మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు ఆడిన 50 టెస్టుల్లో టీమ్ఇండియా ఎనిమిదింటిలో గెలుపొందింది. వాటిలో సగం అంటే నాలుగు మ్యాచ్లు మెల్బోర్న్ మైదానంలో జరిగినవే కావడం విశేషం. మిగిలిన నాలుగింటిలో పెర్త్ (2008), సిడ్నీ (1978), అడిలైడ్లో రెండుసార్లు (2003, 2018) భారత్ గెలిచింది.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో టీమ్ఇండియా విజయాలు:
1978
![AUS vs IND: MCG turns out lucky for India again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mcg1_2912newsroom_1609229442_114.jpg)
1978లో జరిగిన టెస్టులో భారత లెగ్-స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ 12 వికెట్లు (రెండు ఇన్నింగ్స్ల్లో తలో 6) పడగొట్టడం సహా 104 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా 222 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఈ వేదికలో టీమ్ఇండియాకు ఇదే తొలి విజయం. కెప్టెన్గా బిషన్ బేడీ. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 256, ఆస్ట్రేలియా 213 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో భారత రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి 343 స్కోరు నమోదు చేసింది. ఆ ఇన్నింగ్స్లో గావస్కర్(118) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసీస్ బ్యాట్స్మెన్ను 164 పరుగులకే కట్టడి చేయడం వల్ల 222 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది.
1981
![AUS vs IND: MCG turns out lucky for India again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10045156_121_10045156_1609229551521.png)
1981లో జరిగిన టెస్టులో దాదాపుగా ఓడిపోయే మ్యాచ్ను అప్పటి టీమ్ఇండియా ఆల్రౌండర్ కపిల్ దేవ్ గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మన్ గుండప్ప విశ్వనాథ్(114) సెంచరీ చేయడం వల్ల జట్టు స్కోరు 237కు చేరింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 419 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందుంచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 324 పరుగులు చేసి ఆసీస్ కంటే స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఈ పరిస్థితిలో ఆసీస్ బ్యాట్స్మెన్ను 83 పరుగులకు ఆలౌట్ చేసి 59 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయాన్ని అందుకుంది. ఆసీస్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కపిల్ దేవ్(5 వికెట్లు) కీలకపాత్ర పోషించాడు.
2018
![AUS vs IND: MCG turns out lucky for India again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mcg2_2912newsroom_1609229442_339.jpg)
టీమ్ఇండియా పేసర్ బుమ్రాకు ఆస్ట్రేలియా తొలి పర్యటన ఇదే. మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో 86 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్పై 137 పరుగుల భారీ వ్యత్యాసంతో టీమ్ఇండియా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులకు డిక్లేర్డ్ ప్రకటించింది. ఆ ఇన్నింగ్స్లో బుమ్రా ఆరు వికెట్లతో ప్రత్యర్థిపై రెచ్చిపోయి బౌలింగ్ చేయగా ఆసీస్ 151 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకు డిక్లేర్డ్ ప్రకటించింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టును 261 పరుగులకే కట్టడి చేయగలిగింది.
2020
![AUS vs IND: MCG turns out lucky for India again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mcg4_2912newsroom_1609229442_453.jpg)
ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్లోని తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం తర్వాత రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)కు అజింక్య రహానె తాత్కాలిక కెప్టెన్గా ఎంపికయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో సెంచరీ చేసిన రహానె (112) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 195, టీమ్ఇండియా 326 పరుగులే చేశాయి. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆతిథ్య జట్టు 200 పరుగులకే ఆలౌటైంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు సులువుగా లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్సీ విషయంలో రహానె మంచి మార్కులు పడ్డాయి.
ఇదీ చూడండి: రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా