ETV Bharat / sitara

గాయని సునీత.. ఈమె పాడితే లోకమే ఆడదా!

author img

By

Published : May 10, 2021, 7:17 AM IST

గత దశాబ్దపు సంగీత ప్రియులకు గాయని అనగానే సునీత చిత్రం కళ్లముందుకొస్తారు. అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చిన ఆమె ఊహించలేనన్ని పురస్కారాలు.. అంతకుమించిన గుర్తింపు సాధించారు. ఆమె మన అభిమాన హీరోయిన్లకు గొంతక అయ్యారు. వాళ్ల సినిమాకు పాటగా మారారు. సౌందర్య నుంచి తమన్నా వరకు.. భాషతో సంబంధం లేకుండా ఆమె రాణిస్తున్నారు. నేడు(మే 10) గాయని సునీత పుట్టినరోజు సందర్భంగా తన సినీ గాన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

సినిమా తెరపై కనిపించే హీరోలు-హీరోయిన్లు నాణేనికి ఒకవైపు అయితే.. తెర వెనకున్న మనకు కనిపించని పాత్రలే నాణేనికున్న రెండో భాగం. ఆ రెండో భాగంలో గాయకులు, డబ్బింగ్‌ ఆర్టిస్టులూ పాత్రధారులే. గాయనిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత డబ్బింగ్‌ మొదలుపెట్టి.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు నేపథ్య గాయని సునీత. నేడు (మే 10) ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి చెప్పిన విశేషాలను ఆమె మాటల్లోనే విందాం.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీ ప్రస్థానం ఎలా మొదలైంది..!

సునీత: మా అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. పరిస్థితుల ప్రభావం వల్ల తాను సాధించలేనిది తన కూతురిగా నాతో సాధించాలనుకుంది. ఆరేళ్ల వయసులోనే నాకు సంగీతం నేర్పించేందుకు గురువు సూర్యారావుగారి దగ్గరకు తీసుకెళ్లింది. 'ఇంత చిన్నపిల్లకు నేనేం సంగీతం నేర్పుతాను' అని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి నా జీవితంలో అన్నీ ఆశ్చర్యార్థకాలే. ఒక పాట పాడి వినిపించమంటే ఏదో ఒక కీర్తన పాడాను. వెంటనే ఆయన.. 'చూడటానికి బక్కగా ఉంది కానీ.. గొంతు చాలా బాగుంది. శృతి చక్కగా ఉంది. నేను మీ పాపకు సంగీతం నేర్పిస్తా'నని నన్ను శిష్యురాలిగా స్వీకరించారు.

చిన్నప్పుడు మీరు ఏడుస్తున్నా మీ తాతగారు సంగీతంలా ఫీలయ్యేవారట..?

సునీత: మా అమ్మ నన్ను ఎలాగైనా సంగీతం వైపు మళ్లించి మంచి గాయనిని చేయాలని అనుకునేది. అందుకే నా ప్రతీ కదలికలోనూ సంగీతం వెతికేవారు. ఒకసారి నేను ఏడుస్తున్నప్పుడు మా పెద్ద తాతయ్య వచ్చి 'ఇదేదో రాగంలా ఉందే' అని అన్నారు. బహుశా అప్పటి నుంచే అనుకుంటా నన్ను ఎలాగైనా పెద్ద గాయనిగా చూడాలని మా అమ్మ నిర్ణయించుకొని ఉంటారు.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీ చదువు ఎక్కడ ఎలా సాగింది?

సునీత: నా చదువు మొత్తం గుంటూరులోనే జరిగింది. ఇంటర్‌ పూర్తయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. సెలవు రోజుల్లో హైదరాబాద్‌ వచ్చి ఆ తర్వాత ఇక్కడే సెటిల్‌ అయ్యాం.

పదిహేడేళ్లకే సినిమా అవకాశం వచ్చిందట!

సునీత: సంగీతం నేర్చుకుంటూనే ఆలిండియా రేడియోలో పాడేదాన్ని. 17ఏళ్ల వయసులో దూరదర్శన్‌లో పాడే అవకాశం వచ్చింది. రకరకాల పాటలు పాడేదాన్ని.. శ్రోతలు సైతం మళ్లీ మళ్లీ సునీత గొంతు వినాలని కోరుకునేవారు. అప్పటికీ నాలో కొంచెం భయం ఉండేది. కానీ నన్ను ముందుకు తీసుకెళ్లింది మాత్రం లలిత సంగీతమే. కృష్ణమోహన్‌ గారి పాటలు పాడుతూ.. భాష మీద అభిమానం పెంచుకున్నాను. లలిత సంగీతం ప్రభావంతోనే నాకు సినిమాలో సులభంగా అవకాశం లభించింది.

మొదటి అవకాశం ఎవరిచ్చారు..?

సునీత: కృష్ణ నీరజ్‌, నాగరాజుగారు క్యాసెట్‌ పాటలకు ఎక్కువగా కంపోజింగ్‌ చేస్తుండేవారు. అందరం కలిసి రెగ్యులర్‌గా రికార్డింగ్‌లో పాల్గొనేవాళ్లం. 'గులాబీ' సినిమా సంగీత దర్శకులైన శశి ప్రీతమ్‌- నాగరాజుగారు స్నేహితులు. ఆ సినిమాలో 'ఈ వేళలో నీవు' అప్పటికే రికార్డింగ్‌ పూర్తయ్యింది. అయితే, ఫీమేల్‌ వెర్షన్‌లో అయితే ఈ పాట ఇంకా బాగుంటుందని భావించి నాకు అవకాశం ఇచ్చారు. నేను మొదటిసారి పాడిన తర్వాత గొంతు ఇంకొంచెం బాగుంటే సరిపోయేదని అన్నారు. 'కొంచెం టైం ఇవ్వండి' అని చెప్పాను. సినిమా పాట పాడదామనుకుంటే నా గొంతు బాగా లేదంటారా..? అని అనుకున్నాను. మళ్లీ పాడాను. ఆ తర్వాత ఓకే చేశారు. ఆ తర్వాత కృష్ణవంశీగారి సినిమాల్లో వరుసగా నాతో పాడించారు. ఆ తర్వాత.. కృష్ణారెడ్డిగారు.. ఆ తర్వాత.. అలా అవకాశాలు పెరిగాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ మొదటి పాట ఎన్నిసార్లు పాడినా ఏ మార్పు కనిపించదు..!

