ETV Bharat / sports

బ్రెట్​ లీ దాతృత్వం- భారత్​కు బిట్​కాయిన్ సాయం

author img

By

Published : Apr 27, 2021, 7:06 PM IST

కరోనాతో పోరాడుతున్న భారత దేశానికి అండగా నిలిచేందుకు మరో క్రికెటర్​ ముందుకొచ్చాడు. ఆసీస్​ మాజీ స్టార్​ క్రికెటర్​ బ్రెట్​ లీ దాదాపు రూ.41 లక్షలను సాయంగా ప్రకటించాడు.

Brett Lee donates to Crypto, Relief for purchase of oxygen supplies for Indian hospitals
బ్రెట్​ లీ, ఆసీస్ మాజీ క్రికెటర్

కొవిడ్​తో పోరాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్​ పేసర్​ పాట్​ కమిన్స్​ రూ.37 లక్షల సాయం అందించగా.. తాజాగా మరో మాజీ ఆసీస్​​ క్రికెటర్​ బ్రెట్ ​లీ దాతృత్వం చాటుకున్నాడు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం.. ఒక బిట్​కాయిన్​ క్రిప్టో కరెన్సీ (భారత కరెన్సీలో దాదాపు 41 లక్షల రూపాయలు) ఆర్థిక సాయంగా ప్రకటించాడు.

"భారత్​ ఎల్లప్పుడూ నాకు రెండో స్వదేశం లాంటిది. నా క్రికెట్ జీవితం​లో, రిటైర్మెంట్​ తర్వాత.. అక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేనిది. భారత్​ అంటే నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి దేశం ఇప్పుడు కొవిడ్ ధాటికి వణికిపోతోందనే విషయం నన్ను కలిచివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​కు అండగా ఉండాలనిపించింది. అందుకే ఒక బిట్​కాయిన్ క్రిప్టో కరెన్సీ(భారత కరెన్సీలో దాదాపు రూ.41 లక్షలు) సాయం కింద ఇస్తున్నాను. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరుతున్నా."

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​.

ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్​​ ముగిసినట్లు భావిస్తాం'

"ఈ కఠిన పరిస్థితుల్లో ముందుండి సేవ చేస్తున్న ఫ్రంట్​లైన్ ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. జాగ్రత్తగా ఉంటూ కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రతి ఒక్కరికీ నా విన్నపం. మాస్క్​ను తప్పనిసరిగా ధరించండి. సామాజిక దూరం పాటించండి. భారత్​ కోసం ముందుకు వచ్చిన కమిన్స్​కు అభినందనలు" అని బ్రెట్​ లీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: హాకీ అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్ మృతి

కొవిడ్​తో పోరాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్​ పేసర్​ పాట్​ కమిన్స్​ రూ.37 లక్షల సాయం అందించగా.. తాజాగా మరో మాజీ ఆసీస్​​ క్రికెటర్​ బ్రెట్ ​లీ దాతృత్వం చాటుకున్నాడు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం.. ఒక బిట్​కాయిన్​ క్రిప్టో కరెన్సీ (భారత కరెన్సీలో దాదాపు 41 లక్షల రూపాయలు) ఆర్థిక సాయంగా ప్రకటించాడు.

"భారత్​ ఎల్లప్పుడూ నాకు రెండో స్వదేశం లాంటిది. నా క్రికెట్ జీవితం​లో, రిటైర్మెంట్​ తర్వాత.. అక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేనిది. భారత్​ అంటే నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి దేశం ఇప్పుడు కొవిడ్ ధాటికి వణికిపోతోందనే విషయం నన్ను కలిచివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​కు అండగా ఉండాలనిపించింది. అందుకే ఒక బిట్​కాయిన్ క్రిప్టో కరెన్సీ(భారత కరెన్సీలో దాదాపు రూ.41 లక్షలు) సాయం కింద ఇస్తున్నాను. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరుతున్నా."

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​.

ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్​​ ముగిసినట్లు భావిస్తాం'

"ఈ కఠిన పరిస్థితుల్లో ముందుండి సేవ చేస్తున్న ఫ్రంట్​లైన్ ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. జాగ్రత్తగా ఉంటూ కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రతి ఒక్కరికీ నా విన్నపం. మాస్క్​ను తప్పనిసరిగా ధరించండి. సామాజిక దూరం పాటించండి. భారత్​ కోసం ముందుకు వచ్చిన కమిన్స్​కు అభినందనలు" అని బ్రెట్​ లీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: హాకీ అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.