ETV Bharat / sports

గ్రౌండ్​లోనే గొడవ.. బ్యాట్లతో కొట్టుకున్న క్రికెటర్లు​! - ఛారిటీ మ్యాచ్​ ఆటగాళ్లు కొట్లాట

క్రికెట్​ మైదానం రణరంగంగా మారింది. ఇరు జట్టు ఆటగాళ్ల మధ్య మాటమాట పెరిగి బ్యాట్​లతో తీవ్రంగా కొట్టుకునే పరిస్థితికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అయింది. ఇంతకీ ఈ ఘర్షణ ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే?

charity match
ఛారిటీ మ్యాచ్​
author img

By

Published : Jul 21, 2021, 11:33 AM IST

ఇంగ్లాండ్​లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్​ మ్యాచ్​లో(Charity match fight) ఆటగాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ప్లేయర్స్ ఒకరినొకరు బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి తలలకు బలంగా దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

  • A charity cricket match was abandoned after a fight that saw players striking each other with bats broke out between two teams. pic.twitter.com/NcPGRmYA8s

    — msc media (@mscmedia2) July 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్​లో వైద్యం అవసరమైన పేదల కోసం విరాళాలు సేకరించేందుకు మైడ్​స్టోన్​లోని మోటే పార్క్​ క్రికెట్​ క్లబ్​లో ఓ ఛారిటీ మ్యాచ్​ను నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్​ చివరికి రక్తసిక్తంగా మారింది. గొడవ జరగడానికి కారణం తెలియరాలేదు. కానీ ఈ వీడియో వైరల్​ అయింది. ఇందులో ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. చుట్టుపక్కలవాళ్లు వారిని ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇద్దరు ఆటగాళ్ల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మ్యాచ్​ మధ్యలోనే ఆగిపోయింది.

ఈ వివాదంపై మ్యాచ్​ నిర్వహకుడు షెహజాద్​ స్పందిస్తూ.. "ఇది ఫైనల్​ మ్యాచ్​. మరో రెండు ఓవర్లో మ్యాచ్​ ముగిసిపోతుందనగా.. కొంతమంది పిచ్​పైకి వచ్చి ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ గొడవకు కారణం తెలియరాలేదు. బ్యాట్లతో కొట్టుకున్నారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. అక్కడికి వచ్చేసరికి వారు కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారు." అని అన్నారు.

ఇదీ చూడండి: Ind Eng Series 2021: కోహ్లీ, రహానె తొలి టెస్టు ఆడేనా?

ఇంగ్లాండ్​లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్​ మ్యాచ్​లో(Charity match fight) ఆటగాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ప్లేయర్స్ ఒకరినొకరు బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి తలలకు బలంగా దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

  • A charity cricket match was abandoned after a fight that saw players striking each other with bats broke out between two teams. pic.twitter.com/NcPGRmYA8s

    — msc media (@mscmedia2) July 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్​లో వైద్యం అవసరమైన పేదల కోసం విరాళాలు సేకరించేందుకు మైడ్​స్టోన్​లోని మోటే పార్క్​ క్రికెట్​ క్లబ్​లో ఓ ఛారిటీ మ్యాచ్​ను నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్​ చివరికి రక్తసిక్తంగా మారింది. గొడవ జరగడానికి కారణం తెలియరాలేదు. కానీ ఈ వీడియో వైరల్​ అయింది. ఇందులో ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. చుట్టుపక్కలవాళ్లు వారిని ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇద్దరు ఆటగాళ్ల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మ్యాచ్​ మధ్యలోనే ఆగిపోయింది.

ఈ వివాదంపై మ్యాచ్​ నిర్వహకుడు షెహజాద్​ స్పందిస్తూ.. "ఇది ఫైనల్​ మ్యాచ్​. మరో రెండు ఓవర్లో మ్యాచ్​ ముగిసిపోతుందనగా.. కొంతమంది పిచ్​పైకి వచ్చి ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ గొడవకు కారణం తెలియరాలేదు. బ్యాట్లతో కొట్టుకున్నారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. అక్కడికి వచ్చేసరికి వారు కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారు." అని అన్నారు.

ఇదీ చూడండి: Ind Eng Series 2021: కోహ్లీ, రహానె తొలి టెస్టు ఆడేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.