ఇటీవలే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్.. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోటీపడేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో వన్డే, టీ20 సిరీస్ల కోసం ఆసీస్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబరు 4 నుంచి పర్యటన ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తలపడే ముందు ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లు, టీ20 ఫార్మాట్లో ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడనుంది. సెప్టెంబర్ 6, 8 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్లు.. ఆ తర్వాత సెప్టెంబరు 11, 13, 16 తేదీల్లో మూడు వన్టేలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టామ్ హారిసన్ మాట్లాడుతూ.. ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టోర్నమెంటు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
ఈ పర్యటనకు కృషి చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, ఆటగాళ్లు, సిబ్బంది, నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మ్యాచ్లు జరిగేలా చూడటంలో వారి సహకారం కీలకమైనది. క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎంతో రసవత్తరమైనది.
టామ్ హారిసన్, ఈసీబీ సీఈఓ.
ఈ పర్యటన కోసం 21 మందితో జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. వీరే టీ20, వన్డే మ్యాచ్ల్లో తలపడనున్నారు.
జట్టు ఇదే...
ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్(వైస్ కెప్టెన్), జోష్ హేజెల్వుడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, రిలే మెరేడిత్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
ఈ క్రమంలోనే యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్లో వార్నర్, ఫించ్ వంటి స్టార్ క్రికెటర్లను ఆరంభ మ్యాచ్ల్లో అభిమానులు మిస్సవ్వనున్నారు. సెప్టెంబరు 19న ఈ లీగ్ ప్రారంభం కానుంది.