సునీత: 'ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..' పాట నేను ఇప్పుడు ఇలా (చేతలు మొహానికి అడ్డు పెట్టుకొని) వింటాను. నా గొంతు ఎంత పీలగా ఉందనుకుంటుంటాను. ఆ పాట ఇప్పుడేతే ఇంకా బాగా పాడేదాన్ని అనుకుంటాను. అయితే పాట పాడేది నేనే కాబట్టి మీకు పెద్ద తేడా కనిపించదు. కానీ నాకు తెలిసిపోతుంది.

డబ్బింగ్‌ చెప్పడం ఎలా మొదలైంది..

సునీత: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అనగనగా ఒకరోజు' సినిమాలో నేను పాట పాడాను. నా గొంతు విన్న వర్మగారు.. 'ఈమెతో హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పిస్తే బాగుంటుంది. ఈమెను చెన్నై తీసుకెళ్లాలి' అన్నారు. మొదట రికార్డింగ్‌ అంటేనే భయపడే నాకు.. డబ్బింగ్‌ అనగానే ఆ భయం మరింత పెరిగింది. అసలు నా జీవితం ఎటు వెళుతుందో అనుకున్నాను. అసలు ఒప్పుకోవాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. చివరకు చెన్నై వెళ్లాను. వారం రోజులు అక్కడే ఉన్నాను. 'గులాబీ' సినిమాలో పాడింది ఈ అమ్మాయే అని చెన్నైలోనూ ప్రచారం జరిగింది. అవకాశాలు మొదలయ్యాయి.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

ఆ సమయంలో సంగీత దర్శకులు కీరవాణిగారు, ఇళయరాజాగారిని స్వయంగా కలిశాను. చెన్నైలో ఉన్న సమయంలో అనుకోకుండా నాతో ఇళయరాజాగారు ఒక పాట పాడించారు. ఆ రోజు ఒక రికార్డింగ్‌ ఉంది. ఇళయరాజా గారు, ఎస్పీ చరణ్‌ గారు, బాలు గారు, శైలజ గారు కలిసి పాడాల్సిన పాట అది. శైలజ గారు విమానం మిస్‌ అవడం వల్ల రాలేకపోయారు. ఎస్పీ చరణ్‌గారికి అదే మొదటి పాట. శైలజగారు రాకపోవడం వల్ల 'మీరు పాడతారా' అని ఇళయరాజా గారు అడిగారు. అయితే, అది తమిళ్‌ పాట. నేను నేర్చుకొని మరీ ఆ పాట పాడాను. అలా తమిళ సినీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాను. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇళయరాజాగారు పిలవడం, అదే సమయంలో కీరవాణి దగ్గర రకరకాల సినిమాల్లో పాడుతూ ఉండేదాన్ని. కృష్ణారెడ్డిగారి సినిమాలో పాడేందుకు హైదరాబాద్‌కు.. చెన్నైకి అటూ ఇటు తిరుగుతూ ఉండేదాన్ని.

ఇటు నేపథ్య గాయనిగా, అటు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సమయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?

సునీత: ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఒక్కోసారి లెక్కకు మించి టేక్‌లు తీసుకున్నప్పుడు ఏడ్చేదాన్ని. దీంతో ఇక ఎక్కువ డబ్బింగ్‌లే చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో 'పెళ్లిపందిరి' సినిమాలో వందేమాతరం శ్రీనివాస్‌ గారి వల్ల ఒక పాటలో డైలాగ్‌ చెప్పాల్సి వచ్చింది. అది విన్న కోడి రామకృష్ణగారు ఈ అమ్మాయి బాగా డబ్బింగ్‌ చెబుతోందన్నారు. దాంతో మళ్లీ డబ్బింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. పాట గంట నుంచి గంటన్నర ఉంటుంది. ఇక డబ్బింగ్‌ విషయానికొస్తే ఒక ఏడాదిలో సినిమాలో 36 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌ చెప్పడం నాకు సరదా. ఒకానొక సందర్భంలో.. కొంతమంది దర్శకులు సినిమా అవకాశం ఇవ్వలేదు. కానీ 'సక్సెస్‌ స్పీక్స్‌ ఎవ్రీథింగ్‌' కదా.. కాబట్టి నో చెప్పే అవకాశం లేకుండా పోయింది. నాకు 19ఏళ్లకే పెళ్లయింది. 20వ సంవత్సరంలో బాబు పుట్టాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆశా భోంస్లే పాడాల్సిన పాట మీరు పాడారట నిజమేనా?

సునీత: ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. మామూలుగా 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' ఆశాభోంస్లే గారు పాడాల్సిన పాట. ఆ పాట పాడే అవకాశం నాకు వచ్చింది. అయితే, నేను పాడిన పాటను విన్న భోంస్లే గారు.. 'ఆ అమ్మాయి చాలా బాగా పాడింది. ఆమెతో ఇంకా పాడించండి' అని అన్నారు. నా కెరీర్‌లో 'గులాబీ' సినిమా తర్వాత బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ పాట.

కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు ఉంది..?

