ETV Bharat / sports

కయ్యాలమారి అలీసా హీలి.. టీమ్​ఇండియాపై ఎప్పుడూ ఇలానే!

author img

By

Published : Feb 27, 2023, 7:35 PM IST

రీసెంట్​గా హర్మన్​ ప్రీత్​ రనౌట్​పై ఆసీస్​ వికెట్​ కీపర్​ అలీసా హీలి కాంట్రవర్సీ కామెంట్స్​ చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ఆమెకు తొలిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు టీమ్​ఇండియాపై అక్కసును వెళ్లగక్కింది. ఆ వివరాలు..

Australia cricketer
కయ్యాలమారి అలీసా హీలి.. టీమ్​ఇండియాపై ఎప్పుడూ ఇలానే!

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. మైదానంలోనే కాదు.. గ్రౌండ్​ బయట కూడా తలపడాల్సిందేనన్న విషయం దాదాపుగా క్రికెట్​ ప్రేమికులకు తెలిసిన విషయమే. బ్యాట్‌-బంతికే కాదు.. నోటికి కూడా పని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ప్లేయర్స్​ను అవహేళన చేస్తూ.. వారి కాన్ఫిడెన్స్​ను దెబ్బతీయడం ఆసీస్ ఆటగాళ్లకు మొదటి నుంచి ఉన్న అలవాటే. మైదానంలోకి అడుగు పెట్టాకా తమకు ఓడిపోయే పరిస్థితి వస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్లతో కవ్వింపులు చర్యలకు పాల్పడడటం.. వివాదాలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ విషయంలో మెన్స్​ టీమే కాదు.. ఉమెన్స్​ టీమ్​ కూడా ముందుంటారు. ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంలో వారు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రీసెంట్​గా భారత్​ కెప్టెన్​ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ గురించి తాజాగా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలీసా హీలి చేసిన కామెంట్లు కూడా ఎంతలా చర్చనీయాశంమైనయో.. సోషల్​మీడియాను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది.

టీ20 వరల్డ్ కప్​ గెలిచాక హర్మన్‌ రనౌట్‌ గురించి హీలి మాట్లాడుతూ.. సెమీ ఫైనల్​లో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌కు ప్రయత్న లోపమే కారణం. కాస్త ట్రై చేసి ఉంటే రన్​ చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రత్యర్థి కన్నా మెరుగ్గా ఉంటే పెద్ద టోర్నీలు గెలవొచ్చు. ఆ పనిని మేం బాగా చేస్తున్నాం" అని చెప్పింది. 'రనౌట్‌' విషయాన్ని బ్యాడ్​ లక్​ అంటూ హర్మన్‌ తనకు నచ్చినట్లుగా చెప్పుకోవచ్చు అంటూ అలీసా సెటైరికల్​గా మాట్లాడింది. భారత జట్టుపై తనలో ఉన్న అక్కసును వెళ్లగక్కింది. గతంలోనూ ఆమె ఇలా ఎన్నో సార్లు నోరు జారి విమర్శలపాలైంది.

కరోనా సమయంలోనూ భారత జట్టు విదేశాల్లో పర్యటించినప్పుడు.. 2021లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అప్పుడు భారత ప్లేయర్స్​కు సరైన వసతులు కల్పించడంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫెయిల్ అయింది. దీనిపై మన ఆటగాళ్లు, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిస్బేన్‌లో తమకు కేటాయించిన రూమ్స్​లో సరైన సదుపాయాలు లేవని, టాయిలెట్లు కూడా తామే క్లీన్​ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కంప్లైంట్​ చేశారు.

అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా గురించి మనోళ్లు ఇలా మాట్లాడడంతో జీర్ణించుకోలేకపోయిన హీలి.. అప్పట్లో కూడా నోరు జారింది. 'ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మహిళా జట్లు కూడా ఇదే హోటల్‌లో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాయి. మాకు లేని ఇబ్బంది మీకేంటి' అనే మీనింగ్ వచ్చేలా ఓ ట్వీట్ చేసింది. అయితే దీనికి మన అభిమానులు గట్టిగానే బదులిచ్చారు. భారత ఆటగాళ్లు గడిచిన నాలుగైదు నెలలుగా క్వారంటైన్‌లో ఉన్నారని, వారికి సరైన ఫెసిలిటీస్​ కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఉందని కాస్త గట్టిగానే చెప్పారు. ఒకవేళ బీసీసీఐ కూడా ఆస్ట్రేలియా ప్లేయర్స్ విషయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మీరు ఏం చేసి ఉండే వారంటూ చురకలంటించారు.

ఇక 2022 కామన్వెల్త్‌ గేమ్స్​లో హర్మన్‌ప్రీత్‌ జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే మ్యాచ్‌లో రూల్స్​కు విరుద్ధంగా కరోనా పాజిటివ్‌ అని తేలినా తహిలా మెక్‌గ్రాత్‌ను ఆసీస్‌ ఆడించింది. దీనిపై భారత ఫ్యాన్స్​ ఆసీస్‌ను ఉద్దేశించి 'చీటర్స్‌' అంటూ ట్రోల్​ చేశారు. విమర్శలను సహించలేకపోయిన హీలి.. అప్పుడు కూడా భారతపై కోపాన్ని ప్రదర్శించింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. 'అసూయతోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నార'నే అర్థం వచ్చేలా పోస్ట్‌ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికే 'అర్థాల కోసం వెతక్కండి.. ఊరికే పెట్టా'నంటూ మరో ట్వీట్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఇలా ఎన్నో సందర్భాల్లో హీలి.. భారతజట్టుపై నోరు పారేసుకోవడం.. తిరిగి మన అభిమానులు ఆమెకు గట్టి సమాధానం ఇవ్వడం జరుగుతూనే వస్తోంది.

