ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా నడుస్తున్న చర్చ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య. అతడు చనిపోయి రెండు నెలలు పూర్తయినా.. అతని మరణం వెనక రహస్యం ఏమిటో తెలియడం లేదు. సీబీఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించింది.
అయితే, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ సముద్ర తీరంలో సుశాంత్ కేసుకు సంబంధించి వినూత్న సాండ్ ఆర్ట్ను రూపొందించారు. సుశాంత్కు సత్వర న్యాయం చేయాలని కోరుతూ.. నటుడి చిత్రంతో పాటు 'జస్టిస్ ఫర్ సుశాంత్' అంటూ రాసుకొచ్చారు.