ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్: టీమ్ఇండియా ఈ మార్పులు చేయగలదా?

author img

By

Published : Feb 10, 2021, 5:08 PM IST

Updated : Feb 10, 2021, 8:25 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది టీమ్ఇండియా. అయితే ఈ ఓటమికి జట్టు సెలక్షన్ కూడా ఓ కారణమని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. నదీమ్​తో పాటు మరికొందర్ని పక్కనపెట్టి రెండో మ్యాచ్​లో పలు మార్పులు చేయాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం టీమ్ఇండియా ఏ స్థానాల్లో మార్పు చేయగలదో చూద్దాం.

3 changeas India may make to win the second Test against England
టీమ్ఇండియా ఈ మార్పులు చేయలగదా?

ఆటలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రశంసలు, ఓడితే విమర్శలూ మామూలే. నీదైన రోజున ఎంతటి జట్టుపైన అయినా అద్భుతాలు చేయవచ్చు. విజయంతో రికార్డులూ సృష్టించొచ్చు. కానీ తర్వాత ఓడితే ప్రశంసించిన నోళ్లే మళ్లీ తిట్టడం మొదలెడతాయి. ప్రస్తుతం టీమ్ఇండియా ఎదుర్కొంటున్న విమర్శలు ఇందుకు నిదర్శనం. గత నెలలో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే మట్టికరిపించి టెస్టు సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది భారత జట్టు. కానీ మంగళవారం ఇంగ్లాండ్​తో స్వదేశంలో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్​లో ఘోర పరాజయం పాలై విమర్శలు మూటగట్టుకుంది. కొందరు జట్టు సెలక్షన్ పైనా మండిపడితే, మరికొందరు పిచ్ బాగాలేదని, ఆటగాళ్లలో కసి కనిపించలేదని అన్నారు. ఏదేమైనా ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాల్సిందే. ఇవన్నీ మరిచి రెండో టెస్టుపై దృష్టిపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కోహ్లీసేన జట్టులో ఎలాంటి మార్పులు చేస్తే ఫలితం సానుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.

నదీమ్ స్థానంలో కుల్దీప్

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు లెగ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్​కు సుదీర్ఘ ఫార్మాట్​లో రెండో మ్యాచ్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్లే ఇతడు సరైన ప్రదర్శన చేయలేదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ దేశం కోసం ఆడే సమయంలో అవన్నీ పక్కనపెట్టి మెరుగైన ప్రదర్శన పైనే దృష్టిపెట్టాలి. జట్టు గెలుపు కోసం పోరాడాలి. ఈ మ్యాచ్​లో నదీమ్ ప్రదర్శన చూసుకుంటే 59 ఓవర్లు వేసి 233 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. కానీ ఇదే మ్యాచ్​లో ఇంగ్లాండ్ లెగ్​ స్పిన్నర్ జాక్ లీచ్​ కాస్త మెరుగ్గా ఆడాడు. ఇతడు 50 ఓవర్లు వేసి 181 పరుగులు సమర్పించుకుని ఆరు వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ, పుజారాల వికెట్లు తీసి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్​లో ఇతడి స్థానంలో కుల్దీప్​ను తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

3 changeas India may make to win the second Test against England
కుల్దీప్, నదీమ్

మొదటి మ్యాచ్​ కోసం జట్టును ప్రకటించిన సమయంలోనే కుల్దీప్ లేకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ మ్యాచ్​లో లెగ్ స్పిన్నర్ నదీమ్ విఫలమవడం వల్ల అందరి దృష్టి మరోసారి కుల్దీప్​పై పడింది. రెండో మ్యాచ్​లో అతడిని తీసుకోవాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కుల్దీప్ ఆడిన చివరి టెస్టులో 5 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్​లో నదీమ్ స్థానంలో కుల్దీప్​కు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

రోహిత్ స్థానంలో మయాంక్​ అగర్వాల్

ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి టెస్టులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్​లోనే కాక ఇంతకుముందు టెస్టుల్లోనూ హిట్​మ్యాన్ ప్రదర్శన అంతంతమాత్రమే ఉంది. గత 8 ఇన్నింగ్స్​ల్లో ఆరింటిలో కేవలం 30 లోపు పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు మ్యాచ్​ల్లో సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ కంటే కాస్త మెరుగ్గా ఉన్న మయాంక్​ను ఓపెనర్​గా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో రోహిత్​ శర్మ 22 ఇన్నింగ్స్​లో 79 సగటుతో 6 సెంచరీలు సాధించాడు.