సునీత: ఈతరం తల్లిదండ్రుల ముందుచూపు మా పేరెంట్స్‌కు అప్పట్లోనే ఉంది. అయితే డాక్టర్‌, లేకుంటే ఇంజినీర్‌, లేదా చార్టెడ్‌ అకౌంటెంట్, కనీసం టీచర్‌ అవ్వాలనుకునే సమాజంలోనూ నేను రాణించగల రంగాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ నన్ను గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్లి సంగీతం నేర్పించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక్కక్షణం కూడా నన్ను విడిచి ఉండేవారు కాదు. నాన్నమ్మ, మేనత్త మొత్తం ఇలా అందరూ ఎంతో సహకరించేవారు.

వేర్వేరు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పడం ఎలా సాధ్యమైంది.

సునీత: ప్రతి ఒక్కరికీ ఒక మేనరిజం ఉంటుంది. ఉదాహరణకు శ్రియ అయితే డైలాగ్‌ డెలివరీ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అలా వాళ్ల మేనరిజాన్ని గమనించి డబ్బింగ్‌ చెప్పేదాన్ని. మొదటిసారిగా రాశీగారికి ఆ తర్వాత సౌందర్యగారికి డబ్బింగ్‌ చెప్పాను. చిరంజీవిగారి సినిమా 'చూడాలని ఉంది'లో డబ్బింగ్‌ చెప్పాలనగానే నేను ఊహల్లో నుంచి సైతం పారిపోయాను. ఈ సినిమాలో గట్టిగట్టిగా అరవాల్సి వస్తుంది. నీ గొంతేమో చాలా లేతగా ఉంది. 'తేడా వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది జాగ్రత్త' అని ఓ సీనియర్‌ సంగీత దర్శకులు చెప్పారు. సరే.. చిరంజీవిగారిని చూడ్డానికైనా వెళదామని వెళ్లాను. తీరా ఆడిషన్‌ సమయంలో భయం మొదలైంది.

'పద్మావతీ.. పద్మావతీ.. నీ ఎర్రని మూతి' డైలాగ్‌నే సింగిల్‌ టేక్‌లోనే ఓకే చెప్పారు. రేపటి నుంచి డబ్బింగ్‌కు రావాలని చెప్పారు. అప్పటికీ డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒకవైపు నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ, వాళ్లకు మాటిచ్చాను. మేనేజర్‌కు ఫోన్‌ చేసి సారీ చెబుదామని అనుకున్నాను. నిజంగానే ఫోన్‌ చేశాను. 'అనుకోకుండా విశాఖపట్నం వెళ్లి పదిరోజుల తర్వాత వచ్చాను' అని చెప్పాను. ఆయన ఎంతో సున్నితంగా స్పందించి 'వచ్చేశారా.. సరే రేపట్నుంచి డబ్బింగ్‌కు రాండమ్మా' అని చెప్పారు. ఇక నేను మరోమాట మాట్లాడలేకపోయాను.

ఆ తర్వాత అది కూడా డబ్బింగ్‌ ప్రత్యామ్నాయంగా మారింది. జయం సినిమాలో 'వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ..' డైలాగ్‌ చెప్పినప్పుడు ఏంటిదీ..? అనుకున్నాను. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ 'రావమ్మా.. ర.. రా..' అనడం మొదలుపెట్టారు. ఆ సినిమాతో నాకు నంది అవార్డు వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హీరోయిన్‌గా చేయమని ఎవరైనా అడిగారా..?

సునీత: చాలా మంది అడిగారు. రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణారెడ్డిగారు.. ఇంకా చాలా మంది దర్శకులు అడిగారు. కానీ కెమెరా వెనుక మజా ఆస్వాదించిన తర్వాత నాది కాని ప్రపంచంలోకి వెళ్లాలనుకోలేదు. డబ్బింగ్‌ అవకాశాలు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం పాటకే ఇచ్చేదాన్ని. పాట ఉన్నరోజు డబ్బింగ్‌ చెప్పేదాన్ని కాదు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు హైదరాబాద్‌ నుంచి చెన్నైకి తిరుగుతూ ఉండేదాన్ని. ఉదయం పాట పాడి మధ్యాహ్నం నుంచి డబ్బింగ్‌ చెప్పేదాన్ని. దానికి దర్శకులూ సహకరించేవారు. రికార్డింగ్‌ లేని సమయంలో డబ్బింగ్‌ చెప్పమని కోరేవారు.

సత్యసాయిబాబా 'చెయ్యెత్తితే పాట మధ్యలో ఆపేయాలి' అన్నారట!

సునీత: బ్రహ్మోత్సవాల్లో పాడాలని తిరుపతి నుంచి పిలుపు వస్తే ఆ వేంకటేశ్వరస్వామి ఆజ్ఞగా భావించి వెళ్లేదాన్ని. నేను నాస్తికురాలిని కాదు. అదే సమయంలో సత్యసాయిబాబాను దైవ స్వరూపంగా భావించనూలేదు. అద్భుతమైన మనిషిగా మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ఆశ్రమం నుంచి ఒకసారి ఫోన్‌ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత బాబా నాతో మాట్లాడారు.

'ఇక్కడికి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి ఇంకా చాలామంది గొప్ప గాయకులు వచ్చి వెళ్లారు. ప్రస్తుతం మీకు పిలుపు వచ్చింది. అయితే మీకు పాడే అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ఒకవేళ వచ్చినా పాట ఆపేయాల్సిన సందర్భం వస్తే చేయెత్తిన వెంటనే పాట మధ్యలోనైనా సరే ఆపేయాలి. మీరు పేరున్న గాయని కాబట్టి ఏమీ అనుకోవద్దు' అని చెప్పారు. సరే.. అని పాడటం మొదల పెట్టి.. ఒకటి.. రెండు.. పది భక్తి గీతాలు పాడాను. పాట పాడుతూ కళ్ల నుంచి నీళ్లు వచ్చినా నాకు తెలియలేదు.

