ETV Bharat / sitara

సల్మాన్​, కరణ్​ జోహార్ దిష్టిబొమ్మలు దహనం

author img

By

Published : Jun 20, 2020, 4:12 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ మృతి పట్ల బిహార్​లో నిరసన తెలిపిన ఓ విద్యార్థి సంఘం... హీరో​ సల్మాన్​ ఖాన్​, నిర్మాత కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టింది.

salman
సల్మాన్​, కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టిిన విద్యార్థులు

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​కు న్యాయం జరగాలంటూ, పాట్నాకు చెందిన జన్​ అధికార్​ విద్యార్థి సంఘం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపింది. నగరంలోని కార్గిల్ చౌక్​వద్ద​ బాలీవుడ్​​ హీరో సల్మాన్​ ఖాన్, నిర్మాత కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. పలువురు సినీ ప్రముఖుల అమానుష చర్యల వల్లే సుశాంత్​కు సంబంధించిన ఏడు సినిమాలు చేజారిపోయాయని నిరసనకారులు అన్నారు.

salman
సల్మాన్​, కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టిిన విద్యార్థులు

"సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య వెనుక బాలీవుడ్​ ప్రముఖుల హస్తం ఉంది. అతడిని స్టార్​గా ఎదగనివ్వకుండా అడ్డుకున్నారు. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల వివక్ష చూపించారు. ఈ విషయంపై దర్యాపు చేపట్టి నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి"

-విశాల్​ కుమార్​, జన్​ అధికార్​ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

సుశాంత్​ ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని జన్​ అధికార్​ విద్యార్థి సంఘం నాయకుడు నితీశ్​ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే సుశాంత్​ ఆత్మ శాంతిస్తుందని వెల్లడించారు.

సుశాంత్​ మరణానికి కారణం నెపోటిజమ్ ఓ​ కారణమని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతడి ఆత్మహత్యకు హీరో సల్మాన్​​, నిర్మాత కరణ్​ జోహార్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఏక్తా కపూర్​లు కారణమని బిహార్​లోని ఓ న్యాయవాది సుధీర్​కుమార్ ఓజా ఇటీవలే ఫిర్యాదు చేశారు.

ఇది చూడండి :

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​కు న్యాయం జరగాలంటూ, పాట్నాకు చెందిన జన్​ అధికార్​ విద్యార్థి సంఘం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపింది. నగరంలోని కార్గిల్ చౌక్​వద్ద​ బాలీవుడ్​​ హీరో సల్మాన్​ ఖాన్, నిర్మాత కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. పలువురు సినీ ప్రముఖుల అమానుష చర్యల వల్లే సుశాంత్​కు సంబంధించిన ఏడు సినిమాలు చేజారిపోయాయని నిరసనకారులు అన్నారు.

salman
సల్మాన్​, కరణ్​ జోహార్​ దిష్టిబొమ్మలను తగలబెట్టిిన విద్యార్థులు

"సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య వెనుక బాలీవుడ్​ ప్రముఖుల హస్తం ఉంది. అతడిని స్టార్​గా ఎదగనివ్వకుండా అడ్డుకున్నారు. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల వివక్ష చూపించారు. ఈ విషయంపై దర్యాపు చేపట్టి నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి"

-విశాల్​ కుమార్​, జన్​ అధికార్​ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

సుశాంత్​ ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని జన్​ అధికార్​ విద్యార్థి సంఘం నాయకుడు నితీశ్​ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే సుశాంత్​ ఆత్మ శాంతిస్తుందని వెల్లడించారు.

సుశాంత్​ మరణానికి కారణం నెపోటిజమ్ ఓ​ కారణమని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతడి ఆత్మహత్యకు హీరో సల్మాన్​​, నిర్మాత కరణ్​ జోహార్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఏక్తా కపూర్​లు కారణమని బిహార్​లోని ఓ న్యాయవాది సుధీర్​కుమార్ ఓజా ఇటీవలే ఫిర్యాదు చేశారు.

ఇది చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.