స్టైలిష్స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతోంది. ఇప్పటికే కేరళలోని అడవుల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేయగా.. లాక్డౌన్ కారణంగా చిత్రీకరణను నిలిపేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇచ్చిన కారణంగా జులై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని యూనిట్ భావిస్తోందట.
![Sukumar plans to resume shoot of the Pushpa Movie with a duet song in Hyderabad?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7630513_2.jpg)
హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో ఓ పాటను హీరో, హీరోయిన్లతో చిత్రీకరించనున్నారని సమాచారం. అయితే కేరళలోని అడవుల్లో మిగిలిన సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉండగా.. అక్కడి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో షూటింగ్ చేయాలని ఇటీవలే చిత్రబృందం నిశ్చయించినట్లు సమాచారం.