ఆ తర్వాత బాబా నన్ను పిలిచి నా మెడలో ఒక గొలుసు వేసి బంగారు తల్లి.. బంగారుతల్లి అంటూ దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. నా జీవితం గురించి ఆయన మాట్లాడటం ఎంతో గర్వంగా అనిపించింది. 'నీకు కావాల్సింది కష్టపడి సాధించుకోవచ్చు. కానీ, నీతోపాటు ఒకరుంటారని జీవితంలో ఎప్పుడూ అనుకోవద్ద'ని ఆయన చెప్పారు. ఏ పని చేస్తున్నా ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. నా విషయంలో ఆయన చెప్పినవన్నీ కచ్చితంగా జరిగాయి.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీరు అన్నమాచార్య పాట పాడితే ప్రైజ్‌ కచ్చితంగా వచ్చేదట!

సునీత: 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం నా జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. 'అన్నమయ్య సంగీత నృత్య కళాశాల' మా మ్యూజిక్‌ స్కూల్‌ పేరది. నేను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎటు చూసినా అన్నమాచార్య సంకీర్తనలే వినిపించేవి. ఒక గదిలో వీణ, మరో గదిలో భరతనాట్యం.. ఇలా నాకు అన్నమయ్య సంకీర్తనలు అప్పటి నుంచే పరిచయం. అప్పట్లో తిరుపతి నుంచి పిలుపొచ్చినా ఏదైనా పోటీల్లో నేను పాల్గొన్నా అన్నమాచార్య పాట పాడితే ప్రైజ్‌ గ్యారంటీ.

జీవితంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

సునీత: ఒకానొక సమయంలో నా వ్యక్తిగత జీవితం నా చేతుల్లో నుంచి అదుపు తప్పింది. రకరకాల ఒత్తిళ్ల వల్ల కెరీర్‌పై ఏకాగ్రత కోల్పోయాను. పిల్లల్ని చూసుకుంటూ.. కుటుంబాన్ని చూసుకుంటూ.. మూడు, నాలుగు పడవల మీద ఒకేసారి ప్రయాణించినట్లు అనిపించింది. అదే సమయంలో రకరకాల మాటలు వినపడుతుండేవి. ఒక సమయంలో చాలా ప్రతి కూల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మూడేళ్ల పాటు అన్నమయ్య పాటు వింటూ.. పాటలు వినడమే కాదు విశ్లేషణ కూడా వినేదాన్ని. దాని వల్ల ప్రతి దానికీ ఎక్కువగా రియాక్ట్‌ అవడం వంటి లక్షణాలు కొంచెం తగ్గాయి. ఆ సమయంలో వేంకటేశ్వరస్వామి వారికి అన్నీ నేను.. నాకు అన్నీ ఆయనే అన్నట్లుగా మారిపోయాను.

తెలుగులోకి పరభాష గాయకులు వస్తున్నారు కదా..?

సునీత: అది పెద్ద విషయం కాదు. బాలుగారు వెళ్లి హిందీలో పాడారు.. తమిళం, కన్నడలోనూ పాడారు.. ఆయనను పరభాష అని ఎవరూ అనలేదు. మనవాడు అన్న భావించదగ్గ టాలెంట్‌ ఆయనది కాబట్టి ఎటువంటి విమర్శలు రాలేదు. మన దగ్గరికి శంకరమహదేవన్‌ గారు వచ్చారు. ఆయన పాడేటప్పుడూ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర గాయకుల విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని పదాలు, అక్షరాల ఉచ్చారణ పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతుంది.

ఒకే సినిమాలో రెండు భిన్నమైన పాటలు పాడిన సందర్భం ఏదైనా ఉందా?

సునీత: 'శ్రీరామదాసు' సినిమాలో రెండు విభిన్నరకాల పాటలు పాడాను. ఒకటి 'ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువైనాడు'.. మరోటి 'చాలు.. చాలు.. చాలు' ఈ రెండూ పూర్తి భిన్నమైనవి. కీరవాణి గారి వల్ల ఒకేసినిమాలో రెండు భిన్నమైన పాటలు పాడటం సాధ్యమైంది. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారు మెచ్చుకున్నారు. 'ఇదిగిదిదుగో నా రాముడు' పాట విన్న సుశీలమ్మ కూడా 'అరె అచ్చం నాలాగే పాడవే' చివర్లో అని ఆశ్చర్యపోయారు. అది చాలు కదా జీవితానికి అనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ అభిమాన సంగీత దర్శకుడు ఎవరు?

సునీత: నా అభిమాన సంగీత దర్శకులు కీరవాణిగారు. ఆయన మా పాపతోనూ ఒక పాట పాడించారు. అయితే నా గొంతుకు, నా కూతురి గొంతుకు నింగికి, నేలకు ఉన్న తేడా ఉంది. ఆమె వెస్టర్న్‌ ఎక్కువగా పాడుతుంది. నేను తెలుగులో ఎలా పాడుతానో తను వెస్టర్న్‌లో అంతే చక్కగా పాడుతుంది. బాబు డిగ్రీ అయిపోయింది. చాలా బాగా డ్యాన్స్‌ చేస్తాడు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయాలని సూచించాను.

Singer Sunitha Birthday Special
కుమార్తె, కుమారుడితో సునీత

ఇన్నేళ్ల మీ సింగింగ్‌ కెరీర్‌లో ఏం తెలుసుకున్నారు?

