ETV Bharat / sitara

టాలీవుడ్​లో విషాదం.. ఫిట్స్​తో మరణించిన ప్రముఖ దర్శకుడు

author img

By

Published : Nov 27, 2021, 10:23 AM IST

Updated : Nov 27, 2021, 10:36 AM IST

ఫిట్స్​ రావడం వల్ల తెలుగు సీనియర్ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. ఈ విషయమై పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Director KS Nageshwar Rao Died
డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు

తెలుగు దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వగ్రామం నుంచి హైదరాబాద్​కు శుక్రవారం వస్తుండగా.. కోదాడ సమీపంలో ఫిట్స్​ వచ్చాయి. దీంతో నాగేశ్వరరావును ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చెప్పిన మరో డైరెక్టర్ వీరశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తన స్నేహితుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Director KS Nageshwar Rao Died
దర్శకుడు నాగేశ్వరరావు మృతిపై డైరెక్టర్ వీరశంకర్ ఫేస్​బుక్ పోస్ట్

1986 నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగేశ్వరరావు.. కెరీర్​ ప్రారంభంలో కోడి రామకృష్ణ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. కృష్ణంరాజు, జయసుధ నటించిన 'రిక్షా రుద్రయ్య' సినిమాతో డైరెక్టర్​గా పరిచయమయ్యారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' సినిమా చేశారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి చిత్రాలు వచ్చాయి. నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఫైట్​ మాస్టర్​ పీటర్ హెయిన్స్​లను పరిచయం చేసింది ఈయనే.

తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్​ దశలోనే ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫిట్స్​ రావడం, సడెన్​గా మరణించడంపై పలువురు నటీనటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

తెలుగు దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వగ్రామం నుంచి హైదరాబాద్​కు శుక్రవారం వస్తుండగా.. కోదాడ సమీపంలో ఫిట్స్​ వచ్చాయి. దీంతో నాగేశ్వరరావును ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చెప్పిన మరో డైరెక్టర్ వీరశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తన స్నేహితుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Director KS Nageshwar Rao Died
దర్శకుడు నాగేశ్వరరావు మృతిపై డైరెక్టర్ వీరశంకర్ ఫేస్​బుక్ పోస్ట్

1986 నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగేశ్వరరావు.. కెరీర్​ ప్రారంభంలో కోడి రామకృష్ణ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. కృష్ణంరాజు, జయసుధ నటించిన 'రిక్షా రుద్రయ్య' సినిమాతో డైరెక్టర్​గా పరిచయమయ్యారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' సినిమా చేశారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి చిత్రాలు వచ్చాయి. నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఫైట్​ మాస్టర్​ పీటర్ హెయిన్స్​లను పరిచయం చేసింది ఈయనే.

తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్​ దశలోనే ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫిట్స్​ రావడం, సడెన్​గా మరణించడంపై పలువురు నటీనటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.