI President Sourav Ganguly
క్రికెట్​ సలహా కమిటీలో మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌, ఆర్పీ సింగ్‌

ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, అతడి సహచరుడు గగన్‌ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, నయన్‌ మోంగియా, చేతన్‌ చౌహాన్‌, నిఖిల్‌ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు.

టెస్టుల అనుభవమే ముఖ్యమా..!

అభ్యర్థుల్లో అత్యంత సీనియర్‌ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలక్టర్‌ పదవి రావొచ్చని సమాచారం. అంతేకాకుండా బీసీసీఐ రాజ్యాంగంలోని 'కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి ఛైర్మన్‌గా నియామకం అవుతారు' అన్న నిబంధన ఇందుకు బలం చేకూరుస్తోంది.

త్రిముఖ పోరు...

ప్రస్తుత అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ అత్యంత అనుభవశాలి. 1983లో అతను క్రికెట్లోకి అరంగేట్రం చేసినా... తక్కువ టెస్టులే ఆడాడు. వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు), అగార్కర్‌ (26 టెస్టులు) ఎక్కువ మ్యాచ్​లు ఆడారు. వీరిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్‌ పరాంజపె వెస్ట్‌జోన్‌ నుంచి ఉన్నాడు. ముంబయికి చెందిన అగార్కర్‌ ఎంపికైతే వెస్ట్‌జోన్‌ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా అతడికి అవకాశం లేనట్టేనా అన్న సందేహం తలెత్తుతోంది.

AP Video Delivery Log - 0100 GMT News
Tuesday, 4 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0045: US Senate Impeachment Murkowski AP Clients Only 4252748
Murkowski: 'I cannot vote to convict' Trump
AP-APTN-0036: France Iowa Caucus AP Clients Only 4252747
Expat Iowans take part in caucus in Paris
AP-APTN-0015: Australia Evacuees Christmas Island No access Australia 4252746
Wuhan evacuees arrive on Christmas Island
AP-APTN-2339: Libya Armed Forces AP Clients Only 4252745
LAAF: Ongoing conflict purely between Libyan people
AP-APTN-2328: US MO Chiefs Return Home Must credit KMBC, No access Kansas City, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4252744
Super Bowl winner Chiefs return to Kansas City
AP-APTN-2322: US Senate Manchin Censure AP Clients Only 4252743
Manchin: Censure may be alternative to impeachment
AP-APTN-2320: Brazil US Energy Secretary AP Clients Only 4252742
U.S - Brazil: Nuclear Energy cooperation
AP-APTN-2305: US IL State of Union Analysis AP Clients Only 4252741
Expert: Campaign agenda to emerge in Trump speech
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 29, 2020, 3:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.