ETV Bharat / sports

బంగ్లా క్రికెటర్​ బ్యాట్​ను వేలంలో కొన్న అఫ్రిదీ​

బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​, బ్యాట్స్​మన్ ముష్ఫికర్​ రహీమ్​ డబుల్​సెంచరీ చేసిన బ్యాట్​ను వేలంలో పాక్​ మాజీ ఆల్​రౌండర్​ అఫ్రిదీ దక్కించుకున్నాడు. 20 వేల యూఎస్​ డాలర్లు (16.8 లక్షల రూపాయలు) వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నాడని ముష్ఫికర్​ తెలిపాడు.

author img

By

Published : May 16, 2020, 1:29 PM IST

Afridi buys Mushfiqur's bat for USD 20,000
బంగ్లాదేశ్​ క్రికెటర్​ బ్యాట్​ను వేలంలో కొన్న పాక్​ ఆల్​రౌండర్​

పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిద్​ అఫ్రిదీ తన బ్యాట్​ను వేలంలో​ కొన్నాడని బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​ వెల్లడించాడు. కరోనాపై పోరాటంలో విరాళాలు సేకరించడానికి 2013లో శ్రీలంకపై డబుల్​సెంచరీ చేసిన బ్యాట్​ను వేలానికి ఉంచాడు రహీమ్​. దాన్ని 20 వేల యూఎస్​ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు అఫ్రిదీ. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"తన ఫౌండేషన్​లో ఉంచడం కోసం షాహిద్​ అఫ్రిదీ నా బ్యాట్​ను కొన్నాడు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. గతవారం బ్యాట్​ను అమ్మడానికి పెట్టా. కానీ కొంతమంది మోసగాళ్ల వల్ల రద్దు చేశాము. ఈ విషయం తెలుసుకున్న అఫ్రిదీ తానే స్వయంగా బ్యాట్​ను కొంటానని మే 13న ఒక లెటర్​ రాశాడు. దాని కోసం 20 వేల యూఎస్​ డాలర్లు ( బంగ్లాదేశ్​ కరెన్సీ ప్రకారం 16.8 లక్షల రూపాయలు) వెచ్చించాడు".

-ముష్ఫికర్​ రహీమ్​, బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​

అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్​లో షేర్​ చేశాడు ముష్ఫికర్​. నిజమైన హీరోలు ఇలాంటి సమయంలోనే బయటకు వస్తారని.. ఈ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుదామని వీడియోలో అఫ్రిదీ తెలిపాడు.

క్రికెటర్లందరూ తమకు సంబంధించిన వాటిని వేలంవేసి వాటి ద్వారా వచ్చిన నిధులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలే టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ కలిసి గుజరాత్​ లయన్స్​పై ఆడిన క్రికెట్​ కిట్​ను వేలం వేశారు. ఇంగ్లాండ్​ వికెట్​ కీపర్​ జాస్​ బట్లర్​.. తన ప్రపంచకప్​ జెర్సీని వేలానికి వేశాడు.

ఇదీ చూడండి.. కచ్చితంగా ఆ రెండు రికార్డులు నావే: జకోవిచ్

పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిద్​ అఫ్రిదీ తన బ్యాట్​ను వేలంలో​ కొన్నాడని బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​ వెల్లడించాడు. కరోనాపై పోరాటంలో విరాళాలు సేకరించడానికి 2013లో శ్రీలంకపై డబుల్​సెంచరీ చేసిన బ్యాట్​ను వేలానికి ఉంచాడు రహీమ్​. దాన్ని 20 వేల యూఎస్​ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు అఫ్రిదీ. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"తన ఫౌండేషన్​లో ఉంచడం కోసం షాహిద్​ అఫ్రిదీ నా బ్యాట్​ను కొన్నాడు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. గతవారం బ్యాట్​ను అమ్మడానికి పెట్టా. కానీ కొంతమంది మోసగాళ్ల వల్ల రద్దు చేశాము. ఈ విషయం తెలుసుకున్న అఫ్రిదీ తానే స్వయంగా బ్యాట్​ను కొంటానని మే 13న ఒక లెటర్​ రాశాడు. దాని కోసం 20 వేల యూఎస్​ డాలర్లు ( బంగ్లాదేశ్​ కరెన్సీ ప్రకారం 16.8 లక్షల రూపాయలు) వెచ్చించాడు".

-ముష్ఫికర్​ రహీమ్​, బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​

అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్​లో షేర్​ చేశాడు ముష్ఫికర్​. నిజమైన హీరోలు ఇలాంటి సమయంలోనే బయటకు వస్తారని.. ఈ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుదామని వీడియోలో అఫ్రిదీ తెలిపాడు.

క్రికెటర్లందరూ తమకు సంబంధించిన వాటిని వేలంవేసి వాటి ద్వారా వచ్చిన నిధులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలే టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ కలిసి గుజరాత్​ లయన్స్​పై ఆడిన క్రికెట్​ కిట్​ను వేలం వేశారు. ఇంగ్లాండ్​ వికెట్​ కీపర్​ జాస్​ బట్లర్​.. తన ప్రపంచకప్​ జెర్సీని వేలానికి వేశాడు.

ఇదీ చూడండి.. కచ్చితంగా ఆ రెండు రికార్డులు నావే: జకోవిచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.