ETV Bharat / sports

Tokyo Olympics: అథ్లెట్లకు బీసీసీఐ విరాళం.. ఎంతంటే? - భారత అథ్లెట్లకు బీసీసీఐ పది కోట్ల సాయం

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొననున్న భారత అథ్లెట్లకు రూ.10 కోట్ల సాయాన్ని ప్రకటించింది బీసీసీఐ. ఈ మొత్తాన్ని ఆటగాళ్ల శిక్షణతో పాటు సన్నద్ధత కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆదివారం జరిగిన బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

tokyo olympics, bcci
టోక్యో ఒలింపిక్స్, బీసీసీఐ
author img

By

Published : Jun 20, 2021, 10:18 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొననున్న భారత అథ్లెట్లకు విరాళం ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆటగాళ్ల శిక్షణతో పాటు సన్నద్ధత కోసం రూ.10 కోట్లను డొనేషన్​గా ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఆదివారం జరిగిన బీసీసీఐ అపెక్స్​ మండలి అత్యవసర సమావేశంలో.. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఈ నిర్ణయం తీసుకున్నారు.

"ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్లకు సాయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రూ.10 కోట్లను మంజూరు చేసింది. అపెక్స్​ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్ల సన్నద్ధతతో పాటు శిక్షణ కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. క్రీడా మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​తో మాట్లాడిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఒలింపిక్స్​ కోసం బీసీసీఐ విరాళాలు ఇవ్వడం ఇదేం కొత్త కాదు. భారత క్రికెట్ బోర్డు.. ఒలింపిక్స్​ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్​ జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగనున్నాయి.

ఇదీ చదవండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా యోగా సెంటర్లు

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొననున్న భారత అథ్లెట్లకు విరాళం ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆటగాళ్ల శిక్షణతో పాటు సన్నద్ధత కోసం రూ.10 కోట్లను డొనేషన్​గా ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఆదివారం జరిగిన బీసీసీఐ అపెక్స్​ మండలి అత్యవసర సమావేశంలో.. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఈ నిర్ణయం తీసుకున్నారు.

"ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్లకు సాయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రూ.10 కోట్లను మంజూరు చేసింది. అపెక్స్​ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్ల సన్నద్ధతతో పాటు శిక్షణ కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. క్రీడా మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​తో మాట్లాడిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఒలింపిక్స్​ కోసం బీసీసీఐ విరాళాలు ఇవ్వడం ఇదేం కొత్త కాదు. భారత క్రికెట్ బోర్డు.. ఒలింపిక్స్​ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్​ జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగనున్నాయి.

ఇదీ చదవండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా యోగా సెంటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.