సునీత: మన టాలెంట్‌ను గుర్తించడం అనేది అవతలి వాళ్ల పని. మనకు మనం ఆసరగా నిల్చోవాలి. ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం గిరి గీసుకొని ప్రపంచంలో బతుకుతున్నాం. కళ్లు తెరచి చూస్తే ప్రపంచంలో మన కోసం తాపత్రయపడేవాళ్లు చాలా మంది ఉంటారు.

ఇదీ చూడండి: ఆ సినిమా గురించి అనసూయ ఏం చెప్పిందంటే?

సినిమా తెరపై కనిపించే హీరోలు-హీరోయిన్లు నాణేనికి ఒకవైపు అయితే.. తెర వెనకున్న మనకు కనిపించని పాత్రలే నాణేనికున్న రెండో భాగం. ఆ రెండో భాగంలో గాయకులు, డబ్బింగ్‌ ఆర్టిస్టులూ పాత్రధారులే. గాయనిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత డబ్బింగ్‌ మొదలుపెట్టి.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు నేపథ్య గాయని సునీత. నేడు (మే 10) ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి చెప్పిన విశేషాలను ఆమె మాటల్లోనే విందాం.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీ ప్రస్థానం ఎలా మొదలైంది..!

సునీత: మా అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. పరిస్థితుల ప్రభావం వల్ల తాను సాధించలేనిది తన కూతురిగా నాతో సాధించాలనుకుంది. ఆరేళ్ల వయసులోనే నాకు సంగీతం నేర్పించేందుకు గురువు సూర్యారావుగారి దగ్గరకు తీసుకెళ్లింది. 'ఇంత చిన్నపిల్లకు నేనేం సంగీతం నేర్పుతాను' అని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి నా జీవితంలో అన్నీ ఆశ్చర్యార్థకాలే. ఒక పాట పాడి వినిపించమంటే ఏదో ఒక కీర్తన పాడాను. వెంటనే ఆయన.. 'చూడటానికి బక్కగా ఉంది కానీ.. గొంతు చాలా బాగుంది. శృతి చక్కగా ఉంది. నేను మీ పాపకు సంగీతం నేర్పిస్తా'నని నన్ను శిష్యురాలిగా స్వీకరించారు.

చిన్నప్పుడు మీరు ఏడుస్తున్నా మీ తాతగారు సంగీతంలా ఫీలయ్యేవారట..?

సునీత: మా అమ్మ నన్ను ఎలాగైనా సంగీతం వైపు మళ్లించి మంచి గాయనిని చేయాలని అనుకునేది. అందుకే నా ప్రతీ కదలికలోనూ సంగీతం వెతికేవారు. ఒకసారి నేను ఏడుస్తున్నప్పుడు మా పెద్ద తాతయ్య వచ్చి 'ఇదేదో రాగంలా ఉందే' అని అన్నారు. బహుశా అప్పటి నుంచే అనుకుంటా నన్ను ఎలాగైనా పెద్ద గాయనిగా చూడాలని మా అమ్మ నిర్ణయించుకొని ఉంటారు.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీ చదువు ఎక్కడ ఎలా సాగింది?

సునీత: నా చదువు మొత్తం గుంటూరులోనే జరిగింది. ఇంటర్‌ పూర్తయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. సెలవు రోజుల్లో హైదరాబాద్‌ వచ్చి ఆ తర్వాత ఇక్కడే సెటిల్‌ అయ్యాం.

పదిహేడేళ్లకే సినిమా అవకాశం వచ్చిందట!

సునీత: సంగీతం నేర్చుకుంటూనే ఆలిండియా రేడియోలో పాడేదాన్ని. 17ఏళ్ల వయసులో దూరదర్శన్‌లో పాడే అవకాశం వచ్చింది. రకరకాల పాటలు పాడేదాన్ని.. శ్రోతలు సైతం మళ్లీ మళ్లీ సునీత గొంతు వినాలని కోరుకునేవారు. అప్పటికీ నాలో కొంచెం భయం ఉండేది. కానీ నన్ను ముందుకు తీసుకెళ్లింది మాత్రం లలిత సంగీతమే. కృష్ణమోహన్‌ గారి పాటలు పాడుతూ.. భాష మీద అభిమానం పెంచుకున్నాను. లలిత సంగీతం ప్రభావంతోనే నాకు సినిమాలో సులభంగా అవకాశం లభించింది.

మొదటి అవకాశం ఎవరిచ్చారు..?

సునీత: కృష్ణ నీరజ్‌, నాగరాజుగారు క్యాసెట్‌ పాటలకు ఎక్కువగా కంపోజింగ్‌ చేస్తుండేవారు. అందరం కలిసి రెగ్యులర్‌గా రికార్డింగ్‌లో పాల్గొనేవాళ్లం. 'గులాబీ' సినిమా సంగీత దర్శకులైన శశి ప్రీతమ్‌- నాగరాజుగారు స్నేహితులు. ఆ సినిమాలో 'ఈ వేళలో నీవు' అప్పటికే రికార్డింగ్‌ పూర్తయ్యింది. అయితే, ఫీమేల్‌ వెర్షన్‌లో అయితే ఈ పాట ఇంకా బాగుంటుందని భావించి నాకు అవకాశం ఇచ్చారు. నేను మొదటిసారి పాడిన తర్వాత గొంతు ఇంకొంచెం బాగుంటే సరిపోయేదని అన్నారు. 'కొంచెం టైం ఇవ్వండి' అని చెప్పాను. సినిమా పాట పాడదామనుకుంటే నా గొంతు బాగా లేదంటారా..? అని అనుకున్నాను. మళ్లీ పాడాను. ఆ తర్వాత ఓకే చేశారు. ఆ తర్వాత కృష్ణవంశీగారి సినిమాల్లో వరుసగా నాతో పాడించారు. ఆ తర్వాత.. కృష్ణారెడ్డిగారు.. ఆ తర్వాత.. అలా అవకాశాలు పెరిగాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ మొదటి పాట ఎన్నిసార్లు పాడినా ఏ మార్పు కనిపించదు..!

