బాలీవుడ్లో విభిన్న పాత్రలను పోషించి.. తన నటన, అభినయంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ముఖానికి రంగేసుకొని చిత్రపరిశ్రమలోకి వచ్చింది. అంతేకాదు సినీ కెరీర్లో 20 వసంతాలనూ పూర్తి చేసుకుంది.
తాజాగా ఈ అరుదైన మైలురాయికి గుర్తుగా తన ప్రణాళికలను వెల్లడించింది ప్రియాంక. ఈ 20 ఏళ్ల తన ప్రయాణంలో భాగంగా 20 మధుర స్మృతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకోనున్నట్లు తెలిపింది. వర్చువల్ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"2020 నాటికి వినోద పరిశ్రమలో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఇది నిజంగా వేడుక సమయం. ఈ ప్రయాణంలో మీరందరూ నాకు తోడుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే మైలురాయికి గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నా. ఈ 20 ఏళ్లనాటి నా మధుర స్మృతులను మీతో పంచుకుంటా.. మీరు కూడా ఈ వేడుకలో నాతో కలిసి పాల్గొనండి"
-- ప్రియాంకా చోప్రా, సినీ నటి.
2000 సంవత్సరంలో 'మిస్ వరల్డ్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించింది. హాలీవుడ్లోనూ అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా తనదైన టాలెంట్తో రాణించింది.