ETV Bharat / sitara

గాయని ఆశా భోంస్లే కరెంట్ బిల్ రూ.2 లక్షలు - ఆశా భోంస్లే వార్తలు

గాయని ఆశాభోంస్లే ఇంటికి ఏకంగా రూ.2 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. దీనిపై మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేశారు భోంస్లే.

గాయని ఆశా భోంస్లేకు 2 లక్షల కరెంటు బిల్లు
గాయని ఆశా భోంస్లేకు 2 లక్షల కరెంటు బిల్లు
author img

By

Published : Aug 1, 2020, 11:02 AM IST

Updated : Aug 1, 2020, 2:38 PM IST

జూన్ నెల విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు రావడం వల్ల ప్రముఖ గాయని ఆశాభోంస్లే మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. లోనావాలా ప్రాంతంలో ఆమెకు బంగ్లా ఉంది. జూన్ నెలలో ఆ బంగ్లా విద్యుత్ బిల్లు రూ.2,8,870 వచ్చింది. అదే బంగ్లాకు మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా రూ.8,855, రూ.8,998 వచ్చాయి. దీనిపై ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆమె బంగ్లాకు వెళ్లి విద్యుత్ మీటర్ తనిఖీ చేశారు. అనంతరం బిల్లు సరిగానే ఉందని తేల్చారు. బంగ్లా మూసేయలేదని, అందులో షూటింగ్​లు జరుగుతున్నాయని అందుకే అంత బిల్లు వచ్చిందని తెలిపారు.

జూన్ నెల విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు రావడం వల్ల ప్రముఖ గాయని ఆశాభోంస్లే మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. లోనావాలా ప్రాంతంలో ఆమెకు బంగ్లా ఉంది. జూన్ నెలలో ఆ బంగ్లా విద్యుత్ బిల్లు రూ.2,8,870 వచ్చింది. అదే బంగ్లాకు మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా రూ.8,855, రూ.8,998 వచ్చాయి. దీనిపై ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆమె బంగ్లాకు వెళ్లి విద్యుత్ మీటర్ తనిఖీ చేశారు. అనంతరం బిల్లు సరిగానే ఉందని తేల్చారు. బంగ్లా మూసేయలేదని, అందులో షూటింగ్​లు జరుగుతున్నాయని అందుకే అంత బిల్లు వచ్చిందని తెలిపారు.

Last Updated : Aug 1, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.