తమిళ స్టార్ హీరో శింబు.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం చేరారు. అయితే శింబు కొవిడ్ బారిన పడలేదని, వైరల్ ఇన్ఫెక్షన్- తీవ్రమైన గొంతు నొప్పి కారణంగానే ఆస్పత్రిలో చేరారని తేలింది. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
టైమ్లూప్ కథతో తీసిన 'మానాడు' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు శింబు. ప్రస్తుతం గౌతమ్ మేనన్ దర్శకత్వం వహిస్తున్న 'వెందు తనిందతు కాడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత 'పాతు తళా' షూటింగ్లో పాల్గొంటారు.
![Simbu new movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13881890_simbu11.jpg)
ఇవీ చదవండి: