ETV Bharat / sitara

మా అధ్యక్ష ఎన్నికల్లో నరేశ్ పోటీ

మార్చి 10న జరగబోయే 'మా' అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నటుడు నరేశ్ నామినేషన్ దాఖలు చేశారు.

author img

By

Published : Mar 2, 2019, 8:06 PM IST

మా ఎన్నికల్లో నరేశ్

తెలుగు సినీపరిశ్రమలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి రెండేళ్లకోసారి సినీ నటీనటుల సంఘం(మా)లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగిసింది. మార్చి 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నటుడు నరేశ్ నామినేషన్ దాఖలు చేశారు.

జీవిత-రాజశేఖర్ దంపతులతో కలిసి 'మా' కార్యాలయానికి వచ్చారు నరేశ్. దాసరి విగ్రహానికి నివాళులర్పించి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మా అసోసియేషన్ ఎన్నికలపై స్పందించిన నరేష్​తోపాటు జీవిత-రాజశేఖర్​ దంపతులు నటీనటుల సంఘంలోని గత సభ్యుల పనితీరును తప్పుబట్టారు.

అసోసియేషన్​లో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానందునే సినీ పెద్దలు, సభ్యుల కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు నరేష్ స్పష్టం చేశారు. తెలుగు నటీనటుల సంఘంలో మొత్తం 800కి పైగా సభ్యులున్నారు. గత ఎన్నికల్లో జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటీచేయగా రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఓ విడత అధ్యక్షునిగా పనిచేసిన హాస్యనటుడు అనంతరం శివాజీ రాజాకు అధ్యక్ష పదవిని అప్పగించారు.

మా ఎన్నికల్లో నరేశ్

తెలుగు సినీపరిశ్రమలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి రెండేళ్లకోసారి సినీ నటీనటుల సంఘం(మా)లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగిసింది. మార్చి 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నటుడు నరేశ్ నామినేషన్ దాఖలు చేశారు.

జీవిత-రాజశేఖర్ దంపతులతో కలిసి 'మా' కార్యాలయానికి వచ్చారు నరేశ్. దాసరి విగ్రహానికి నివాళులర్పించి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మా అసోసియేషన్ ఎన్నికలపై స్పందించిన నరేష్​తోపాటు జీవిత-రాజశేఖర్​ దంపతులు నటీనటుల సంఘంలోని గత సభ్యుల పనితీరును తప్పుబట్టారు.

అసోసియేషన్​లో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానందునే సినీ పెద్దలు, సభ్యుల కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు నరేష్ స్పష్టం చేశారు. తెలుగు నటీనటుల సంఘంలో మొత్తం 800కి పైగా సభ్యులున్నారు. గత ఎన్నికల్లో జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటీచేయగా రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఓ విడత అధ్యక్షునిగా పనిచేసిన హాస్యనటుడు అనంతరం శివాజీ రాజాకు అధ్యక్ష పదవిని అప్పగించారు.


Hyderabad, Mar 02 (ANI): While addressing a public meeting at 61st revival day of All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM), party chief Asaduddin Owaisi said, "Pakistan Prime Minister talked of Tipu Sultan and Bahadur Shah Zafar in his assembly, Tipu Sultan wasn't enemy of Hindus but adversary of the enemies of his sultanate. He talks about atom bomb, it's weird. We have it too. Handle your Lashkar-e-Shiateen and Jaish-e-Shiateen."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.