సునీత: 'ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..' పాట నేను ఇప్పుడు ఇలా (చేతలు మొహానికి అడ్డు పెట్టుకొని) వింటాను. నా గొంతు ఎంత పీలగా ఉందనుకుంటుంటాను. ఆ పాట ఇప్పుడేతే ఇంకా బాగా పాడేదాన్ని అనుకుంటాను. అయితే పాట పాడేది నేనే కాబట్టి మీకు పెద్ద తేడా కనిపించదు. కానీ నాకు తెలిసిపోతుంది.

డబ్బింగ్‌ చెప్పడం ఎలా మొదలైంది..

సునీత: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అనగనగా ఒకరోజు' సినిమాలో నేను పాట పాడాను. నా గొంతు విన్న వర్మగారు.. 'ఈమెతో హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పిస్తే బాగుంటుంది. ఈమెను చెన్నై తీసుకెళ్లాలి' అన్నారు. మొదట రికార్డింగ్‌ అంటేనే భయపడే నాకు.. డబ్బింగ్‌ అనగానే ఆ భయం మరింత పెరిగింది. అసలు నా జీవితం ఎటు వెళుతుందో అనుకున్నాను. అసలు ఒప్పుకోవాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. చివరకు చెన్నై వెళ్లాను. వారం రోజులు అక్కడే ఉన్నాను. 'గులాబీ' సినిమాలో పాడింది ఈ అమ్మాయే అని చెన్నైలోనూ ప్రచారం జరిగింది. అవకాశాలు మొదలయ్యాయి.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

ఆ సమయంలో సంగీత దర్శకులు కీరవాణిగారు, ఇళయరాజాగారిని స్వయంగా కలిశాను. చెన్నైలో ఉన్న సమయంలో అనుకోకుండా నాతో ఇళయరాజాగారు ఒక పాట పాడించారు. ఆ రోజు ఒక రికార్డింగ్‌ ఉంది. ఇళయరాజా గారు, ఎస్పీ చరణ్‌ గారు, బాలు గారు, శైలజ గారు కలిసి పాడాల్సిన పాట అది. శైలజ గారు విమానం మిస్‌ అవడం వల్ల రాలేకపోయారు. ఎస్పీ చరణ్‌గారికి అదే మొదటి పాట. శైలజగారు రాకపోవడం వల్ల 'మీరు పాడతారా' అని ఇళయరాజా గారు అడిగారు. అయితే, అది తమిళ్‌ పాట. నేను నేర్చుకొని మరీ ఆ పాట పాడాను. అలా తమిళ సినీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాను. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇళయరాజాగారు పిలవడం, అదే సమయంలో కీరవాణి దగ్గర రకరకాల సినిమాల్లో పాడుతూ ఉండేదాన్ని. కృష్ణారెడ్డిగారి సినిమాలో పాడేందుకు హైదరాబాద్‌కు.. చెన్నైకి అటూ ఇటు తిరుగుతూ ఉండేదాన్ని.

ఇటు నేపథ్య గాయనిగా, అటు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సమయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?

సునీత: ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఒక్కోసారి లెక్కకు మించి టేక్‌లు తీసుకున్నప్పుడు ఏడ్చేదాన్ని. దీంతో ఇక ఎక్కువ డబ్బింగ్‌లే చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో 'పెళ్లిపందిరి' సినిమాలో వందేమాతరం శ్రీనివాస్‌ గారి వల్ల ఒక పాటలో డైలాగ్‌ చెప్పాల్సి వచ్చింది. అది విన్న కోడి రామకృష్ణగారు ఈ అమ్మాయి బాగా డబ్బింగ్‌ చెబుతోందన్నారు. దాంతో మళ్లీ డబ్బింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. పాట గంట నుంచి గంటన్నర ఉంటుంది. ఇక డబ్బింగ్‌ విషయానికొస్తే ఒక ఏడాదిలో సినిమాలో 36 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌ చెప్పడం నాకు సరదా. ఒకానొక సందర్భంలో.. కొంతమంది దర్శకులు సినిమా అవకాశం ఇవ్వలేదు. కానీ 'సక్సెస్‌ స్పీక్స్‌ ఎవ్రీథింగ్‌' కదా.. కాబట్టి నో చెప్పే అవకాశం లేకుండా పోయింది. నాకు 19ఏళ్లకే పెళ్లయింది. 20వ సంవత్సరంలో బాబు పుట్టాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆశా భోంస్లే పాడాల్సిన పాట మీరు పాడారట నిజమేనా?

సునీత: ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. మామూలుగా 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' ఆశాభోంస్లే గారు పాడాల్సిన పాట. ఆ పాట పాడే అవకాశం నాకు వచ్చింది. అయితే, నేను పాడిన పాటను విన్న భోంస్లే గారు.. 'ఆ అమ్మాయి చాలా బాగా పాడింది. ఆమెతో ఇంకా పాడించండి' అని అన్నారు. నా కెరీర్‌లో 'గులాబీ' సినిమా తర్వాత బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ పాట.

కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు ఉంది..?

సునీత: ఈతరం తల్లిదండ్రుల ముందుచూపు మా పేరెంట్స్‌కు అప్పట్లోనే ఉంది. అయితే డాక్టర్‌, లేకుంటే ఇంజినీర్‌, లేదా చార్టెడ్‌ అకౌంటెంట్, కనీసం టీచర్‌ అవ్వాలనుకునే సమాజంలోనూ నేను రాణించగల రంగాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ నన్ను గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్లి సంగీతం నేర్పించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక్కక్షణం కూడా నన్ను విడిచి ఉండేవారు కాదు. నాన్నమ్మ, మేనత్త మొత్తం ఇలా అందరూ ఎంతో సహకరించేవారు.

