ETV Bharat / sports

జపాన్ ఓపెన్​లో సింధు, సైనా రాణించేనా..?

author img

By

Published : Jul 23, 2019, 5:49 AM IST

టోక్యోలో నేటి నుంచి జరగనున్న జపాన్​ ఓపెన్​లో భారత షట్లర్లు తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. సైనా ఈ టోర్నీకి అందుబాటులోకి రానుంది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​లో వెనుదిరిగిన సింధు ఈ టైటిల్​పై గురిపెట్టింది.

సింధు - సైనా

ఇండోనేసియా ఓపెన్​లో నిరాశపరిచిన పీవీ సింధు తదుపరి టోర్నీకి సిద్ధమవుతోంది. నేటి నుంచి ఆరంభం కాబోతున్న జపాన్ ఓపెన్​పై దృష్టి సారించింది. ఇండోనేసియా ఓపెన్​కు దూరంగా ఉన్న సైనా ఈ టోర్నీకి అందుబాటులోకి రానుంది.

సింధు టైటిల్ నెగ్గేనా..

ఈ సీజన్​లో ఒక్క టైటిల్​ కూడా గెలవని సింధు ఈ టోర్నీలో గెలిచి ట్రోఫీ ఆకలి తీర్చుకోవాలని చూస్తోంది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​ చేరిన సింధు తప్పక గెలుస్తుందని అందరూ ఆశించారు. కానీ జపాన్​కు చెందిన యమగూచి.. సింధు టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లింది. 15-21, 16-21 తేడాతో సింధును ఓడించింది.

నేడు ఆరంభంకానున్న ఈ టోర్నీలో తొలి రౌండ్​లో చైనాకు చెందిన హ్యా యూతో తలపడనుంది సింధు. ఈ ప్రారంభ అడ్డంకిని దాటితే రెండో రౌండ్​లో కిర్​స్టీ గిల్మౌర్(స్కాట్లాండ్) లేదా ఒహోరి(జపాన్​) ఇద్దరిలో ఒకరితో పోటీపడనుంది. ఇందులోనూ నెగ్గితే క్వార్టర్స్​లో యమగూచితో తలపడే అవకాశముంది. అందులో ఓడించి ఇండోనేసియా ఓపెన్​ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది సింధు.

సైనా ఎంటర్​ అవుతోంది..

ఫిట్​నెస్​ లేమితో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్​ ఓపెన్​లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్​లో టైటిల్​ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి సైనానే. గాయాలు వెంటాడుతున్నా.. ముఖ్యటోర్నీల్లో ఆకట్టుకుంటూనే ఉంది. జపాన్​లో సత్తాచాటాలని అనుకుంటోంది.
థాయ్​లాండ్ క్రీడాకారిణి బుస్నాన్​ను తొలి రౌండ్​లో ఎదుర్కొనుంది సైనా. వీరిద్దరు నాలుగు సార్లు ముఖాముఖి తలపడితే 3 సార్లు సైనానే గెలిచింది.

పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్ - ప్రణయ్

జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్​లో ఇద్దరూ భారతీయులే పోటీపడటం గమనార్హం. కిదాంబి శ్రీకాంత్.. ప్రణయ్​ను ఢీ కొట్టనున్నాడు. అంతర్జాతీయ వేదికపై వీరిద్దరూ 5 సార్లు ముఖాముఖి తలపడగా గత నాలుగు పర్యాయాలు ప్రణయే గెలిచాడు.

స్విస్​ ఓపెన్ రన్నరప్​గా నిలిచిన సాయి ప్రణీత్ జపాన్​కు చెందిన కెంటా నిషిమోటోతో పోటీపడనున్నాడు. భుజం గాయంతో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సమీర్ వర్మ తొలిరౌండ్​లో డెన్మార్క్​కు చెందిన ఆండెర్స్ ఆన్టోన్సెన్​తో తలపడనున్నాడు.

పురుషుల డబుల్స్​లో సాత్విక్ - చిరాగ్ జోడి ఇంగ్లాండ్​కు చెందిన మార్కస్ - క్రిస్ ద్వయాన్ని ఢీ కొట్టనుంది. మహిళల డబుల్స్​లో - సిక్కిఅశ్విని పొన్నప్ప రెడ్డి జోడి మలేసియాకు చెందిన ఫే - నూర్​తో పోటీపడనుంది.

