ETV Bharat / sitara

దివ్యాంగ రచయిత 'సైరా' చిత్రం చెక్కాడు..!

'సైరా' సినిమాలోని మెగాస్టార్​ లుక్​ను అదిరిపోయేలా గీసి ఔరా అనిపించాడు ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరికి చెందిన దివ్యాంగ​ రచయిత విశ్వనాథ్​ వెంకట్​ దాసరి.  ఆ చిత్రపటాన్ని ఆదివారం పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు బహుకరించాడు.

author img

By

Published : Sep 9, 2019, 7:00 AM IST

Updated : Sep 29, 2019, 10:58 PM IST

దివ్యాంగ రచయిత 'సైరా' చిత్రం చెక్కాడు..!

'సైరా' సినిమాలోని మెగాస్టార్​ లుక్​ను అచ్చు అలాగే చిత్రీకరించి ఆ పటాన్ని పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు అందజేశాడు యువ రచయత విశ్వనాథ్​ వెంకట్​ దాసరి. కళ్లు కనపడక పోయినా చిరు దృశ్యాన్ని అదిరిపోయేలా గీశాడు. చిత్రాన్ని చూసిన పవర్ స్టార్ అతడిని మెచ్చుకున్నాడు.

Visually challenged boy draws syeraa photo
మెగాస్టార్ చిత్రపటాన్ని పవన్​కళ్యాణ్​కు బహూకరిస్తున్న విశ్వనాథ్​

విశ్వనాథ్ చాలా ఏళ్లుగా నిస్టాగ్మస్​, ఫొటో ఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల ఏ వస్తువును సెకను కన్నా ఎక్కువ సేపు చూడలేడు. ఇంతటి కష్టంలోనూ 'హ్యారీ పోటర్' నవలా రచయిత్రి జేకే రోలింగ్​ను ఆదర్శంగా తీసుకుని రచనలవైపు దృష్టిపెట్టాడు.

మెగాస్టార్​ చేతుల మీదుగా పుస్తకం...

18 ఏళ్ల వయసు (2012)లో ఈ యువరచయిత 'ఫరో అండ్​ ద కింగ్​' పేరుతో ఓ పుస్తకం రాశాడు. దీనిని మెగాస్టార్​ చిరంజీవి ఆవిష్కరించాడు. ఇది భారత్, ఈజిప్టియన్​ చరిత్ర ఇతివృత్తంగా ఉంటుంది. 276 పేజీల ఈ పుస్తకాన్ని రాయడానికి దాదాపు ఏడేళ్లు కష్టపడ్డాడు. దిల్లీ, లండన్​, కైరో, గాజా వంటి ప్రాంతాల నేపథ్యంలో కథను మలిచాడు. ఇందులో పురాతన కాలంలోని మానవ జీవన విధానం, పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి వాటిని అద్భుతంగా రాశాడు. అంతేకాకుండా వివకదేవ అనే విలన్​ ఏ విధంగా పలు ప్రాంతాల్లో పురాతన నిధులను దొంగతనాలు చేస్తుంటాడో చెప్పాడు. చివరికి పిరమిడ్లలోని మమ్మీల నుంచి కాస్మిక్​ శక్తిని ఉపయోగించి ప్రపంచానికి చెడు తలపెట్టాలనుకున్న అతడికి ఏం జరిగిందనేదే ఇందులో సారాంశం. ఈ పుస్తకం భారత్​లోనే కాకుండా అమెరికా, బ్రిటన్​ మార్కెట్లలోనూ విడుదలైంది.

ఇవీ చదవండి...

'సైరా' సినిమాలోని మెగాస్టార్​ లుక్​ను అచ్చు అలాగే చిత్రీకరించి ఆ పటాన్ని పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు అందజేశాడు యువ రచయత విశ్వనాథ్​ వెంకట్​ దాసరి. కళ్లు కనపడక పోయినా చిరు దృశ్యాన్ని అదిరిపోయేలా గీశాడు. చిత్రాన్ని చూసిన పవర్ స్టార్ అతడిని మెచ్చుకున్నాడు.

Visually challenged boy draws syeraa photo
మెగాస్టార్ చిత్రపటాన్ని పవన్​కళ్యాణ్​కు బహూకరిస్తున్న విశ్వనాథ్​

విశ్వనాథ్ చాలా ఏళ్లుగా నిస్టాగ్మస్​, ఫొటో ఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల ఏ వస్తువును సెకను కన్నా ఎక్కువ సేపు చూడలేడు. ఇంతటి కష్టంలోనూ 'హ్యారీ పోటర్' నవలా రచయిత్రి జేకే రోలింగ్​ను ఆదర్శంగా తీసుకుని రచనలవైపు దృష్టిపెట్టాడు.

మెగాస్టార్​ చేతుల మీదుగా పుస్తకం...

18 ఏళ్ల వయసు (2012)లో ఈ యువరచయిత 'ఫరో అండ్​ ద కింగ్​' పేరుతో ఓ పుస్తకం రాశాడు. దీనిని మెగాస్టార్​ చిరంజీవి ఆవిష్కరించాడు. ఇది భారత్, ఈజిప్టియన్​ చరిత్ర ఇతివృత్తంగా ఉంటుంది. 276 పేజీల ఈ పుస్తకాన్ని రాయడానికి దాదాపు ఏడేళ్లు కష్టపడ్డాడు. దిల్లీ, లండన్​, కైరో, గాజా వంటి ప్రాంతాల నేపథ్యంలో కథను మలిచాడు. ఇందులో పురాతన కాలంలోని మానవ జీవన విధానం, పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి వాటిని అద్భుతంగా రాశాడు. అంతేకాకుండా వివకదేవ అనే విలన్​ ఏ విధంగా పలు ప్రాంతాల్లో పురాతన నిధులను దొంగతనాలు చేస్తుంటాడో చెప్పాడు. చివరికి పిరమిడ్లలోని మమ్మీల నుంచి కాస్మిక్​ శక్తిని ఉపయోగించి ప్రపంచానికి చెడు తలపెట్టాలనుకున్న అతడికి ఏం జరిగిందనేదే ఇందులో సారాంశం. ఈ పుస్తకం భారత్​లోనే కాకుండా అమెరికా, బ్రిటన్​ మార్కెట్లలోనూ విడుదలైంది.

ఇవీ చదవండి...

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.