ఇదీ చూడండి: తొలి బంతికి రెండు ముక్కలైన బ్యాట్​.. రెండో బాల్​కు ఆఫ్ స్టంప్ గాల్లో పల్టీలు..

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. మైదానంలోనే కాదు.. గ్రౌండ్​ బయట కూడా తలపడాల్సిందేనన్న విషయం దాదాపుగా క్రికెట్​ ప్రేమికులకు తెలిసిన విషయమే. బ్యాట్‌-బంతికే కాదు.. నోటికి కూడా పని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ప్లేయర్స్​ను అవహేళన చేస్తూ.. వారి కాన్ఫిడెన్స్​ను దెబ్బతీయడం ఆసీస్ ఆటగాళ్లకు మొదటి నుంచి ఉన్న అలవాటే. మైదానంలోకి అడుగు పెట్టాకా తమకు ఓడిపోయే పరిస్థితి వస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్లతో కవ్వింపులు చర్యలకు పాల్పడడటం.. వివాదాలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ విషయంలో మెన్స్​ టీమే కాదు.. ఉమెన్స్​ టీమ్​ కూడా ముందుంటారు. ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంలో వారు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రీసెంట్​గా భారత్​ కెప్టెన్​ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ గురించి తాజాగా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలీసా హీలి చేసిన కామెంట్లు కూడా ఎంతలా చర్చనీయాశంమైనయో.. సోషల్​మీడియాను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది.

టీ20 వరల్డ్ కప్​ గెలిచాక హర్మన్‌ రనౌట్‌ గురించి హీలి మాట్లాడుతూ.. సెమీ ఫైనల్​లో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌కు ప్రయత్న లోపమే కారణం. కాస్త ట్రై చేసి ఉంటే రన్​ చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రత్యర్థి కన్నా మెరుగ్గా ఉంటే పెద్ద టోర్నీలు గెలవొచ్చు. ఆ పనిని మేం బాగా చేస్తున్నాం" అని చెప్పింది. 'రనౌట్‌' విషయాన్ని బ్యాడ్​ లక్​ అంటూ హర్మన్‌ తనకు నచ్చినట్లుగా చెప్పుకోవచ్చు అంటూ అలీసా సెటైరికల్​గా మాట్లాడింది. భారత జట్టుపై తనలో ఉన్న అక్కసును వెళ్లగక్కింది. గతంలోనూ ఆమె ఇలా ఎన్నో సార్లు నోరు జారి విమర్శలపాలైంది.

కరోనా సమయంలోనూ భారత జట్టు విదేశాల్లో పర్యటించినప్పుడు.. 2021లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అప్పుడు భారత ప్లేయర్స్​కు సరైన వసతులు కల్పించడంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫెయిల్ అయింది. దీనిపై మన ఆటగాళ్లు, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిస్బేన్‌లో తమకు కేటాయించిన రూమ్స్​లో సరైన సదుపాయాలు లేవని, టాయిలెట్లు కూడా తామే క్లీన్​ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కంప్లైంట్​ చేశారు.

అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా గురించి మనోళ్లు ఇలా మాట్లాడడంతో జీర్ణించుకోలేకపోయిన హీలి.. అప్పట్లో కూడా నోరు జారింది. 'ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మహిళా జట్లు కూడా ఇదే హోటల్‌లో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాయి. మాకు లేని ఇబ్బంది మీకేంటి' అనే మీనింగ్ వచ్చేలా ఓ ట్వీట్ చేసింది. అయితే దీనికి మన అభిమానులు గట్టిగానే బదులిచ్చారు. భారత ఆటగాళ్లు గడిచిన నాలుగైదు నెలలుగా క్వారంటైన్‌లో ఉన్నారని, వారికి సరైన ఫెసిలిటీస్​ కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఉందని కాస్త గట్టిగానే చెప్పారు. ఒకవేళ బీసీసీఐ కూడా ఆస్ట్రేలియా ప్లేయర్స్ విషయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మీరు ఏం చేసి ఉండే వారంటూ చురకలంటించారు.

ఇక 2022 కామన్వెల్త్‌ గేమ్స్​లో హర్మన్‌ప్రీత్‌ జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే మ్యాచ్‌లో రూల్స్​కు విరుద్ధంగా కరోనా పాజిటివ్‌ అని తేలినా తహిలా మెక్‌గ్రాత్‌ను ఆసీస్‌ ఆడించింది. దీనిపై భారత ఫ్యాన్స్​ ఆసీస్‌ను ఉద్దేశించి 'చీటర్స్‌' అంటూ ట్రోల్​ చేశారు. విమర్శలను సహించలేకపోయిన హీలి.. అప్పుడు కూడా భారతపై కోపాన్ని ప్రదర్శించింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. 'అసూయతోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నార'నే అర్థం వచ్చేలా పోస్ట్‌ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికే 'అర్థాల కోసం వెతక్కండి.. ఊరికే పెట్టా'నంటూ మరో ట్వీట్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఇలా ఎన్నో సందర్భాల్లో హీలి.. భారతజట్టుపై నోరు పారేసుకోవడం.. తిరిగి మన అభిమానులు ఆమెకు గట్టి సమాధానం ఇవ్వడం జరుగుతూనే వస్తోంది.

ఇదీ చూడండి: తొలి బంతికి రెండు ముక్కలైన బ్యాట్​.. రెండో బాల్​కు ఆఫ్ స్టంప్ గాల్లో పల్టీలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.