ETV Bharat / sports

నాలుగేళ్లలో కోహ్లీలో చాలా మార్పు: జేమ్స్ అండర్సన్

author img

By

Published : Aug 30, 2020, 5:10 PM IST

వచ్చే ఏడాది భారత్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇంగ్లాండ్​ పేసర్​ అండర్సన్ చెప్పాడు​. కెప్టెన్ కోహ్లీతో అమీతుమీ తేల్చుకుంటానని తెలిపాడు.

Virat Kohli
కోహ్లీ

టెస్టులో ఇటీవలే 600వ వికెట్ల మార్క్​ను అందుకుని ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ​తో తలపడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది భారత్​తో జరగబోయే సిరీస్​లో కోహ్లీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. 2014, 2018లో జరిగిన భారత్-ఇంగ్లాండ్​ సిరీస్​ల​ను గుర్తుచేసుకున్నాడు​. ఈ నాలుగేళ్లలో విరాట్ అసాధారణ ఆటగాడిగా మార్పుచెందాడని అన్నాడు.

Virat Kohli
కోహ్లీ

​"నాణ్యమైన బ్యాట్స్​మన్(కోహ్లీ)​కు బౌలింగ్​ చేయడం కష్టం. కానీ అలాంటి పోరునే నేను ఆస్వాదిస్తాను. అప్పుడే మనలోని సామర్థ్యం బయటపడుతుంది. 2014లో అతడిపై నేను పైచేయి సాధించాను. ఆ సిరీస్​లో 10 ఇన్నింగ్స్​లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు విరాట్. కానీ 2018లో మాత్రం అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. సహనం ఉండటం కూడా నేర్చుకున్నాడు. అందుకే కోహ్లీతో ఎప్పుడెప్పుడు మళ్లీ ఆడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"

-జేమ్స్ అండర్సన్​, ఇంగ్లాండ్​ పేసర్​

ఉపఖండ పిచ్​లపై టెక్నిక్​తో బౌలింగ్​ చేయడం వల్లే తాను విజయంవంతమైన పేసర్​గా​ రాణిస్తున్నట్లు అండర్సన్ తెలిపాడు​. ముఖ్యంగా భారత్​ పిచ్​లపై బౌలింగ్​ చేయడం తనకెంతో ఇష్టమని వెల్లడించాడు.

ఇది చూడండి సింధు షట్లర్​ కావడానికి కారణం ఆ వ్యక్తి!

టెస్టులో ఇటీవలే 600వ వికెట్ల మార్క్​ను అందుకుని ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ​తో తలపడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది భారత్​తో జరగబోయే సిరీస్​లో కోహ్లీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. 2014, 2018లో జరిగిన భారత్-ఇంగ్లాండ్​ సిరీస్​ల​ను గుర్తుచేసుకున్నాడు​. ఈ నాలుగేళ్లలో విరాట్ అసాధారణ ఆటగాడిగా మార్పుచెందాడని అన్నాడు.

Virat Kohli
కోహ్లీ

​"నాణ్యమైన బ్యాట్స్​మన్(కోహ్లీ)​కు బౌలింగ్​ చేయడం కష్టం. కానీ అలాంటి పోరునే నేను ఆస్వాదిస్తాను. అప్పుడే మనలోని సామర్థ్యం బయటపడుతుంది. 2014లో అతడిపై నేను పైచేయి సాధించాను. ఆ సిరీస్​లో 10 ఇన్నింగ్స్​లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు విరాట్. కానీ 2018లో మాత్రం అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. సహనం ఉండటం కూడా నేర్చుకున్నాడు. అందుకే కోహ్లీతో ఎప్పుడెప్పుడు మళ్లీ ఆడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"

-జేమ్స్ అండర్సన్​, ఇంగ్లాండ్​ పేసర్​

ఉపఖండ పిచ్​లపై టెక్నిక్​తో బౌలింగ్​ చేయడం వల్లే తాను విజయంవంతమైన పేసర్​గా​ రాణిస్తున్నట్లు అండర్సన్ తెలిపాడు​. ముఖ్యంగా భారత్​ పిచ్​లపై బౌలింగ్​ చేయడం తనకెంతో ఇష్టమని వెల్లడించాడు.

ఇది చూడండి సింధు షట్లర్​ కావడానికి కారణం ఆ వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.