3 changeas India may make to win the second Test against England
రోహిత్, మయాంక్

స్వదేశంలో ఆడిన 6 ఇన్నింగ్స్​ల్లో మూడు సెంచరీలు సాధించాడు మయాంక్ అగర్వాల్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఇతడి సగటు 99.50గా ఉంది. దీంతో రెండో మ్యాచ్​లో మయాంక్​ను తీసుకోవాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ సారథి కోహ్లీ మాత్రం ఓపెనర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడు. రోహిత్, గిల్​కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనను ఇటీవలే వెల్లడించాడు. దీంతో రెండో మ్యాచ్​లో రోహిత్ స్థానం ఖాయంలా కనిపిస్తోంది. కానీ మయాంక్​ పేరును పరిశీలించే ఆలోచన కూడా ఉంది.

రహానే స్థానంలో కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో బ్యాట్స్​మన్​గానే కాక కెప్టెన్​గానూ జట్టును ముందుండి నడిపించి సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అజింక్యా రహానే. మెల్​బోర్న్​లో జరిగిన మ్యాచ్​లో సెంచరీ కూడా సాధించాడు. కానీ గత 15 ఇన్నింగ్స్​లో కేవలం ఒక్క శతకం మాత్రమే సాధించడం గమనార్హం. గత 14 మ్యాచ్​ల్లో (శతకాన్ని మినహాయిస్తే) ఇతడి అత్యధిక స్కోర్ 46. ఇందులో 6 సార్లు కేవలం 10 పరుగుల కంటే తక్కువ స్కోర్​కే పెవిలియన్ చేరాడు. దీంతో రహానే కంటే కాస్త మెరుగైన గణాంకాలు ఉన్న రాహుల్​ను జట్టులోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

3 changeas India may make to win the second Test against England
రహానే, రాహుల్

స్వదేశంలో రహానే సగటు 37.35 ఉండగా, రాహుల్ సగటు 44.25గా ఉంది. అలాగే ఆడిన 22 ఇన్నింగ్స్​ల్లో 9 సార్లు అర్ధశతకం సాధించాడు. కానీ రహానే 44 ఇన్నింగ్స్​ల్లో కేవలం 11 అర్ధశతకాలు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే రహానే కంటే రాహుల్​కు కాస్త ఎక్కువ స్కోప్ ఉంది. కానీ అనుభవం పరంగా, జట్టుకు వైస్ కెప్టెన్​గా ఉన్న కారణంగా రహానేపై వేటు వేయడం కాస్త కష్టమైన పనే.

ఆటలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రశంసలు, ఓడితే విమర్శలూ మామూలే. నీదైన రోజున ఎంతటి జట్టుపైన అయినా అద్భుతాలు చేయవచ్చు. విజయంతో రికార్డులూ సృష్టించొచ్చు. కానీ తర్వాత ఓడితే ప్రశంసించిన నోళ్లే మళ్లీ తిట్టడం మొదలెడతాయి. ప్రస్తుతం టీమ్ఇండియా ఎదుర్కొంటున్న విమర్శలు ఇందుకు నిదర్శనం. గత నెలలో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే మట్టికరిపించి టెస్టు సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది భారత జట్టు. కానీ మంగళవారం ఇంగ్లాండ్​తో స్వదేశంలో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్​లో ఘోర పరాజయం పాలై విమర్శలు మూటగట్టుకుంది. కొందరు జట్టు సెలక్షన్ పైనా మండిపడితే, మరికొందరు పిచ్ బాగాలేదని, ఆటగాళ్లలో కసి కనిపించలేదని అన్నారు. ఏదేమైనా ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాల్సిందే. ఇవన్నీ మరిచి రెండో టెస్టుపై దృష్టిపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కోహ్లీసేన జట్టులో ఎలాంటి మార్పులు చేస్తే ఫలితం సానుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.