వేర్వేరు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పడం ఎలా సాధ్యమైంది.

సునీత: ప్రతి ఒక్కరికీ ఒక మేనరిజం ఉంటుంది. ఉదాహరణకు శ్రియ అయితే డైలాగ్‌ డెలివరీ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అలా వాళ్ల మేనరిజాన్ని గమనించి డబ్బింగ్‌ చెప్పేదాన్ని. మొదటిసారిగా రాశీగారికి ఆ తర్వాత సౌందర్యగారికి డబ్బింగ్‌ చెప్పాను. చిరంజీవిగారి సినిమా 'చూడాలని ఉంది'లో డబ్బింగ్‌ చెప్పాలనగానే నేను ఊహల్లో నుంచి సైతం పారిపోయాను. ఈ సినిమాలో గట్టిగట్టిగా అరవాల్సి వస్తుంది. నీ గొంతేమో చాలా లేతగా ఉంది. 'తేడా వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది జాగ్రత్త' అని ఓ సీనియర్‌ సంగీత దర్శకులు చెప్పారు. సరే.. చిరంజీవిగారిని చూడ్డానికైనా వెళదామని వెళ్లాను. తీరా ఆడిషన్‌ సమయంలో భయం మొదలైంది.

'పద్మావతీ.. పద్మావతీ.. నీ ఎర్రని మూతి' డైలాగ్‌నే సింగిల్‌ టేక్‌లోనే ఓకే చెప్పారు. రేపటి నుంచి డబ్బింగ్‌కు రావాలని చెప్పారు. అప్పటికీ డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒకవైపు నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ, వాళ్లకు మాటిచ్చాను. మేనేజర్‌కు ఫోన్‌ చేసి సారీ చెబుదామని అనుకున్నాను. నిజంగానే ఫోన్‌ చేశాను. 'అనుకోకుండా విశాఖపట్నం వెళ్లి పదిరోజుల తర్వాత వచ్చాను' అని చెప్పాను. ఆయన ఎంతో సున్నితంగా స్పందించి 'వచ్చేశారా.. సరే రేపట్నుంచి డబ్బింగ్‌కు రాండమ్మా' అని చెప్పారు. ఇక నేను మరోమాట మాట్లాడలేకపోయాను.

ఆ తర్వాత అది కూడా డబ్బింగ్‌ ప్రత్యామ్నాయంగా మారింది. జయం సినిమాలో 'వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ..' డైలాగ్‌ చెప్పినప్పుడు ఏంటిదీ..? అనుకున్నాను. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ 'రావమ్మా.. ర.. రా..' అనడం మొదలుపెట్టారు. ఆ సినిమాతో నాకు నంది అవార్డు వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హీరోయిన్‌గా చేయమని ఎవరైనా అడిగారా..?

సునీత: చాలా మంది అడిగారు. రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణారెడ్డిగారు.. ఇంకా చాలా మంది దర్శకులు అడిగారు. కానీ కెమెరా వెనుక మజా ఆస్వాదించిన తర్వాత నాది కాని ప్రపంచంలోకి వెళ్లాలనుకోలేదు. డబ్బింగ్‌ అవకాశాలు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం పాటకే ఇచ్చేదాన్ని. పాట ఉన్నరోజు డబ్బింగ్‌ చెప్పేదాన్ని కాదు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు హైదరాబాద్‌ నుంచి చెన్నైకి తిరుగుతూ ఉండేదాన్ని. ఉదయం పాట పాడి మధ్యాహ్నం నుంచి డబ్బింగ్‌ చెప్పేదాన్ని. దానికి దర్శకులూ సహకరించేవారు. రికార్డింగ్‌ లేని సమయంలో డబ్బింగ్‌ చెప్పమని కోరేవారు.

సత్యసాయిబాబా 'చెయ్యెత్తితే పాట మధ్యలో ఆపేయాలి' అన్నారట!

సునీత: బ్రహ్మోత్సవాల్లో పాడాలని తిరుపతి నుంచి పిలుపు వస్తే ఆ వేంకటేశ్వరస్వామి ఆజ్ఞగా భావించి వెళ్లేదాన్ని. నేను నాస్తికురాలిని కాదు. అదే సమయంలో సత్యసాయిబాబాను దైవ స్వరూపంగా భావించనూలేదు. అద్భుతమైన మనిషిగా మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ఆశ్రమం నుంచి ఒకసారి ఫోన్‌ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత బాబా నాతో మాట్లాడారు.

'ఇక్కడికి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి ఇంకా చాలామంది గొప్ప గాయకులు వచ్చి వెళ్లారు. ప్రస్తుతం మీకు పిలుపు వచ్చింది. అయితే మీకు పాడే అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ఒకవేళ వచ్చినా పాట ఆపేయాల్సిన సందర్భం వస్తే చేయెత్తిన వెంటనే పాట మధ్యలోనైనా సరే ఆపేయాలి. మీరు పేరున్న గాయని కాబట్టి ఏమీ అనుకోవద్దు' అని చెప్పారు. సరే.. అని పాడటం మొదల పెట్టి.. ఒకటి.. రెండు.. పది భక్తి గీతాలు పాడాను. పాట పాడుతూ కళ్ల నుంచి నీళ్లు వచ్చినా నాకు తెలియలేదు.

