షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'సాంద్ కి ఆంఖ్'. ఇందులో హీరోయిన్గా నటించిన తాప్సీ చిత్రీకరణకు ముందు వారిద్దరితో సరదాగా గడిపానని, ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానంటోంది. తుషార్ హిరా నందాని దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశీ పాత్రను తాప్సీ, చంద్రో పాత్ర భూమి పడ్నేకర్ పోషించారు.
'"ఉత్తర ప్రదేశ్లోని జోహ్రికి వెళ్లి చంద్రో, ప్రకాశీలతో గడిపాను. వీరిద్దర్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఈ సమయం నాకెంతో ఉపయెగపడింది. అక్కడే ఉండి, వారి కుటుంబంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. -తాప్సీ, హీరోయిన్
సినిమా చిత్రీకరణకు వారి నుంచే దుస్తులు, వస్తువులు తెచ్చుకున్నట్లు తెలిపింది తాప్సీ. దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా వస్తోన్న 'మంగళ్యాన్' సినిమాలోనూ నటిస్తోంది తాప్సీ. ఈ మూవీ ఆగస్టు 15న విడుదలవనుంది.
ఇది సంగతి: 'సాహో' నటి ఫేవరేట్ హీరో ప్రభాస్ కాదట..!