ETV Bharat / sports

తొలి రోజు: ఆసీస్​ 195 ఆలౌట్- 36/1 వద్ద భారత్

రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 195 పరుగులకు ఆలౌట్​ అవ్వగా.. టీమ్​ఇండియా వికెట్​ కోల్పోయి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా, గిల్​ ఉన్నారు.

author img

By

Published : Dec 26, 2020, 12:53 PM IST

Updated : Dec 26, 2020, 1:32 PM IST

aus ind
ఆసీస్​ భారత్​

మెల్​బోర్న్​ వేదికగా భారత్​- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. 159 పగుగుల ఆధిక్యంలో ఆసీస్​ ఉంది. తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్​ బౌలింగ్​లో ఓపెనర్​గా దిగిన మయాంక్​ అగర్వాల్​ ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకముందే భారత్​ తొలి వికెట్​ చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా ఉన్నారు. వీరిద్దరూ 8 ఓవర్లకు 28 పరుగులు చేశారు.

అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో తడబడుతూ ఆడింది. భారత బౌలర్లు ప్రత్యర్థి​ బ్యాట్స్​మెన్​ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్​ అయింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెల్​బోర్న్​ వేదికగా భారత్​- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. 159 పగుగుల ఆధిక్యంలో ఆసీస్​ ఉంది. తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్​ బౌలింగ్​లో ఓపెనర్​గా దిగిన మయాంక్​ అగర్వాల్​ ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకముందే భారత్​ తొలి వికెట్​ చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా ఉన్నారు. వీరిద్దరూ 8 ఓవర్లకు 28 పరుగులు చేశారు.

అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో తడబడుతూ ఆడింది. భారత బౌలర్లు ప్రత్యర్థి​ బ్యాట్స్​మెన్​ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్​ అయింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Dec 26, 2020, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.