నదీమ్ స్థానంలో కుల్దీప్

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు లెగ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్​కు సుదీర్ఘ ఫార్మాట్​లో రెండో మ్యాచ్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్లే ఇతడు సరైన ప్రదర్శన చేయలేదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ దేశం కోసం ఆడే సమయంలో అవన్నీ పక్కనపెట్టి మెరుగైన ప్రదర్శన పైనే దృష్టిపెట్టాలి. జట్టు గెలుపు కోసం పోరాడాలి. ఈ మ్యాచ్​లో నదీమ్ ప్రదర్శన చూసుకుంటే 59 ఓవర్లు వేసి 233 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. కానీ ఇదే మ్యాచ్​లో ఇంగ్లాండ్ లెగ్​ స్పిన్నర్ జాక్ లీచ్​ కాస్త మెరుగ్గా ఆడాడు. ఇతడు 50 ఓవర్లు వేసి 181 పరుగులు సమర్పించుకుని ఆరు వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ, పుజారాల వికెట్లు తీసి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్​లో ఇతడి స్థానంలో కుల్దీప్​ను తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

3 changeas India may make to win the second Test against England
కుల్దీప్, నదీమ్

మొదటి మ్యాచ్​ కోసం జట్టును ప్రకటించిన సమయంలోనే కుల్దీప్ లేకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ మ్యాచ్​లో లెగ్ స్పిన్నర్ నదీమ్ విఫలమవడం వల్ల అందరి దృష్టి మరోసారి కుల్దీప్​పై పడింది. రెండో మ్యాచ్​లో అతడిని తీసుకోవాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కుల్దీప్ ఆడిన చివరి టెస్టులో 5 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్​లో నదీమ్ స్థానంలో కుల్దీప్​కు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

రోహిత్ స్థానంలో మయాంక్​ అగర్వాల్

ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి టెస్టులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్​లోనే కాక ఇంతకుముందు టెస్టుల్లోనూ హిట్​మ్యాన్ ప్రదర్శన అంతంతమాత్రమే ఉంది. గత 8 ఇన్నింగ్స్​ల్లో ఆరింటిలో కేవలం 30 లోపు పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు మ్యాచ్​ల్లో సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ కంటే కాస్త మెరుగ్గా ఉన్న మయాంక్​ను ఓపెనర్​గా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో రోహిత్​ శర్మ 22 ఇన్నింగ్స్​లో 79 సగటుతో 6 సెంచరీలు సాధించాడు.

3 changeas India may make to win the second Test against England
రోహిత్, మయాంక్

స్వదేశంలో ఆడిన 6 ఇన్నింగ్స్​ల్లో మూడు సెంచరీలు సాధించాడు మయాంక్ అగర్వాల్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఇతడి సగటు 99.50గా ఉంది. దీంతో రెండో మ్యాచ్​లో మయాంక్​ను తీసుకోవాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ సారథి కోహ్లీ మాత్రం ఓపెనర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడు. రోహిత్, గిల్​కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనను ఇటీవలే వెల్లడించాడు. దీంతో రెండో మ్యాచ్​లో రోహిత్ స్థానం ఖాయంలా కనిపిస్తోంది. కానీ మయాంక్​ పేరును పరిశీలించే ఆలోచన కూడా ఉంది.

రహానే స్థానంలో కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో బ్యాట్స్​మన్​గానే కాక కెప్టెన్​గానూ జట్టును ముందుండి నడిపించి సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అజింక్యా రహానే. మెల్​బోర్న్​లో జరిగిన మ్యాచ్​లో సెంచరీ కూడా సాధించాడు. కానీ గత 15 ఇన్నింగ్స్​లో కేవలం ఒక్క శతకం మాత్రమే సాధించడం గమనార్హం. గత 14 మ్యాచ్​ల్లో (శతకాన్ని మినహాయిస్తే) ఇతడి అత్యధిక స్కోర్ 46. ఇందులో 6 సార్లు కేవలం 10 పరుగుల కంటే తక్కువ స్కోర్​కే పెవిలియన్ చేరాడు. దీంతో రహానే కంటే కాస్త మెరుగైన గణాంకాలు ఉన్న రాహుల్​ను జట్టులోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

3 changeas India may make to win the second Test against England
రహానే, రాహుల్

స్వదేశంలో రహానే సగటు 37.35 ఉండగా, రాహుల్ సగటు 44.25గా ఉంది. అలాగే ఆడిన 22 ఇన్నింగ్స్​ల్లో 9 సార్లు అర్ధశతకం సాధించాడు. కానీ రహానే 44 ఇన్నింగ్స్​ల్లో కేవలం 11 అర్ధశతకాలు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే రహానే కంటే రాహుల్​కు కాస్త ఎక్కువ స్కోప్ ఉంది. కానీ అనుభవం పరంగా, జట్టుకు వైస్ కెప్టెన్​గా ఉన్న కారణంగా రహానేపై వేటు వేయడం కాస్త కష్టమైన పనే.

Last Updated : Feb 10, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.