ఆ తర్వాత బాబా నన్ను పిలిచి నా మెడలో ఒక గొలుసు వేసి బంగారు తల్లి.. బంగారుతల్లి అంటూ దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. నా జీవితం గురించి ఆయన మాట్లాడటం ఎంతో గర్వంగా అనిపించింది. 'నీకు కావాల్సింది కష్టపడి సాధించుకోవచ్చు. కానీ, నీతోపాటు ఒకరుంటారని జీవితంలో ఎప్పుడూ అనుకోవద్ద'ని ఆయన చెప్పారు. ఏ పని చేస్తున్నా ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. నా విషయంలో ఆయన చెప్పినవన్నీ కచ్చితంగా జరిగాయి.

Singer Sunitha Birthday Special
గాయని సునీత

మీరు అన్నమాచార్య పాట పాడితే ప్రైజ్‌ కచ్చితంగా వచ్చేదట!

సునీత: 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం నా జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. 'అన్నమయ్య సంగీత నృత్య కళాశాల' మా మ్యూజిక్‌ స్కూల్‌ పేరది. నేను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎటు చూసినా అన్నమాచార్య సంకీర్తనలే వినిపించేవి. ఒక గదిలో వీణ, మరో గదిలో భరతనాట్యం.. ఇలా నాకు అన్నమయ్య సంకీర్తనలు అప్పటి నుంచే పరిచయం. అప్పట్లో తిరుపతి నుంచి పిలుపొచ్చినా ఏదైనా పోటీల్లో నేను పాల్గొన్నా అన్నమాచార్య పాట పాడితే ప్రైజ్‌ గ్యారంటీ.

జీవితంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

సునీత: ఒకానొక సమయంలో నా వ్యక్తిగత జీవితం నా చేతుల్లో నుంచి అదుపు తప్పింది. రకరకాల ఒత్తిళ్ల వల్ల కెరీర్‌పై ఏకాగ్రత కోల్పోయాను. పిల్లల్ని చూసుకుంటూ.. కుటుంబాన్ని చూసుకుంటూ.. మూడు, నాలుగు పడవల మీద ఒకేసారి ప్రయాణించినట్లు అనిపించింది. అదే సమయంలో రకరకాల మాటలు వినపడుతుండేవి. ఒక సమయంలో చాలా ప్రతి కూల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మూడేళ్ల పాటు అన్నమయ్య పాటు వింటూ.. పాటలు వినడమే కాదు విశ్లేషణ కూడా వినేదాన్ని. దాని వల్ల ప్రతి దానికీ ఎక్కువగా రియాక్ట్‌ అవడం వంటి లక్షణాలు కొంచెం తగ్గాయి. ఆ సమయంలో వేంకటేశ్వరస్వామి వారికి అన్నీ నేను.. నాకు అన్నీ ఆయనే అన్నట్లుగా మారిపోయాను.

తెలుగులోకి పరభాష గాయకులు వస్తున్నారు కదా..?

సునీత: అది పెద్ద విషయం కాదు. బాలుగారు వెళ్లి హిందీలో పాడారు.. తమిళం, కన్నడలోనూ పాడారు.. ఆయనను పరభాష అని ఎవరూ అనలేదు. మనవాడు అన్న భావించదగ్గ టాలెంట్‌ ఆయనది కాబట్టి ఎటువంటి విమర్శలు రాలేదు. మన దగ్గరికి శంకరమహదేవన్‌ గారు వచ్చారు. ఆయన పాడేటప్పుడూ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర గాయకుల విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని పదాలు, అక్షరాల ఉచ్చారణ పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతుంది.

ఒకే సినిమాలో రెండు భిన్నమైన పాటలు పాడిన సందర్భం ఏదైనా ఉందా?

సునీత: 'శ్రీరామదాసు' సినిమాలో రెండు విభిన్నరకాల పాటలు పాడాను. ఒకటి 'ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువైనాడు'.. మరోటి 'చాలు.. చాలు.. చాలు' ఈ రెండూ పూర్తి భిన్నమైనవి. కీరవాణి గారి వల్ల ఒకేసినిమాలో రెండు భిన్నమైన పాటలు పాడటం సాధ్యమైంది. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారు మెచ్చుకున్నారు. 'ఇదిగిదిదుగో నా రాముడు' పాట విన్న సుశీలమ్మ కూడా 'అరె అచ్చం నాలాగే పాడవే' చివర్లో అని ఆశ్చర్యపోయారు. అది చాలు కదా జీవితానికి అనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ అభిమాన సంగీత దర్శకుడు ఎవరు?

సునీత: నా అభిమాన సంగీత దర్శకులు కీరవాణిగారు. ఆయన మా పాపతోనూ ఒక పాట పాడించారు. అయితే నా గొంతుకు, నా కూతురి గొంతుకు నింగికి, నేలకు ఉన్న తేడా ఉంది. ఆమె వెస్టర్న్‌ ఎక్కువగా పాడుతుంది. నేను తెలుగులో ఎలా పాడుతానో తను వెస్టర్న్‌లో అంతే చక్కగా పాడుతుంది. బాబు డిగ్రీ అయిపోయింది. చాలా బాగా డ్యాన్స్‌ చేస్తాడు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయాలని సూచించాను.

Singer Sunitha Birthday Special
కుమార్తె, కుమారుడితో సునీత

ఇన్నేళ్ల మీ సింగింగ్‌ కెరీర్‌లో ఏం తెలుసుకున్నారు?

సునీత: మన టాలెంట్‌ను గుర్తించడం అనేది అవతలి వాళ్ల పని. మనకు మనం ఆసరగా నిల్చోవాలి. ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం గిరి గీసుకొని ప్రపంచంలో బతుకుతున్నాం. కళ్లు తెరచి చూస్తే ప్రపంచంలో మన కోసం తాపత్రయపడేవాళ్లు చాలా మంది ఉంటారు.

ఇదీ చూడండి: ఆ సినిమా గురించి అనసూయ ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.