ఇది చదవండి: మహిళల టెన్నిస్​ ర్యాంకింగ్స్​ విడుదల

ఇండోనేసియా ఓపెన్​లో నిరాశపరిచిన పీవీ సింధు తదుపరి టోర్నీకి సిద్ధమవుతోంది. నేటి నుంచి ఆరంభం కాబోతున్న జపాన్ ఓపెన్​పై దృష్టి సారించింది. ఇండోనేసియా ఓపెన్​కు దూరంగా ఉన్న సైనా ఈ టోర్నీకి అందుబాటులోకి రానుంది.

సింధు టైటిల్ నెగ్గేనా..

ఈ సీజన్​లో ఒక్క టైటిల్​ కూడా గెలవని సింధు ఈ టోర్నీలో గెలిచి ట్రోఫీ ఆకలి తీర్చుకోవాలని చూస్తోంది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​ చేరిన సింధు తప్పక గెలుస్తుందని అందరూ ఆశించారు. కానీ జపాన్​కు చెందిన యమగూచి.. సింధు టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లింది. 15-21, 16-21 తేడాతో సింధును ఓడించింది.

నేడు ఆరంభంకానున్న ఈ టోర్నీలో తొలి రౌండ్​లో చైనాకు చెందిన హ్యా యూతో తలపడనుంది సింధు. ఈ ప్రారంభ అడ్డంకిని దాటితే రెండో రౌండ్​లో కిర్​స్టీ గిల్మౌర్(స్కాట్లాండ్) లేదా ఒహోరి(జపాన్​) ఇద్దరిలో ఒకరితో పోటీపడనుంది. ఇందులోనూ నెగ్గితే క్వార్టర్స్​లో యమగూచితో తలపడే అవకాశముంది. అందులో ఓడించి ఇండోనేసియా ఓపెన్​ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది సింధు.

సైనా ఎంటర్​ అవుతోంది..

ఫిట్​నెస్​ లేమితో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్​ ఓపెన్​లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్​లో టైటిల్​ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి సైనానే. గాయాలు వెంటాడుతున్నా.. ముఖ్యటోర్నీల్లో ఆకట్టుకుంటూనే ఉంది. జపాన్​లో సత్తాచాటాలని అనుకుంటోంది.
థాయ్​లాండ్ క్రీడాకారిణి బుస్నాన్​ను తొలి రౌండ్​లో ఎదుర్కొనుంది సైనా. వీరిద్దరు నాలుగు సార్లు ముఖాముఖి తలపడితే 3 సార్లు సైనానే గెలిచింది.

పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్ - ప్రణయ్

జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్​లో ఇద్దరూ భారతీయులే పోటీపడటం గమనార్హం. కిదాంబి శ్రీకాంత్.. ప్రణయ్​ను ఢీ కొట్టనున్నాడు. అంతర్జాతీయ వేదికపై వీరిద్దరూ 5 సార్లు ముఖాముఖి తలపడగా గత నాలుగు పర్యాయాలు ప్రణయే గెలిచాడు.

స్విస్​ ఓపెన్ రన్నరప్​గా నిలిచిన సాయి ప్రణీత్ జపాన్​కు చెందిన కెంటా నిషిమోటోతో పోటీపడనున్నాడు. భుజం గాయంతో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సమీర్ వర్మ తొలిరౌండ్​లో డెన్మార్క్​కు చెందిన ఆండెర్స్ ఆన్టోన్సెన్​తో తలపడనున్నాడు.

పురుషుల డబుల్స్​లో సాత్విక్ - చిరాగ్ జోడి ఇంగ్లాండ్​కు చెందిన మార్కస్ - క్రిస్ ద్వయాన్ని ఢీ కొట్టనుంది. మహిళల డబుల్స్​లో - సిక్కిఅశ్విని పొన్నప్ప రెడ్డి జోడి మలేసియాకు చెందిన ఫే - నూర్​తో పోటీపడనుంది.

ఇది చదవండి: మహిళల టెన్నిస్​ ర్యాంకింగ్స్​ విడుదల

Mumbai, July 22 (ANI): A level 4 fire broke out in MTNL Building in Mumbai's Bandra area today. 14 fire tenders rushed to the spot to douse the flames. Approximately 100 people are reportedly trapped on the terrace of the building. No causalities have been reported so far. Fire fighting operations are underway. More details are awaited.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.